అన్వేషించండి

Bharat Rice: త్వరలోనే మార్కెట్‌లోకి భారత్ రైస్, కిలో ధర రూ.25 మాత్రమే!

Bharat Rice: బియ్యం ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం త్వరలోనే భారత్ రైస్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.

Bharat Brand Rice: 


భారత్ రైస్..

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు (Rice Price Hike) అనూహ్యంగా పెరుుతున్నాయి. ఈ ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్‌లోకి Bharat rice ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది. కిలో రూ.25 చొప్పున వీటిని విక్రయించనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా బియ్యం ధరలు పెరగడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే Bharat atta,Bharat dal తో తక్కువ ధరకే గోధుమలు, పప్పులు విక్రయిస్తోంది. ఇది బాగానే సక్సెస్ అయింది. అందుకే రైస్ విషయంలోనూ ఇదే విధంగా స్కీమ్ తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం.  National Agricultural Cooperative Marketing Federation of Indiaతో పాటు National Cooperative Consumers’ Federation of India Ltd, కేంద్రీయ భండార్ ఔట్‌లెట్స్, మొబైల్ వ్యాన్స్ ద్వారా ఈ రాయితీని అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ రైస్‌ ధర కిలోకి రూ.43 దాటింది. గతేడాదితో పోల్చి చూస్తే..ఇది 14.1% ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి రాయితీ కింద కిలో గోధుమలను రూ.27.50కి, పప్పులను రూ.60 చొప్పున విక్రయిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల రిటైల్ పాయింట్స్ వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఒక్క నవంబర్‌లోనే బియ్యం ధర 10.3% మేర పెరిగింది. ఫలితంగా...Food Inflation ఒక్కసారిగా 8.7% పెరిగింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు బియ్యం అందుబాటు ధరలో ఉండేలా చూడనుంది ప్రభుత్వం. 

15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో రైస్ ధరలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు మార్కెట్‌ నిపుణులు. రైస్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఆ స్థాయిలో సరఫరా లేకుండా పోయింది. Consumer Affairs డిపార్ట్‌మెంట్‌కి చెందిన Price Monitoring Division లెక్కల ప్రకారం చూస్తే...ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15% మేర (Rice Price Hike) పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకి రూ.37.99గా ఉంది. ఇదే ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51 కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకూ వెళ్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్, అక్టోబర్‌లో ధరలు కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్ని తగ్గించాలని తేల్చి చెప్పింది కేంద్రం. లాభాల కోసం ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బియ్యం ధరలు పెరగడం మోదీ సర్కార్‌కి సమస్యగా మారింది.

Also Read: Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ భారత్‌ న్యాయ్ యాత్ర, ఈ సారి మణిపూర్ నుంచి మొదలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget