అన్వేషించండి

Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భారీగా ర్యాలీలు చేపట్టనున్నారు.

Karnataka Elections 2023:

భారీగా ర్యాలీలు..

కర్ణాటకలో ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సారి బీజేపీ గెలవడం కష్టమే అన్న వాదనలతో పాటు కాంగ్రెస్ నిలదొక్కుకోవడం కష్టమే అని మరి కొందరు వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో రెండు వేరు వేరు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టారు ఓటర్లు. హిమాచల్‌లో మోదీ మేజిక్ వర్కౌట్ అవ్వలేదు. కానీ...కర్ణాటకలో మాత్రం కచ్చితంగా ప్రధాని మోదీ చరిష్మా ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీయే స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. ర్యాలీలు, సభలతో బిజీబిజీగా గడిపేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ...ఇక్కడా భారీగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం 20 ర్యాలీలు చేసేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. మే 10న ఎన్నికల జరగనున్నాయి. అయితే...చివరిత విడత ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి. అంటే...మే 6-8వ తేదీ వరకూ రాష్ట్రంలోనే పర్యటించనున్నట్టు తెలుస్తోంది. 

అవినీతి ఆరోపణలు..

కాంగ్రెస్, జేడీఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తోంది కర్ణాటక బీజేపీ. రాజకీయాల పరంగా చూస్తే...కర్ణాటకలో కీలకంగా 6 జోన్లు ఉన్నాయి. ఈ 6 జోన్లలోనూ కనీసం మూడు ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంపైనే ప్రధాని ఎక్కువగా దృష్టించాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో మల్లికార్జున్ ఖర్గేకు మంచి పాపులారిటీ ఉంది. అందుకే కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ ఎంత కష్టపడినా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 15 సీట్లకు మించి సాధించలేకపోయింది. ఈ సారి ఈ సీట్ల సంఖ్య పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ...ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేర కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం బసవరాజు బొమ్మైపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొందరు బీజేపీ నేతలూ కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎంత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని బీజేపీ ప్రచారం చేసుకున్నప్పటికీ...ఈ సవాళ్లు దాటుకోవాల్సి ఉంటుంది. అందుకే...ఈ సారి పూర్తిగా ప్రధాని మోదీ చరిష్మాపైనే ఆధారపడుతోంది కర్ణాటక బీజేపీ. అటు మోదీ కూడా కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హుబ్లీ, మాండ్యలో ర్యాలీలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అవినీతికి పాల్పడింది సొంత పార్టీ నేతలపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఒకే విడతలో ఎన్నికలు..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర‌ ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ఆఖరు తేదీ ఏప్రిల్ 20గా నిర్ణయించిన ఈసీ..21వ తేదీన వాటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 24 ఆఖరి గడువుగా ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తైన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని వెల్లడించింది. 80 ఏళ్లు దాటిన వారెవరైనా...ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించింది. వోట్‌ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ఇదే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. 2018-19 నుంచి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. 9.17 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు స్పష్టం చేసింది.

Also Read: Deve Gowda: ముందు మీ ఇంటి సమస్యలు పరిష్కరించుకోండి, కాంగ్రెస్‌పై దేవెగౌడ సెటైర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Embed widget