అన్వేషించండి

Narendra Modi: నా అంతిమ లక్ష్యం అదే, పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం

Parliament Budget Sessions: గత పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని, భవిష్యత్ తరాలకు అవి ఉపయోగపడతాయని ప్రధాని మోదీ అన్నారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా మోదీ మాట్లాడారు.

PM Modi speech at Parliament Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడారు. ఈ సందర్భంగా తన పదేళ్ల పాలనను గుర్తు చేసుకున్నారు. పదేళ్ల పాలనలో దేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రిఫామ్, ట్రాన్స్‌ఫామ్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ పదేళ్లల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనా అభివృద్ది మాత్రం ఆగలేదని తెలిపారు. కరోనా మహమ్మారి వంటివి అనేక విపత్కర పరిస్థితులు ఎదురైనా అభివృద్దిని మాత్రం కొనసాగించామని,  ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ప్రస్తుత లోక్‌సభ కాలంలో తీసుకున్నామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం (Ayodhya Ram Mandir) వంటి అంశాలను మోదీ సభలో ప్రస్తావించారు. జీ 20 సదస్సును ప్రపంచం అబ్బురపడేలా నిర్వహించామని,  దీని వల్ల విశ్వ వేదికపై భారత్ ప్రతిష్ట మరింత పెరిగిందని మోదీ స్పష్టం చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు వదిలేసే నాటికి భవిష్యత్ తరాలకు ఆర్ధిక భద్రత కల్పించాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

మరో 25 ఏళ్లల్లో అభివృద్ది చెందిన దేశంగా మారుతామని, ఆ లక్ష్యం దిశగా తమ పాలన  కొనసాగుతుందని మోదీ చెప్పారు.  వికసిత్ భారత్ పలాలు మన భవిష్యత్ తరాలు అందుతాయని తెలిపారు. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో..  17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. దీంతో మోదీ తన ప్రసంగంలో తన పాలనలోని అభివృద్ది గురించి వివరించారు. బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియడంతో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమానంగా చూశానని, కొన్నిసార్లు సభ గౌరవాన్ని కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

17వ లోక్‌సభ విశేషాలు ఇవే..

17వ లోక్‌సభలో అనేక ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. గత ఐదేళ్లల్లో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందాయి. ప్రస్తుతం లోక్‌సభలో 400 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక 16వ లోక్‌సభలో 62 మంది మహిళా ఎంపీలు ఉండగా.. 17వ లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న బిజు జనతాదళ్ ఎంపీ చంద్రాడీ ముర్ము 25 ఏళ్ల 11 నెలల వయస్సులో ఎంపీగా గెలిచారు. 17వ లోక్‌సభలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న ఎంపీలలో 40 ఏళ్లలోపు వారు ఎక్కువమంది ఉన్నారు. ఇక 17వ లోక్‌సభకు జాతీయపార్టీల నుంచి 397 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. 

ఇక 17వ లోక్‌సభలో తొలిసారి  ఎన్నికైనవారు 260 మంది ఉన్నారు. అలాగే 2019లో లోక్‌సభలో 303 మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 290కి తగ్గినా బీజేపీనే అత్యధిక మెజార్టీతో ఉంది. ఇలా 17వ లోక్‌సభకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇవి చివరి సమావేశాలు కావడంతో అన్ని పార్టీల ఎంపీలతో మోదీ సరదాగా గడిపారు. ఇతర పార్టీల ఎంపీలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. యువ ఎంపీలతో పార్లమెంట్‌లో ముచ్చటించారు. తన అనుభవాలను సహచర ఎంపీలతో పంచుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget