అన్వేషించండి

Viral News: రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తరువాత నిర్దోషిగా తీర్పు, అంతలోనే విషాదం

Gujarat High Court: 20 రూపాయల లంచం కేసులో ఒక కానిస్టేబుల్ దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. 30 ఏళ్ల తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయాడు.

న్యాయం గెలిచింది.. కానీ మనిషి ఓడిపోయాడు: 30 ఏళ్ల పోరాటం తర్వాత విషాదాంతం

అహ్మదాబాద్: భారత న్యాయ వ్యవస్థలో కేసుల విచారణలో జరిగే జాప్యం ఒక్కోసారి మనుషుల జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయాక సైతం తీర్పులు వచ్చిన కేసులు చాలానే ఉన్నాయి. గుజరాత్‌లో దాదాపుగా అలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. కేవలం 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసిన ఒక మాజీ పోలీసు కానిస్టేబుల్ ఎట్టకేలకు నిర్దోషి అని నిరూపించుకున్నాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన మరుసటి రోజే గుండెపోటుతో కన్నుమూయడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన హాలీవుడ్ క్లాసిక్ 'ది షాషాంక్ రిడెంప్షన్' కథను తలపిస్తోంది.

అసలేం జరిగింది?

అహ్మదాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాబూభాయ్ ప్రజాపతి 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో 1996లో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 1997లో ఛార్జ్‌షీట్ దాఖలు కాగా, 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించింది. తాను ఏ తప్పు చేయలేదని, సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలు ఏకంగా 22 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోయింది.

చివరి క్షణంలో న్యాయం

ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాల్లో పొంతన లేదని, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంటూ మాజీ పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు విన్న ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. నా జీవితంపై పడిన పెద్ద మచ్చ తొలగిపోయింది, ఇప్పుడు దేవుడు నన్ను తీసుకువెళ్లినా బాధ లేదు అని తన లాయర్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు.

20 ఏళ్లకు న్యాయం గెలిచింది.. ప్రాణం పోయింది..

కోర్టు తీర్పుతో తన గౌరవం తిరిగి దక్కిందన్న సంతోషంతో బాబూభాయ్ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజే ఆయన గుండెపోటుతో చనిపోయారు. చేయని తప్పిదానికి 30 ఏళ్లు ఎంతో నరకయాతన అనుభవించి, సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కిన విజయాన్ని అనుభవించకుండానే బాబూభాయ్ కన్నుమూయడం ఆయన కుటుంబాన్ని, ఆయన లాయర్లను తీవ్రంగా కలిచివేసింది. న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే మాటకు ఈ ఘటన ఒక నిదర్శనం అని అతడి కుటుంబసభ్యులు అంటున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget