అన్వేషించండి

Bharat Rice: త్వరలోనే మార్కెట్‌లోకి భారత్ రైస్, కిలో ధర రూ.25 మాత్రమే!

Bharat Rice: బియ్యం ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం త్వరలోనే భారత్ రైస్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.

Bharat Brand Rice: 


భారత్ రైస్..

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు (Rice Price Hike) అనూహ్యంగా పెరుుతున్నాయి. ఈ ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్‌లోకి Bharat rice ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది. కిలో రూ.25 చొప్పున వీటిని విక్రయించనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా బియ్యం ధరలు పెరగడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే Bharat atta,Bharat dal తో తక్కువ ధరకే గోధుమలు, పప్పులు విక్రయిస్తోంది. ఇది బాగానే సక్సెస్ అయింది. అందుకే రైస్ విషయంలోనూ ఇదే విధంగా స్కీమ్ తీసుకురావాలని భావిస్తోంది కేంద్రం.  National Agricultural Cooperative Marketing Federation of Indiaతో పాటు National Cooperative Consumers’ Federation of India Ltd, కేంద్రీయ భండార్ ఔట్‌లెట్స్, మొబైల్ వ్యాన్స్ ద్వారా ఈ రాయితీని అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ రైస్‌ ధర కిలోకి రూ.43 దాటింది. గతేడాదితో పోల్చి చూస్తే..ఇది 14.1% ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి రాయితీ కింద కిలో గోధుమలను రూ.27.50కి, పప్పులను రూ.60 చొప్పున విక్రయిస్తోంది కేంద్రం. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల రిటైల్ పాయింట్స్ వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఒక్క నవంబర్‌లోనే బియ్యం ధర 10.3% మేర పెరిగింది. ఫలితంగా...Food Inflation ఒక్కసారిగా 8.7% పెరిగింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు బియ్యం అందుబాటు ధరలో ఉండేలా చూడనుంది ప్రభుత్వం. 

15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో రైస్ ధరలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు మార్కెట్‌ నిపుణులు. రైస్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఆ స్థాయిలో సరఫరా లేకుండా పోయింది. Consumer Affairs డిపార్ట్‌మెంట్‌కి చెందిన Price Monitoring Division లెక్కల ప్రకారం చూస్తే...ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15% మేర (Rice Price Hike) పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకి రూ.37.99గా ఉంది. ఇదే ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51 కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకూ వెళ్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్, అక్టోబర్‌లో ధరలు కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్ని తగ్గించాలని తేల్చి చెప్పింది కేంద్రం. లాభాల కోసం ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బియ్యం ధరలు పెరగడం మోదీ సర్కార్‌కి సమస్యగా మారింది.

Also Read: Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ భారత్‌ న్యాయ్ యాత్ర, ఈ సారి మణిపూర్ నుంచి మొదలు

 

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget