అన్వేషించండి

Poverty In India: భారత్‌లో 5% మేర తగ్గిపోయిన పేదరికం - నీతిఆయోగ్ నివేదిక

Poverty In India: భారత్‌లో పేదరికం 5% మేర తగ్గిపోయినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది.

Poverty In India: భారత్‌లో పేదరికం 5% మేర తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయం తెలిపారు.  Household Consumption Expenditure Survey (HCES) రిపోర్ట్‌ని వెలువరించారు. 2022 ఆగష్టు నుంచి జులై 2023 వరకూ మధ్య కాలంలో ఈ సర్వే చేపట్టింది నీతి ఆయోగ్. కుటుంబాల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని పేదరిక స్థాయి ఎలా ఉందో అధ్యయనం చేసింది. కొన్నేళ్లుగా పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో పరిశీలించింది. ఈ మేరకు డేటాని విడుదల చేసింది. అటు గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఆదాయం పెరిగిందని స్పష్టం చేసింది. గతంతో పోల్చి చూస్తే...ఆదాయం 2.5 రెట్లు పెరిగిందని తెలిపింది. 2011-12 నుంచి పరిశీలిస్తే...పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5% మేర పెరిగిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం రూ.3,510గా ఉందని వివరించింది. ఇదే గ్రామాల్లో చూస్తే..నెలవారీ సగటు ఖర్చు 40.42% మేర పెరిగిందని తెలిపింది. ఇది ప్రస్తుతం రూ.2,008కి చేరుకుందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే దేశవ్యాప్తంగా పేదరికం 5% మేర తగ్గిపోయిందని నివేదించింది. ఖర్చులు చేసే విధానం చాలా మారిపోయిందని, ముఖ్యంగా ఆహారం కోసం పెట్టే ఖర్చులు పెరిగాయని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహారం కోసం చేసే ఖర్చు 50% మేర పెరిగింది. 2004-05లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చుల విషయంలో చాలా అంతరం ఉండేదని, ఇప్పుడది 91% మేర తగ్గిపోయిందని నీతి ఆయోగ్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, పండ్లు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఆయుష్మాన్ భారత్‌ స్కీమ్‌తో పాటు ఉచిత విద్య గురించీ ఇందులో ప్రస్తావించింది. 

గతేడాది కూడా రిపోర్ట్..

గతేడాది జులైలోనూ నీతి ఆయోగ్ ఓ నివేదిక వెలువరించింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, బడికి వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర 12 అంశాలనే కొలమానంగా ఈ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ 12 అంశాలను ఆధారంగా చేసుకొని పరిస్థితులను స్టడీ చేసింది. అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు ఆధారంగా 2015-16 నుంచి 2019-21 మధ్య పేదరికం భారీగా తగ్గినట్టు చెబుతోంది నీతి ఆయోగ్‌. అప్పట్లో 24.85 శాతం పేదరికం ఉంటే ఇప్పుడు అది 14.96కి తగ్గినట్టు పేర్కొంది. ఈ రేస్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ముందంజలో ఉన్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన పేదరికం తగ్గుదల నివేదికలో ఏపీ 13వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. సగుటున చూసుకుంటే మాత్రం ఏపీ 17వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలోనే కొనసాగుతోంది. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 5.71 శాతం పేదరికం తగ్గింది. తెలంగాణలో 7.30 శాతం మంది విముక్తి పొందారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘనతను 2016-21 మధ్య కాలంలో సాధించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. 

Also Read: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు, హిందువుల పూజలకు లైన్ క్లియర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Ntification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
AP DSC Ntification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs DC Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం | ABP DesamRCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Ntification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
AP DSC Ntification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
Viral News: ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
Roja: పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
IPL 2025 GT VS DC Result Updates: గుజ‌రాత్ రికార్డు ఛేజింగ్.. టోర్నీలో ఐదో విజ‌యంతో స‌త్తా.. బ‌ట్లర్ సెంచరీ మిస్, ప్రసిధ్ కు 4 వికెట్లు
గుజ‌రాత్ రికార్డు ఛేజింగ్.. టోర్నీలో ఐదో విజ‌యంతో స‌త్తా.. బ‌ట్లర్ సెంచరీ మిస్, ప్రసిధ్ కు 4 వికెట్లు
Embed widget