అన్వేషించండి

Population Control Law: ఇలాంటివి కోర్టు డిసైడ్ చేస్తుందా? అర్థం ఉండక్కర్లేదా - జనాభా నియంత్రణ పిటిషన్‌పై సుప్రీం కోర్టు అసహనం

Population Control Law: జనాభా నియంత్రణ చట్టం తేవాలన్న బీజేపీ నేత పిటిషన్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Population Control Law:

అసహనం 

జనాభా నియంత్రణకు ఓ చట్టం  (Population Control Law)చేయాలని బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. చట్టాలు చేయమని చెప్పడం కోర్టుల పని కాదని, అది పార్లమెంట్‌లో తేల్చుకోవాల్సిన విషయం అని వ్యాఖ్యానించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్‌లు వేస్తుంటారని మండిపడింది. ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏస్ ఓకాతో
కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. "ఇలాంటివి కోర్టు డిసైడ్ చేస్తుందని ఎలా అనుకుంటారు. కాస్తైనా అర్థముండాలిగా" అని ఘాటుగా స్పందించింది. ఈ వ్యాఖ్యల తరవాత ఉపాధ్యాయ్ తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. 

పిటిషన్‌లో ఏముంది..? 

బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్‌తో పాటు ఇంకొందరు ఇదే అంశంపై పిటిషన్ వేశారు. జనాభా పెరుగుతుండటం వల్ల ప్రజలకు ప్రభుత్వాలు సౌకర్యాలు అందించలేకపోతున్నాయని అందులో పేర్కొన్నారు. ప్రపంచం మొత్తంలో ఉన్న వ్యవసాయ భూమిలో భారత్‌లో 2% ఉందని, ఇక తాగు నీటి పరంగా చూస్తే ఆ వాటా 4% అని తెలిపారు. కానీ...జనాభాలో మాత్రం భారత్ వాటా 20%గా ఉందని చెప్పారు. జనాభా పెరుగుదల కారణంగా...కనీస సౌకర్యాలైన ఆహారం, తాగునీరు, విద్య, ఇల్లు, ఆరోగ్యం లాంటివి అందరికీ సమానంగా అందడం లేదని పిటిషన్‌లో వివరించారు. జనాభా నియంత్రణ చేయగలిగితే...ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలు చేసి అందరికీ లబ్ధి చేకూర్చిన వాళ్లమవుతామని చెప్పారు. గతంలోనూ ఉపాధ్యాయ్ ఢిల్లీ కోర్టులో ఈ పిటిషన్ వేయగా...ఆ న్యాయస్థానమూ కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై అప్పట్లో కేంద్రం కూడా స్పందించింది. జనాభా నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం సరికాదని, అది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం అని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను లా కమిషన్‌కు పంపాలన్న అభ్యర్థననూ సుప్రీం కోర్టు తిరస్కరించింది. "ఈ విషయంలో మీ వాదనలేంటో వినిపించండి. అంతే కానీ లా కమిషన్‌ ఇవ్వాలని మాత్రం అడగొద్దు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తప్పనిసరి
అనే నిబంధనను తొలగించాలని మీరు కోరుతున్నారు. అది ప్రభుత్వం పరిధిలోని విషయం" అని వెల్లడించింది. 

భగవత్ వ్యాఖ్యలు..

జనాభా నియంత్రణపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ వల్ల చైనా పరిస్థితి ఎలా తయారైందో చూడాలన్నారు. అయితే జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉందని భగవత్ అన్నారు.

" జనాభా నియంత్రణ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇలానే చేసిన చైనాలో ఏం జరుగుతోందో ఓసారి చూడాలి. 'ఒకే సంతానం' విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోంది. 57 కోట్ల యువత కలిగిన భారత్‌.. మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగనుంది. "                                       
-  మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్

Also Read: UN on Indian Population: 2023 నాటికి జనాభాలో మనమే టాప్- రెండో స్థానానికి చైనా!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget