అన్వేషించండి

Karnataka Election 2023: సౌతాఫ్రికా EVMలనే కర్ణాటకలో వాడారంటూ కాంగ్రెస్ ఆరోపణలు, కొట్టి పారేసిన ఈసీ

Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎమ్‌లపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ఈసీ కొట్టి పారేసింది.

Karnataka Election 2023: 


లేఖ రాసిన కాంగ్రెస్ 

కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించిన EVMలపై కాంగ్రెస్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసింది. గతంలో సౌతాఫ్రికాలో వినియోగించిన వాటినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఆరోపించింది. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతే కాదు. ఎన్నికల సంఘానికీ కంప్లెయింట్ చేసింది. కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాకు ఎన్నికల సంఘం లెటర్ రాసింది. Electronics Corporation of India Limited తయారు చేసిన ఈ EVMలను కేవలం కర్ణాటక ఎన్నికల కోసం మాత్రమే వినియోగించినట్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను కొట్టి పారేసింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ మే 8వ తేదీన ఎన్నికల సంఘానికి ఈ ఆరోపణలు చేస్తూ లేఖ రాసింది. రీవ్యాలిడేషన్, రీవెరిఫికేషన్ లేకుండానే వాటిని కర్ణాటక ఎన్నికల్లో వాడేందుకు తీసుకొచ్చారని విమర్శించింది. 

"ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈవీఎమ్‌లను గతంలో సౌతాఫ్రికాలో వినియోగించారు. కొన్ని సోర్సెస్ ద్వారా మాకు ఈ సమాచారం అందింది. రీ వ్యాలిడేషన్, రీ వెరిఫికేషన్ అనేదే లేకుండా నేరుగా అక్కడి నుంచి తీసుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలి"

- కాంగ్రెస్ 

ఖండించిన ఈసీ

ఈ లేఖకు స్పందిస్తూ ఎన్నికల సంఘం లెటర్ రాసింది. కర్ణాటక ఎన్నికల్లో వినియోగించిన EVMల గురించి కాంగ్రెస్ నేతలకు అన్ని వివరాలూ తెలుసని తేల్చి చెప్పింది. సౌతాఫ్రికాకు ఇవే ఈవీఎమ్‌లు పంపారన్న ఆరోపణలనూ కొట్టిపారేసింది. కావాలంటే సౌతాఫ్రికా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వివరణ ఇచ్చింది. 

"ఈ ఈవీఎమ్‌లను సౌతాఫ్రికాలో వినియోగించారన్న ఆరోపణల్లో అర్థం లేదు. అసలు అలాంటి అవకాశమే లేదు. వీటిని కేవలం కర్ణాటక ఎన్నికల్లో వినియోగించడానికి మాత్రమే తయారు చేశాం. ఈ నిజం కాంగ్రెస్‌కు కూడా తెలుసు"

- ఎన్నికల సంఘం 

నగదు, మద్యం సీజ్..

ఎలక్షన్స్ అంటే లిక్కర్‌తో పాటు కరెన్సీ నోట్లకూ డిమాండ్ పెరుగుతుంది. ప్రచారానికి రావడం కోసం మందుని ఎరగా వేసి జన సమీకరణ చేస్తుంటాయి పార్టీలు. మాకే ఓటేయండి అంటూ డబ్బులు కూడా పంచుతాయి. ఇదంతా ఓపెన్ సీక్రెట్. అయితే...ఇలాంటి వాటిపై ఎన్నికల సంఘం నిత్యం నిఘా పెడుతూనే ఉంటుంది. అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేసే వారిని పట్టుకుని వాటిని సీజ్ చేసేస్తుంది. అయితే..ఈ సారి కర్ణాటకలో సీజ్ చేసిన డబ్బుల విలువ పెరిగిపోయింది. ఎన్నికల ఖర్చుపై నిఘా పెట్టిన ఈ సంస్థ..కీలక విషయాలు వెల్లడించింది. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే... ఈ సారి 4.5 రెట్లు ఎక్కువగా డబ్బుని సీజ్ చేసినట్టు స్పష్టం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పలు చోట్ల ఈ నోట్ల కట్టల్ని సీజ్ చేశాయి. వీటి మొత్తం విలువ రూ.375 కోట్లుగా వెల్లడించింది. రూ.147 కోట్ల క్యాష్, రూ.84 కోట్ల విలువైన లిక్కర్, రూ.97 కోట్ల బంగారం వెండి, రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: మా సపోర్ట్ ఎవరికో ముందే డిసైడ్ అయిపోయింది, టైమ్ వచ్చినప్పుడు చెబుతాం - కుమారస్వామి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్సీ అనంతబాబు బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన కూటమి ప్రభుత్వం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.