అన్వేషించండి

EPFO Interest: ఈపీఎఫ్‌తో ఇరుక్కున్న కేంద్రం, ఎన్నికలు అవ్వగానే మొదలెట్టారని విమర్శలు

ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గింపుతో కేంద్రం ఇరుకునపడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయినపోయిన తర్వాత కేంద్రం బాదుడు మొదలెట్టిందని విపక్షాలు గొంతులు సవరించుకుంటున్నాయి.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై చెల్లించే వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది.  గడచిన నలభై ఏళ్లలో లేని విధంగా ఎంప్లాయిస్ పీఎఫ్ మీద వడ్డీని అమాంతం తగ్గించటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే మధ్యతరగతి వేతన జీవుల నడ్డి విరిచేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 

ఏంటీ వివాదం, ఎందుకు విపక్షాలు ఆగ్రహం?

అసలు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం ఏంటో ఓ సారి చూద్దాం.ఈ నెల 12 న గౌహతిలో ఈపీఎఫ్ కి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు....సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ ఈ ట్రస్టీ బోర్డ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సమావేశమైన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు పీఎఫ్ మీద వస్తున్న వడ్డీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అదీ గడచిన నలభై ఏళ్లలో చూడని విధంగా 8.1శాతానికి తగ్గిస్తూ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ  తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపించారు. 

ఎప్పుడెప్పుడు తగ్గింది

ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఈపీఎఫ్ సంస్థ షాక్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆందోళన చేయటం మొదలు పెట్టాయి. ఎందుకంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరం లో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి, ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గిస్తూ తీర్మానం చేశారు.

ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ర్యాటిఫై చేసి.. కొత్త వడ్డీ రేటు అమలులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుదించిన వడ్డీ రేటు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అభిప్రాయపడుతున్నారు.

అసలేంటీ ఈపీఎఫ్...దాని మీద వడ్డీ

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ రిటైర్ మెంట్ వరకు ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం రూపొందిందే ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్. షార్ట్ కట్ లో ఈపీఎఫ్ అంటారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం 1952 తో ఈపీఎఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ ను నిర్వహించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పేరుతో ఓ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దానికి ఓ బోర్డు,..ట్రస్ట్ సభ్యులు కూడా ఉంటారు. 

ఉద్యోగులు తాము ప్రతినెలా పొందే జీతంలో కొంత భాగం అంటే బేసిక్ ఆదాయంలో 12 శాతం ఈ పథకానికి చందాగా జమచేయాల్సి ఉంటుంది. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ జమ చేస్తుంది. దీనికి వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. రిటైర్ అయ్యేనాటికి ఉద్యోగి, యజమాని జమచేసిన మొత్తంతో పాటు వడ్డీ కూడా కలిపి చేతికి అందుతుంది. ఈపీఎఫ్ లో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ నిధిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి. అంతేకాకుండా నిర్దేశిత వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది.

సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వడ్డీ 8.1 శాతం ఇదే. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గుతుంది. 2020 - 21 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ రేటు 8.50 శాతంగా కట్టించారు. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-2014, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. 8.5 శాతం వడ్డీని చందాదారులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని కొనసాగించారు. 

ఇప్పుడు 40 ఏళ్లలో లేని విధంగా 8.1 శాతానికి తగ్గించేయటమే అసలు వివాదానికి కారణం. 450 కోట్ల రూపాయల సర్ ప్లస్‌లో ఉన్న బోర్డు...ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ తీర్మానాన్ని ఒప్పుకోకూడదంటూ ప్రతిపక్షపార్టీల నేతలు, ఉద్యోగ కార్మి సంఘాలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలు రాస్తున్నారు. యూపీ ఎన్నికలు పూర్తికాగానే తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
Champion Box Office Collection Day 2: 'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Embed widget