అన్వేషించండి

EPFO Interest: ఈపీఎఫ్‌తో ఇరుక్కున్న కేంద్రం, ఎన్నికలు అవ్వగానే మొదలెట్టారని విమర్శలు

ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గింపుతో కేంద్రం ఇరుకునపడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయినపోయిన తర్వాత కేంద్రం బాదుడు మొదలెట్టిందని విపక్షాలు గొంతులు సవరించుకుంటున్నాయి.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై చెల్లించే వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది.  గడచిన నలభై ఏళ్లలో లేని విధంగా ఎంప్లాయిస్ పీఎఫ్ మీద వడ్డీని అమాంతం తగ్గించటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే మధ్యతరగతి వేతన జీవుల నడ్డి విరిచేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 

ఏంటీ వివాదం, ఎందుకు విపక్షాలు ఆగ్రహం?

అసలు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం ఏంటో ఓ సారి చూద్దాం.ఈ నెల 12 న గౌహతిలో ఈపీఎఫ్ కి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు....సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ ఈ ట్రస్టీ బోర్డ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సమావేశమైన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు పీఎఫ్ మీద వస్తున్న వడ్డీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అదీ గడచిన నలభై ఏళ్లలో చూడని విధంగా 8.1శాతానికి తగ్గిస్తూ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ  తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపించారు. 

ఎప్పుడెప్పుడు తగ్గింది

ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఈపీఎఫ్ సంస్థ షాక్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆందోళన చేయటం మొదలు పెట్టాయి. ఎందుకంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరం లో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి, ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గిస్తూ తీర్మానం చేశారు.

ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ర్యాటిఫై చేసి.. కొత్త వడ్డీ రేటు అమలులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుదించిన వడ్డీ రేటు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అభిప్రాయపడుతున్నారు.

అసలేంటీ ఈపీఎఫ్...దాని మీద వడ్డీ

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ రిటైర్ మెంట్ వరకు ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం రూపొందిందే ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్. షార్ట్ కట్ లో ఈపీఎఫ్ అంటారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం 1952 తో ఈపీఎఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ ను నిర్వహించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పేరుతో ఓ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దానికి ఓ బోర్డు,..ట్రస్ట్ సభ్యులు కూడా ఉంటారు. 

ఉద్యోగులు తాము ప్రతినెలా పొందే జీతంలో కొంత భాగం అంటే బేసిక్ ఆదాయంలో 12 శాతం ఈ పథకానికి చందాగా జమచేయాల్సి ఉంటుంది. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ జమ చేస్తుంది. దీనికి వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. రిటైర్ అయ్యేనాటికి ఉద్యోగి, యజమాని జమచేసిన మొత్తంతో పాటు వడ్డీ కూడా కలిపి చేతికి అందుతుంది. ఈపీఎఫ్ లో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ నిధిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి. అంతేకాకుండా నిర్దేశిత వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది.

సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వడ్డీ 8.1 శాతం ఇదే. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గుతుంది. 2020 - 21 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ రేటు 8.50 శాతంగా కట్టించారు. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-2014, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. 8.5 శాతం వడ్డీని చందాదారులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని కొనసాగించారు. 

ఇప్పుడు 40 ఏళ్లలో లేని విధంగా 8.1 శాతానికి తగ్గించేయటమే అసలు వివాదానికి కారణం. 450 కోట్ల రూపాయల సర్ ప్లస్‌లో ఉన్న బోర్డు...ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ తీర్మానాన్ని ఒప్పుకోకూడదంటూ ప్రతిపక్షపార్టీల నేతలు, ఉద్యోగ కార్మి సంఘాలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలు రాస్తున్నారు. యూపీ ఎన్నికలు పూర్తికాగానే తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

BJP DMK Relation: తమిళనాడు పాలిటిక్స్‌లో సరికొత్త ‘స్టాలిన్ మార్క్’ వ్యూహం - బీజేపీతో సాఫ్ట్ కార్నర్ వెనుక అసలు లెక్క ఇదేనా?
తమిళనాడు పాలిటిక్స్‌లో సరికొత్త ‘స్టాలిన్ మార్క్’ వ్యూహం - బీజేపీతో సాఫ్ట్ కార్నర్ వెనుక అసలు లెక్క ఇదేనా?
Prakash Raj Non Bailable Warrant: ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్‌ వారెంట్ జారీ, అరెస్ట్ చేస్తారా?
ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్‌ వారెంట్ జారీ, అరెస్ట్ చేస్తారా?
Union Cabinet Expansion: మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
Pune Murder News:‘హుడీ’ ఓపెన్ చేస్తే కాబోయే భార్య దురాగతం వెలుగులోకి, క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పూణే మర్డర్ మిస్టరీ!
‘హుడీ’ ఓపెన్ చేస్తే కాబోయే భార్య దురాగతం వెలుగులోకి, క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పూణే మర్డర్ మిస్టరీ!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SIR Process Telangana: తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
OPS For AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Ather 450X vs Honda Activa e:ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
Embed widget