అన్వేషించండి

భారతదేశ జెండాని కించపరుస్తూ మాల్దీవ్స్ మంత్రి పోస్ట్, తప్పు తెలుసుకుని క్షమాపణలు

Maldives Minister: మాల్దీవ్స్ మాజీ మంత్రి ఇటీవల భారత త్రివర్ణ పతాకాన్ని కించపరుస్తూ పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది.

Maldives Minister Mariyam Shiuna: సస్పెన్షన్‌కి గురైన మాల్దీవ్స్ మంత్రి ఇటీవల సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కించపరుస్తూ ఆమె చేసిన పోస్ట్‌ పెద్ద దుమారం రేపింది. తీవ్ర విమర్శలు రావడం వల్ల ఆమె క్షమాపణలు చెప్పారు. అయితే...ఆమె ప్రతిపక్ష పార్టీ Maldivian Democratic Party (MDP)ని విమర్శిస్తూ పోస్ట్ చేసినప్పటికీ అందులో అశోక చక్రం ఉండడం వల్ల భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, మాల్దీవ్స్ మధ్య ఇప్పటికే విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఆమె ఈ పోస్ట్ పెట్టడం అలజడి సృష్టించింది. భారతదేశ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని ఆమె కించపరిచారంటూ కొందరు తీవ్రంగా మండి పడ్డారు. ఫలితంగా ఆమె వెంటనే ఆ పోస్ట్‌ని డిలీట్ చేశారు మరియం షియునా (Mariyam Shiuna). మరియంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఆ ట్వీట్స్‌కి మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజూని ట్యాగ్ చేశారు. ఇది గమనించిన ఆమె ఆ పోస్ట్‌ని తొలగించక తప్పలేదు. 

"ఇటీవల నేను సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైందని తెలిసింది. ఇలా పోస్ట్ చేసి కొందరి మనోభావాల్ని దెబ్బ తీసినందుకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ నేనో ఫొటో పెట్టాను. అది అనుకోకుండా భారతదేశ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని పోలి ఉందని తెలిసింది. ఇది కావాలని చేసింది కాదు. అయినా సరే ఇలా అపార్థం చేసుకునేలా పోస్ట్ చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాను. భారత్‌తో మైత్రిని కొనసాగించేందుకు మాల్దీవ్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వాళ్ల అభిప్రాయాల్ని గౌరవిస్తుంది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను"

- మరియం షియునా, మాల్దీవ్స్ మాజీ మంత్రి

Image

భారత్‌ని దూరం పెడుతూ చైనాకి దగ్గరవుతున్నారు మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజూ. మాల్దీవ్స్‌లో ఉన్న 80 మంది భారత సైనికులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహమ్మద్ ముయిజూ చైనా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమది చిన్న దేశం అయినంత మాత్రాన, కవ్వించడానికి ప్రయత్నిస్తే ఊరుకోం అంటూ పరోక్షంగా భారత్‌కి హెచ్చరికలు చేశారు. ఇప్పటికే కొంత మంది సీనియర్ నేతలు ముయిజూని మందలించారు. భారత్‌తో కయ్యం పెట్టుకోవద్దని సూచించారు. కానీ...ముయిజూ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేశారు. సముద్ర తీరంలో గడిపారు. స్నోర్క్‌లింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సమయంలోనే మాల్దీవ్స్ మంత్రులు కొందరు మోదీపై విమర్శలు చేశారు. ఫలితంగా...పలువురు ప్రముఖులు మాల్దీవ్స్‌ ట్రిప్‌ని రద్దు చేసుకున్నారు. బాయ్‌కాట్‌ మాల్దీవ్స్ హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. అప్పటి నుంచి మాల్దీవ్స్‌కి వెళ్తున్న భారతీయుల సంఖ్య తగ్గిపోయింది. మోదీ పర్యటన తరవాత లక్షద్వీప్‌కి వెళ్లేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
LPG Crisis: హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. 92,612 టన్నుల ఎల్పీజీ సామర్థ్యం
హర్మూజ్ దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. 92,612 టన్నుల ఎల్పీజీ సామర్థ్యం
MI vs KKR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రికార్డు ఛేజింగ్ పై ముంబై కన్ను!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget