అన్వేషించండి

Viral News: సంచలనం, తల్లి డెడ్ బాడీతో ఏడాది పాటు ఇంట్లో ఉన్న అక్కాచెల్లెల్లు

Uttar Pradesh Womens: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి మృతదేహాన్ని ఏడాది పాటు ఇంట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 

Mother Dead Body: ఎవరైనా చనిపోతే మామూలుగా ఏం చేస్తారు? డెడ్ బాడీకి ఆయా మతాలు, కులాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి మృతదేహాన్ని ఏడాది పాటు ఇంట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఒక గదిలో తల్లి డెడ్ బాడీని ఉంచి, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు. డెడ్ బాడీ అంతా కుల్లిపోయి చివరికి అస్థిపంజరం మాత్రమే మిగిలింది. బంధువు ఒకరు ఇంటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. వారణాసి నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి తన ఇద్దరు కూతుళ్లు పల్లవి (27), వైశ్విక్‌ (17)లతో కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. పల్లవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వైశ్విక్‌ పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె చిన్నదుకాణం నడుపుతూ జీవనం సాగించేది. దానిని నుంచి వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించింది. అయితే గతేడాది డిసెంబరు 8న ఉషా మృతి చెందింది. 

తల్లి చనిపోయిందనే విషయాన్ని కూతుళ్లు పల్లవి, వైశ్విక్‌ ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవించసాగారు. ఎప్పుడైనా ఏదైనా కావల్సి వస్తే అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. చనిపోయిన ఉషా త్రిపాఠికి మీర్జాపుర్‌లో ధర్మేంద్రకుమార్‌ అనే సోదరుడు ఉండేవాడు. బుధవారం ధర్మేంద్ర తన చెల్లిని చూసేందుకు ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో ఉన్న పల్లవి, వైశ్విక్ ఎంతసేపటికీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన ధర్మేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూస్తే వారికి కళ్లు బయర్లు కమ్మే సన్నివేశం కనిపించింది. ఒక గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అస్థిపంజరం ఉషా త్రిపాఠిదిగా గుర్తించారు. ఇళ్లంతా చెత్తా చెదారంతో నిండిపోయి, దారుణంగా ఉంది. పోలీసుల దర్యాప్తులో పల్లవి, వైశ్విక్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని  తేలింది. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే..
ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. యూపీలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముండేవాడు. అతను అహ్మదాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహించేవాడు. 2021 ఏప్రిల్ 22న విధుల్లోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విమలేశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు కానీ అంత్యక్రియలు నిర్వహించలేదు. గ్రామస్తులకు విమలేశ్ మృతిచెందిన విషయం తెలియదు. విమలేశ్ కనిపించకపోవడంతో ఆరా తీయడం మొదలుపెట్టారు. విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరిని నమ్మించారు.

విమలేశ్​భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్​ బ్యాంకు​లో మేనేజర్‌గా పని చేస్తోంది. పెన్షన్ కు అప్లై చేసుకునేందుకు విమలేశ్​ మరణ ధ్రువీకరణ పత్రాన్ని బయటపెట్టడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు విమలేశ్ ఇంటికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డెడ్ బాడీని పరీక్షించిన వైద్యులు.. విమలేశ్​మృతదేహం పూర్తిగా చెడిపోయిందని గుర్తించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget