అన్వేషించండి

Rajiv Gandhi Case: ఆ దోషులను వెంటనే విడుదల చేయండి, రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు

Rajiv Gandhi Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Rajiv Gandhi Case:

ఆరుగురిని విడుదల చేయండి: సుప్రీం కోర్టు

రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళిని, ఆర్‌పీ రవిచంద్రన్‌తో పాటు అందరినీ విడుదల చేయాలని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు దోషులకు శిక్ష పడగా...అందులో ఒకరైన పెరరివలన్‌ను ఈ ఏడాది మేలో విడుదల చేశారు. ఏ ఆధారంగా అయితే...ఈ దోషిని విడుదల చేశారో అదే ఆధారంగా మిగతా ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు దోషులుగా ఉన్నారు. నళిని శ్రీహరన్, మురుగన్, శంతన్, ఏజీ పెరరివలన్‌, జయకుమార్, రాబర్ట్ పయాస్, పీ రవిచంద్రన్‌కు శిక్ష పడింది. వీరిలో ఒకరిని విడుదల చేయగా...మిగతా ఆరుగురు తమిళనాడులోని జైల్లో శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల కారాగార శిక్ష వీళ్లకు విధించారు. ఇన్నాళ్లకు వాళ్లకు విముక్తి లభించనుంది. 

ఇలా హత్య జరిగింది..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో దోషులుగా తేలిన పెరరివలన్‌తో పాటు మురుగన్‌, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలని గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పెరరివలన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివలన్‌ను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. చివరికి ఈ కేసులో దోషిగా తేలిన పెరరివలన్ తన 19 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు. 31 ఏళ్లుగా పెరరివలన్ జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆయన్ను రిలీజ్ చేయాలని తమిళనాడు సర్కార్ చేసిన సిఫార్సును గవర్నర్ అడ్డుకోవడం సబబు కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 అధికారాన్ని ఉపయోగించుకుని బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. 

సోనియా చొరవతో తగ్గిన శిక్ష..

నిజానికి ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో వారికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. కానీ...ఆ మరుసటి ఏడాదే పెరరివలన్‌ సహా మురుగన్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. తరవాత 2014లో పెరరివలన్‌తో పాటు శంతన్‌, మురుగన్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. సోనియాగాంధీ చొరవ చూపడం వల్ల 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు దోషులకు కూడా మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించారు. 

Also Read: Russia-Ukraine War: మోడీ చెప్పింది అక్షరాలా సత్యం, ఇవి యుద్ధం చేసుకోవాల్సిన రోజులు కావు - యూఎస్ సెక్రటరీ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
IPL 2025 LSG VS DC Result Update: ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన అభిషేక్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన పొరెల్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
Embed widget