అన్వేషించండి

Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భారీగా ర్యాలీలు చేపట్టనున్నారు.

Karnataka Elections 2023:

భారీగా ర్యాలీలు..

కర్ణాటకలో ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సారి బీజేపీ గెలవడం కష్టమే అన్న వాదనలతో పాటు కాంగ్రెస్ నిలదొక్కుకోవడం కష్టమే అని మరి కొందరు వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో రెండు వేరు వేరు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టారు ఓటర్లు. హిమాచల్‌లో మోదీ మేజిక్ వర్కౌట్ అవ్వలేదు. కానీ...కర్ణాటకలో మాత్రం కచ్చితంగా ప్రధాని మోదీ చరిష్మా ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీయే స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. ర్యాలీలు, సభలతో బిజీబిజీగా గడిపేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ...ఇక్కడా భారీగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం 20 ర్యాలీలు చేసేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. మే 10న ఎన్నికల జరగనున్నాయి. అయితే...చివరిత విడత ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి. అంటే...మే 6-8వ తేదీ వరకూ రాష్ట్రంలోనే పర్యటించనున్నట్టు తెలుస్తోంది. 

అవినీతి ఆరోపణలు..

కాంగ్రెస్, జేడీఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తోంది కర్ణాటక బీజేపీ. రాజకీయాల పరంగా చూస్తే...కర్ణాటకలో కీలకంగా 6 జోన్లు ఉన్నాయి. ఈ 6 జోన్లలోనూ కనీసం మూడు ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంపైనే ప్రధాని ఎక్కువగా దృష్టించాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో మల్లికార్జున్ ఖర్గేకు మంచి పాపులారిటీ ఉంది. అందుకే కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ ఎంత కష్టపడినా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 15 సీట్లకు మించి సాధించలేకపోయింది. ఈ సారి ఈ సీట్ల సంఖ్య పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ...ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేర కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం బసవరాజు బొమ్మైపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొందరు బీజేపీ నేతలూ కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎంత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని బీజేపీ ప్రచారం చేసుకున్నప్పటికీ...ఈ సవాళ్లు దాటుకోవాల్సి ఉంటుంది. అందుకే...ఈ సారి పూర్తిగా ప్రధాని మోదీ చరిష్మాపైనే ఆధారపడుతోంది కర్ణాటక బీజేపీ. అటు మోదీ కూడా కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హుబ్లీ, మాండ్యలో ర్యాలీలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అవినీతికి పాల్పడింది సొంత పార్టీ నేతలపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఒకే విడతలో ఎన్నికలు..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర‌ ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ఆఖరు తేదీ ఏప్రిల్ 20గా నిర్ణయించిన ఈసీ..21వ తేదీన వాటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 24 ఆఖరి గడువుగా ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తైన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని వెల్లడించింది. 80 ఏళ్లు దాటిన వారెవరైనా...ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించింది. వోట్‌ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ఇదే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. 2018-19 నుంచి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. 9.17 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు స్పష్టం చేసింది.

Also Read: Deve Gowda: ముందు మీ ఇంటి సమస్యలు పరిష్కరించుకోండి, కాంగ్రెస్‌పై దేవెగౌడ సెటైర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget