అన్వేషించండి

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

Digital Water Meters: అపార్ట్ మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో వాటర్ మీటర్లు పెట్టుకోవాలని తాజాగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. భూగర్భజలాల వాడకాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయనుంది ప్రభుత్వం.

Digital Water Meters: అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో తప్పనిసరిగా వాటర్ మీటర్లు అమర్చుకోవాలని తాజాగా కేంద్ర సర్కారు పేర్కొంది. తాగునీటి, గృహ అవసరాల కోసం రోజూ 20 క్యూబిక్ మీటర్లకు మించి భూగర్భజలాలు వాడే భవన సముదాయాలు అన్నింటికీ ఈ కొత్త రూల్స్‌ వర్తిస్తాయని తెలిపింది. ఒకవేళ్ అపార్ట్‌మెంట్లలో స్విమ్మింగ్ పూల్ ఉంటే అవి భూగర్భజలాలపై ఆధారపడితే తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. భూగర్భ జలాల వినియోగ నియంత్రణకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ 2020 సెప్టెంబర్ 24వ తేదీన కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవరించి తాజాగా కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మోడల్ బిల్డింగ్ బైలాస్ మేర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్ ను సమర్పించాలని పేర్కొంది. పరిశ్రమలన్నీ వచ్చే మూడేళ్లలో భూగర్భజలాల వినియోగాన్ని కనీసం 20 శాతం మేర తగ్గించుకోవాలని ఆదేశించింది. అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొంది. ట్యాంకర్ల ద్వారా భూగర్భజలాలను సరఫరా చేసే వారు తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని తెలిపింది.

బోర్ల నుండి ఉప్పు నీరు వాడుకునే వారు ఆ నీటి నాణ్యతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ లేబొరేటరీస్ ద్వారా లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయోగశాలలో పరీక్ష చేయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాణిజ్య సంస్థలు భూగర్భజలాలను వాడుకుంటుంటే వాటర్ ఆడిట్ ను ఆన్ లైన్ లో సమర్పించాలని తెలిపింది. ఆ నీటిని ఏయే  అవసరాలకు ఉపయోగించుకుంటున్నదీ చెప్పాలని ఆదేశించింది. ఆ రిపోర్టులను సెంట్రల్, స్టేట్ గ్రౌండ్ వాటర్ అథారిటీస్ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని పేర్కొంది.

రోజుకు వంద క్యూబిక్ మీటర్లకు మించి భూగర్భజలాలను ఉపయోగించే అన్ని పరిశ్రమలూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర భూగర్భజల అథారిటీ-సీజీడబ్ల్యూఏ ధ్రువీకరించిన సంస్థల ద్వారా వాటర్ ఆడిట్ చేయించాలని కొత్త నోటిఫికేషన్ లో కేంద్ర సర్కారు పేర్కొంది. మూడు నెలల్లోపు ఆ రిపోర్టులను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీకి సమర్పించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భజలాల స్థితిగతులను కనిపెట్టి ఉంచడానికి కేంద్ర భూగర్భజలాల మండలి ఆ ప్రాంతాల్లో ఫీజోమీటర్లు నెలకొల్పుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిగతా పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భజలాల పర్యవేక్షణ కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కఠిన శిలల నుండి భూగర్భజలాలను ఉపయోగించే పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణానికి 15 మీటర్ల లోపు ఫీజో మీటర్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

తాగునీటి, గృహ అవసరాల కోసం రోజుకు గరిష్ఠంగా 25 క్యూబిక్ మీటర్ల వరకు భూగర్భజలాలను ఉపయోగిస్తుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. 25 నుండి 200 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వాడుకుంటే ఒక్కో క్యూబిక్ మీటరుకు రూపాయి చొప్పున వసూలు చేస్తారు. 200 క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని వాడుతుంటే ఒక్కో క్యూబిక్ మీటర్ కు రూ.2 చొప్పుల వసూలు చేస్తారు. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నీటి వాడక పరిమాణంతో సంబంధం లేకుండా క్యూబిక్ రూ.0.50 చెల్లించాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget