అన్వేషించండి

Population Control Law: ఇలాంటివి కోర్టు డిసైడ్ చేస్తుందా? అర్థం ఉండక్కర్లేదా - జనాభా నియంత్రణ పిటిషన్‌పై సుప్రీం కోర్టు అసహనం

Population Control Law: జనాభా నియంత్రణ చట్టం తేవాలన్న బీజేపీ నేత పిటిషన్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Population Control Law:

అసహనం 

జనాభా నియంత్రణకు ఓ చట్టం  (Population Control Law)చేయాలని బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. చట్టాలు చేయమని చెప్పడం కోర్టుల పని కాదని, అది పార్లమెంట్‌లో తేల్చుకోవాల్సిన విషయం అని వ్యాఖ్యానించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్‌లు వేస్తుంటారని మండిపడింది. ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏస్ ఓకాతో
కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. "ఇలాంటివి కోర్టు డిసైడ్ చేస్తుందని ఎలా అనుకుంటారు. కాస్తైనా అర్థముండాలిగా" అని ఘాటుగా స్పందించింది. ఈ వ్యాఖ్యల తరవాత ఉపాధ్యాయ్ తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. 

పిటిషన్‌లో ఏముంది..? 

బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్‌తో పాటు ఇంకొందరు ఇదే అంశంపై పిటిషన్ వేశారు. జనాభా పెరుగుతుండటం వల్ల ప్రజలకు ప్రభుత్వాలు సౌకర్యాలు అందించలేకపోతున్నాయని అందులో పేర్కొన్నారు. ప్రపంచం మొత్తంలో ఉన్న వ్యవసాయ భూమిలో భారత్‌లో 2% ఉందని, ఇక తాగు నీటి పరంగా చూస్తే ఆ వాటా 4% అని తెలిపారు. కానీ...జనాభాలో మాత్రం భారత్ వాటా 20%గా ఉందని చెప్పారు. జనాభా పెరుగుదల కారణంగా...కనీస సౌకర్యాలైన ఆహారం, తాగునీరు, విద్య, ఇల్లు, ఆరోగ్యం లాంటివి అందరికీ సమానంగా అందడం లేదని పిటిషన్‌లో వివరించారు. జనాభా నియంత్రణ చేయగలిగితే...ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలు చేసి అందరికీ లబ్ధి చేకూర్చిన వాళ్లమవుతామని చెప్పారు. గతంలోనూ ఉపాధ్యాయ్ ఢిల్లీ కోర్టులో ఈ పిటిషన్ వేయగా...ఆ న్యాయస్థానమూ కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై అప్పట్లో కేంద్రం కూడా స్పందించింది. జనాభా నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం సరికాదని, అది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం అని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను లా కమిషన్‌కు పంపాలన్న అభ్యర్థననూ సుప్రీం కోర్టు తిరస్కరించింది. "ఈ విషయంలో మీ వాదనలేంటో వినిపించండి. అంతే కానీ లా కమిషన్‌ ఇవ్వాలని మాత్రం అడగొద్దు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తప్పనిసరి
అనే నిబంధనను తొలగించాలని మీరు కోరుతున్నారు. అది ప్రభుత్వం పరిధిలోని విషయం" అని వెల్లడించింది. 

భగవత్ వ్యాఖ్యలు..

జనాభా నియంత్రణపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ వల్ల చైనా పరిస్థితి ఎలా తయారైందో చూడాలన్నారు. అయితే జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉందని భగవత్ అన్నారు.

" జనాభా నియంత్రణ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇలానే చేసిన చైనాలో ఏం జరుగుతోందో ఓసారి చూడాలి. 'ఒకే సంతానం' విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోంది. 57 కోట్ల యువత కలిగిన భారత్‌.. మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగనుంది. "                                       
-  మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్

Also Read: UN on Indian Population: 2023 నాటికి జనాభాలో మనమే టాప్- రెండో స్థానానికి చైనా!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Mobile Recharge Price : మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
Embed widget