అన్వేషించండి

Why Jagan Aviod People : సీఎంగా జనానికి దూరంగా జగన్ - ఎందుకు కలవడం లేదు ? విమర్శలు ఎందుకు పట్టించుకోవడం లేదు ?

సీఎం జగన్ ప్రజల్ని కలవకపోవడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరగా ఉంటానని హామీ ఇచ్చి పదవి వచ్చాక ప్రజలకు సమయం కేటాయించకపోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.

Why Jagan Aviod People :  బారికేడ్లు, పరదాలు కట్టడం ... దుకాణాలు మూసివేయించడం ఈ రెండూ సీఎం జగన్ ఏ ఊరి పర్యటనకు వెళ్లినా కామన్. దీనిపై చాలా రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  అమెరికా అధ్యక్షుడు లాంటి వీఐపీలు వస్తే ఇండియాలో పేదరికం కనిపించకుండా ఇలా రోడ్ల పక్కన పరదాలు కట్టేవాళ్లు. కానీ ఇండియాలో పాలకులు తాము పాలిస్తున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇలా పరదాలు కట్టుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ ఏపీ సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో మాత్రం పరదాలు కామన్ అయిపోయాయి. ప్రజల్ని ఆయన కలవాలనుకోవడం లేదని అందుకే ఇలా చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో జగన్ ప్రజల్ని ప్రత్యక్షంగా కలిసే సందర్భమే ఉండటం లేదు. దీంతో పదేళ్ల పాటు జనంలోనే ఉండి అధికారం సాధించుకున్న జగన్ ఇప్పుడెందుకు ప్రజలకు దూర దూరంగా ఉంటున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 

సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ప్రజల్ని నేరుగా కలవని సీఎం జగన్ !

వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి జగన్ జనంలోనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  వైఎస్ కోసం చనిపోయారని .. వారని ఓదారుస్తానని ఓదార్పు యాత్రలు చేశారు. 2014లో  ఓడిపోయాక పాదయాత్రలు చేశారు. జనంలో ఉన్నారు . కానీ పదవి చేపట్టిన తర్వాత మాత్రం ఆయన మారిపోయారు.  ఎవర్నీ కలవడం లేదు. జనానికి దగ్గరగా ఉంటానని నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చిన జగన్ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రజలను కలిసేందుకు ఎందుకు ఆసక్తి చూపించడం లేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.  సీఎంగా పదవి చేపట్టి మూడున్నరేళ్లు దాటిపోయింది.  ఆయన ఏ దశలోనూ ప్రజలతో ఇంట‌్రాక్ట్ కాకపోవడం ఎందుకో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అంతు చిక్కడం లేదు.

మొదట్లోనే ప్రజాదర్భార్‌కు ప్రణాళిక.. ఇప్పటి వరకూ అమల్లోకి రాలేదు ! 
  
ప్రజల్ని కలిసేందుకు ప్రతీ ముఖ్యమంత్రి ప్రతీ రోజూ ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. అది సంప్రదాయం.   అధికారం చేపట్టిన మొదట్లో ఆయన ప్రజాదర్బార్  కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందు కోసం క్యాంపాఫీస్‌లోనే ప్రత్యేకంగా వేదిక కూడా కట్టారు.  తేదీ కూడా ఇచ్చారు. ఆ రోజున వెల్లువలాజనం వచ్చారు. కానీ క్యాన్సిల్ అని ఒక మాట చెప్పి అందర్నీ పంపేసారు. అది మొదలు.. ఇదిగో దర్బార్.. అదిగో దర్బార్ అని ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల్ని కలిసిందే లేదు. ఇటీవల కూడా.. అలాంటి ప్రకటన చేశారు. రోజూ గంట సేపు జనాల్ని కలుస్తానని చెప్పారు. చివరికి అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. ప్రజల్ని నేరుగా జగన్ కలిసే ప్రణాళికేమీలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చేశాయి. 

జిల్లాల పర్యటనల్లోనూ వచ్చామా.. బటన్ నొక్కామా... వెళ్లామా అన్నట్లుగా షెడ్యూల్ ! 

ఇటీవల జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.  తన దారిలో పరదాలు కట్టేస్తున్నారు. బారీ కేడ్లు పెట్టేస్తున్నారు. వందల మంది పోలీసుల్ని మోహరింప చేస్తున్నారు. దీంతో సామాన్యులెవరూ జగన్‌ను దగ్గర నుంచి చూడటానికి కూడా అవకాశం ఉండదు. రావడం..  నేరుగా స్టేజి మీదకు వెళ్లి బటన్ నొక్కి.. ప్రసంగించి వెళ్లిపోవడం చేస్తున్నారు.  ఈ తీరు చూసి చాలా మంది జనం.. పాదయాత్ర చేసిన జగనేనా అని చర్చించుకోవడం కామన్‌గా మారింది. పాదయాత్రలు చేసి.. మంచి చేస్తానని నమ్మించి.. అందుబాటులో ఉంటానని నమ్మకం కలిగించడం వల్ల ప్రజలు ఓట్లేశారని.. ఇలా చేయడం ఏమిటని విపక్ష నేతలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు.  

జగనన్నతో చెప్పుకుందాం.. ఈ సమస్యను పరిష్కరిస్తుందా?

ప్రజలతో ఏ మాత్రం కలవలేకపోతున్న తీరు వల్ల జనంలో అసంతృప్తి పెరుగుతోందని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు కూడా గుర్తించారు. అందుకే.. నేరుగా కలవాలనుకునేవారిని.. ఫోన్ ద్వారా భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం జగనన్నతో చెప్పుకుందా అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సమస్యను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయత్నం వల్ల ప్రజలు సంతృప్తి చెందితే.. జగన్ నేరుగా ప్రజల్ని కలవకపోయినా.. ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రయత్నమూ ఫెయిలతే.. జగన్ జనానికి దూరమైనట్లే అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget