అన్వేషించండి

KCR : ప్రధానికి వెల్కం చెప్పేందుకు కేసీఆర్ నో , తలసానికి చాన్స్ ! మోడీ పాల్గొనే కార్యక్రమాలకూ డుమ్మా కొడతారా ?

తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ వెనుకడుగు వేశారు. తలసానికి చాన్సిచ్చారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారా? డుమ్మా కొడతారా అన్నదానిపై స్పష్టత లేదు.

తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి ఉన్న సీఎం కేసీఆర్ ఆ బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాని మోడీకి స్వాగతం, వీడ్కోలు కూడా ముఖ్యమంత్రి తరపున తలసాని శ్రీనివాస్ యాదవే చెబుతారు. ప్రధాని పర్యటనకు ఒక్క రోజు ముందుగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. 


KCR :  ప్రధానికి వెల్కం చెప్పేందుకు కేసీఆర్ నో , తలసానికి చాన్స్ ! మోడీ పాల్గొనే కార్యక్రమాలకూ డుమ్మా కొడతారా ?

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు చేయలేదని.. అలాగే అసలు బడ్జెట్ దేశానికి ఉపయోగపడదని విమర్శిస్తూ కేసీఆర్ ఫిబ్రవరి ఒకటో తేదీన రెండున్నర గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రధానమంత్రి మోడీని, బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ఇంత తీవ్రంగా విమర్శించిన తరవాత మరి తెలంగాణకు వస్తున్న మోడీ పర్యటనలో పాల్గొంటారా అన్నదానిపైనా చర్చలు జరిగాయి.కేసీఆర్ కూడాప్రెస్‌మీట్‌లో  ప్రధాని పర్యటనలో పాల్గొంటానని.. నేరుగా ఆయనకే అన్నీ చెబుతానని స్పష్టం చేశారు.  ప్రోటో కాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం చెబుతారని .. కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అధికారిక కార్యక్రమాలకు రాజకీయానికి సంబంధం లేదని టీఆర్ఎస్ వర్గాలు కూడా నిన్చెనటి వరకూ బుతూ వచ్చాయి . దీంతో ప్రధాని పర్యటనలో పాల్గొంటారని అందరూ అనుకున్నారు. 

శుక్రవారం ఉదయం వరకూ కేసీఆర్ ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారని .. ఇక్రిశాట్‌లోనూ.. అలాగే ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది కార్యక్రమాల్లోనూ కలిసే పాల్గొంటారని భావిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇన్ని తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత మళ్లీ ప్రధాని మోడీకి స్వాగతం చెప్పి ఆయనతో సాధారణంగా వ్యవహరిస్తే కేసీఆర్ పోరాటం అంతా బూటకమేనని విపక్షాలు ప్రచారం చేస్తాయి. ప్రజల్లో అలాంటి అభిప్రాయమే ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అన్ని పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు. వారిలోనూ ఎలాంటి సందేహాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ వ్యూహకర్తలు ప్రధాని మోడీకి కేసీఆర్ స్వాగతం చెప్పేందుకు వెళ్లకపోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 

అయితే ప్రధానికి స్వాగతం చెప్పే కార్యక్రమాల బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించారు కానీ.. మోడీ పాల్గొనే కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా ఎక్కడా సమాచారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధానితో పాటు కేసీఆర్ పాల్గొంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పాల్గొంటారని ప్రధానికి నిరసన కూడా తెలియచేస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Delhi Crime: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
Embed widget