అన్వేషించండి

Indus Water Treaty:సింధు జలాల ఒప్పందం రద్దుపై ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంటుందా? ఒప్పందంలో ఉన్న కీలకాంశాలు ఏంటీ?

 Indus Water Treaty:పహల్గాం దాడితో పాకిస్థాన్‌పై ఇండియా ప్రచ్చన్న యుద్ధం ప్రకటించింది. ఆ దేశాన్ని ఎడారిగా మార్చే కీలక నిర్ణయంపై ప్రపంచబ్యాంకు జోక్యం చేసుకుంటుందా?

Indus Water Treaty: పహల్గాం దాడితో పాకిస్థాన్‌పై ఇండియా నీటి యుద్ధానికి దిగింది. దీని పర్యవసానం పాకిస్థాన్ ఓ ఏడారిగా మార్చడమేనని చెప్పాలి. పాకిస్థాన్‌ను ఆర్థికంగా నడ్డి విరిచే నిర్ణయం కేంద్ర సర్కార్ తీసుకుంది. 1960లో ఇండియా- పాక్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం జరిగింది. అయితే అసలు ఈ ఇండస్ వాటర్ ట్రిటీ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.

ఇండస్ వాటర్ ట్రీటీ ముఖ్య అంశాలు
1. ఇండియా పాక్‌ మధ్య నదీ విభజన 
ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్న ఇండియా - పాకిస్తాన్ విభజన తర్వాత నీటి వినియోగంపై ఏర్పాటు చేసుకున్న అవగాహన ఒప్పందమే సింధు జలాల పంపిణీ ఒప్పందం. ఇందులో భాగంగా ఇండస్ నదీ వ్యవస్థలో తూర్పుకు పారే బియాస్, రావి, సట్లెజ్ నదులు మన దేశం వినియోగించుకోవాల్సి ఉంది. ఇక పశ్చిమ వైపుగా ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదుల నీటిని పాకిస్థాన్ వినియోగించుకోవాల్సి ఉంది. అయితే కొన్ని షరతులతో తూర్పు నదుల నీటిని పరిమితంగా పాకిస్థాన్, పశ్చిమ నదుల నీటిని ఇండియా వాడుకునే అవకాశాన్ని ఈ ఒప్పందంలో కల్పించారు. పరిమితంగా అంటే విద్యుత్ ఉత్పత్తి కోసం, తాగు నీటి అవసరాలు, పరిశ్రమలకు ఈ నీటిని వినియోగించుకోవచ్చు. కానీ నీటి ప్రవాహాన్ని ఎక్కువ మొత్తంలో అడ్డుకునేలా ఏ దేశం కూడా గరిష్ట స్థాయిలో వినియోగించకూడదు. ప్రస్తుతం పాక్ కు కేటాయించిన పశ్చిమ నదుల నీటిని మన దేశం దాదాపు 13 లక్షల ఎకరాలకు వ్యవసాయం కోసం వినియోగించుకుంటుంది. 

2. పశ్చిమ నదులపై ప్రాజెక్టులకు ఇండియాకు అనుమతి  
మన దేశం పశ్చిమంగా ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదులపై నీటిని నిల్వచేయకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులు నిర్మించవచ్చు. దీన్నే రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులు అంటారు. నీటిని గణనీయంగా నిల్వ చేయకుండా ఈ ప్రాజెక్టుల ద్వరా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే వీటి నిర్మాణానికి పాకిస్థాన్‌కు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా మన దేశం జీలం, చినాబ్ నదులపై కిష్టోబాగ్, బాగ్ లిహర్, సలాల్ వంటి హైడల్ ప్రాజెక్టులను నిర్మించింది.

3. నదీ జలాల సమాచార పరస్పర మార్పిడి
ఇండియా- పాకిస్థాన్ తమకు కేటాయించిన నదీ జలాల నీటి ప్రవాహం, నీటి మట్టం, వాతావరణ మార్పులు వంటి సమాచారాలు క్రమం తప్పకుండా ఇచ్చిపుచ్చుకోవాలని సింధు జలాల ఒప్పందం చెబుతోంది. మన దేశం పశ్చిమ నదులపై ఏదైనా ప్రాజెక్టు నిర్మించతలపెడితే ఆ పూర్తి సమచారం తప్పకుండా పాక్‌కు ఇవ్వాలి. వారి ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానిపై చర్చలు జరిపి , పాక్ అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతే ప్రాజెక్టులు నిర్మించాలని ఒప్పందంలో ఉంది. 

4.  పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు 
రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం అమలు తీరును పర్యవేక్షించడానికి ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని పీఐసీ అంటే పర్మినెంట్ ఇండస్ కమిషన్ అంటారు. ఇందులో ఇండియా నుంచి ఒకరు, పాక్ నుంచి ఒకరు కమిషనర్‌గా ఉంటారు. ప్రతీ సంవత్సరం వీరు సమావేశమై నదీ జలాల ఒప్పందం అమలు తీరు, సమస్యలు, వాటి పరిష్కరాలపైన చర్చించాల్సి ఉంటుంది. అప్పుడే నదీ జలాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. వివాదాలు ఉంటే ఇరు దేశాలు ఉన్నతస్థాయి సమావేశాన్ని పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఒక నిపుణుడైన తటస్థ మధ్యవర్తి సమక్షంలో చర్చించి సూచించిన నిర్ణయాన్ని అమలు చేయాలి. ఇలా గతంలో బాగ్ లిహార్, కిష్టోబాగ్ ప్రాజెక్టుపై తలెత్తిన వివాదాలను ఇరు దేశాలు మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకున్నాయి.  

6. కీలక పాత్ర వహించే ప్రపంచ బ్యాంకు
ఈ ఒప్పందం విషయంలో కీలక పాత్రధారి ప్రపంచ బ్యాంకు. వివాదాలు తలెత్తితే ప్రపంచ బ్యాంకు మీడియేటర్‌గా వ్యవహరించి రెండు దేశాలతో చర్చలు జరుపుతుంది. ఈ ఒప్పందం అమలు సాఫీగా సాగడానికి ఇరు దేశాలతో కలిసి పని చేస్తుంది. అయితే ఇందులో నుంచి ఏ దేశమైనా ఏక పక్షంగా వైదొలగకుండా ఎలాంటి నిబంధనలు లేవు. దాన్ని ప్రపంచ బ్యాంకు కూడా అడ్డుకోలేదు. ఏదైనా వివాదం తలెత్తితే మాత్రం ప్రపంచ బ్యాంకు పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుంది.

7. ఉద్రిక్త సమయాల్లో కూడా ఒప్పందం అమలు
1960లో ఈ ఒప్పందం ప్రారంభమైన ఇండియా- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా రెండు దేశాలు ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి వైదొలగలేదు. 1965, 1971లలో జరిగిన యుద్ద సమయంలో, 1999 కార్గిల్ వార్ టైంలో ఒప్పందం ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత జరిగిన తాజ్ హోటల్ ఎటాక్, పుల్వామా, బాలా కోట్ దాడుల సమయంలోను వైదొలగలేదు. కాని పహల్గామ్ దాడి తర్వాత మోదీ సర్కార్ పాక్ వెన్ను విరిచేందుకు ఇండస్ వాటర్ ట్రిటీ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల బాగా లాభపడేది పాకిస్థాన్. దీని వల్ల పాక్‌కు 80 శాతం నీటి వాటా దక్కుతుంటే ఇండియాకు దక్కేది కేవలం 20 శాతం మాత్రమే. ఈ నీటిపైనే పాక్ వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. ఈ నీటిని అడ్డుకుంటే పాక్ ఎడారి కాక తప్పదు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget