అన్వేషించండి

400 kg special key: అయోధ్యకు చేరుకున్న 400 కేజీల భారీ తాళం

Ayodhya Ram Mandir: దేశం మొత్తం రాముని నామస్మరణతో మారుమోగిపోతోంది. ప్రాణప్రతిష్ఠ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి.

Ram Mandir Inauguration: చరిత్రాత్మక ఘట్టానికి మరొకొన్ని గంటలే ఉన్నాయి. అందరి అడుగులు అయోధ్యలోని రామమందిరంవైపు వడివడిగా పడుతున్నాయి. ఒక్క అయోధ్య మాత్రమే కాదు.. దేశం మొత్తం రాముని నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు రాములోరి గుడి తలుపుకు తాళం వచ్చేసింది. తాళం అంటే సాదాసీద తాళం కాదు.. 400 కేజీల తాళం. అదికూడా ఒక కళాకారుడు చేత్తో తయారు చేశాడు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్యపురికి చేరుకుంది. 

చేతితో తయారు చేసిన అతిపెద్ద తాళం.. 

రాములోరి గుడికి తయారు చేసిన తాళం ఏకంగా 400 కేజీలు. దీన్ని అయోధ్యలోని రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ తయారు చేశారు. సత్యప్రకాశ్‌ శర్మ చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. శ్రీరాముడికి ఆయన పరమ భక్తుడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అయోధ్య రాముడి గుడికి ప్రత్యేకంగా ఈ తాళాన్ని తయారు చేశారు. కాగా.. సత్యప్రకాశ్‌ భార్య రుక్మిణి కూడా తాళం తయారీలో సాయం చేశారు. ఇక వాళ్ల కుటుంబం కొన్ని తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతోంది.  

10 అడుగుల ఎత్తు.. 

ఇక ఈ తాళం ప్రత్యేకతలు చూస్తే.. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో దీన్ని రూపొందించారు. ఇక దీని పొడవు నాలుగు అడుగులు. ఈ తాళం తయారు చేసేందుకు 2లక్షలు ఖర్చు అయినట్లు సత్యప్రకాశ్‌ గతంలో చెప్పారు. ఇక దీన్ని గతంలో అలీఘడ్‌లోని ఎగ్జిబిషన్‌లో కూడా ఉంచారు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్య చేరుకుంది. 

 

1256 కిలోల ప్రత్యేక లడ్డు

ఇక అంతేకాకుండా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు ప్రత్యేకంగా.. 1256 కేజీల లడ్డును కానుకగా ఇచ్చాడు ఒక భక్తుడు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 1256 రోజులు పూర్తైన సందర్భంగా 1256 కేజీల ప్రత్యేక లడ్డును అయోధ్యకు చేర్చారు.    

 

అయోధ్యలో నిర్మితమైన రామమందిరానికి దేశం నలుమూలల నుంచి అనేక వస్తువులు వచ్చాయి. రామమందిరానికి సంబంధించిన తలుపులు హైదరాబాద్‌కి చెందిన వారే తయారు చేయగా.. రాములోరికి బంగారు పాదాలు కూడా మన హైదరాబాద్‌ నుంచే వెళ్లాయి. ఇక దేశంలోని నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠాపనను దేశంలోని ప్రజలంతా తమ ఇంట్లో ప్రత్యేక పండుగులాగా జరుపుకుంటున్నారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయోధ్యలో ఆరోజు భక్తుల తాకిడీ, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఎవ్వరినీ రావొద్దని రామ్‌తీర్థ బోర్డు ప్రకటిచింది. ఈ నేపథ్యంలోనే వెళ్లలేని వాళ్లకోసం PVR INOX అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రదర్శించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 160 స్క్రీన్‌లలో లైవ్‌ టెలికాస్ట్ చేయనుంది.జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్‌డే సెలవు ప్రకటించింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. కొన్ని చోట్ల డ్రై డే పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 22న హాఫ్‌ డే సెలవు ప్రకటించాయి.     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
APSRTC: వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
APSRTC: వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Delhi Election Rally: 'మీ అడ్రస్ చెప్పండి, లేఖ పంపిస్తాను' - జనం మధ్యలో తన చిత్రపటం గుర్తించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
'మీ అడ్రస్ చెప్పండి, లేఖ పంపిస్తాను' - జనం మధ్యలో తన చిత్రపటం గుర్తించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Electric Vehicles: ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు రయ్.. రయ్ - బడ్జెట్ ప్రభావంతో ధరలు దిగిరానున్న ఈవీలు, వాయు కాలుష్యానికి చెక్!
ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు రయ్.. రయ్ - బడ్జెట్ ప్రభావంతో ధరలు దిగిరానున్న ఈవీలు, వాయు కాలుష్యానికి చెక్!
Embed widget