By: ABP Desam | Updated at : 14 Dec 2022 11:38 AM (IST)
Edited By: Arunmali
పెట్టుబడి నిర్ణయాల్లో స్త్రీ-పురుషుల మధ్య ఇంత తేడానా?
DSP Winvestor Pulse Survey: సంపాదించే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తమ భవిష్యత్ అవసరాల కోసం ఏదోక రూపంలో పెట్టుబడులు పెడుతుంది. డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి ఏదోక సందర్భంలో పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు. అలాంటి సందర్భంలో వాళ్లు ఏం ఆలోచిస్తారు, ఎలా ముందడుగు వేస్తారు? అన్న విషయాల మీద 'DSP విన్వెస్టర్ పల్స్ 2022' పేరిట ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
'DSP విన్వెస్టర్ పల్స్ 2022' సర్వే ప్రకారం... ఎక్కువ మంది పురుషులు తమ పెట్టుబడి నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు, మహిళల విషయంలో మాత్రం అలా కాదు. ప్రతి ముగ్గురు పురుషుల్లో ఇద్దరు (66%) స్వతంత్రంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. మహిళల విషయంలో ఇది కేవలం 44% మాత్రమే.
ప్రొఫెషనల్ అడ్వైజర్ను సంప్రదించకుండా 40% మంది పురుషులు, 27% మంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.
ఎక్కువగా నమ్ముతోంది మహిళలే!
పెట్టుబడి నిర్ణయాల విషయంలో ఎక్కువ మంది మహిళలు తమ భర్తలను సంప్రదిస్తారు. పురుషులు మాత్రం తమ భార్యల కంటే తండ్రులనే ఎక్కువ మంది సంప్రదిస్తారు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో, 67% మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను సంప్రదిస్తుంటే, 48% మంది పురుషులు మాత్రమే (సగం కన్నా తక్కువ మంది) ఇలాంటి ఆలోచన చేస్తారని సర్వేలో తేలింది.
పెట్టుబడి నిర్ణయాల కోసం దాదాపు 26% మంది పురుషులు తమ తండ్రులను సంప్రదిస్తే, 10% మంది మహిళలు మాత్రమే అలా చేస్తారు.
కేవలం 6% మంది పురుషులు మాత్రమే పెట్టుబడి నిర్ణయాల కోసం తమ తల్లులను సంప్రదిస్తారు. ఈ విషయంలో మహిళలు ఇంకా వెనుక ఉన్నారు. కేవలం 5% మంది మహిళలు మాత్రమే అలా చేస్తారు.
ఆడ సలహా - మగ సలహా
సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది (దాదాపు 80%) ఆర్థిక సలహాదారులకు లింగ ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే... పురుషుల్లో 15% మంది మాత్రం పురుష ఆర్థిక సలహాదారులను ఇష్టపడ్డారు. మహిళల్లో 13% మంది కూడా పురుష సలహాదారులకే ఓటు వేశారు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే... ఇప్పటికే ఆర్థిక పెట్టుబడులు పెట్టిన వాళ్లలో చాలా మంది వాళ్ల భర్తల ద్వారా ప్రేరణ పొందారు. పెట్టుబడుల మార్కెట్కు భర్తలే వారిని పరిచయం చేశారు. చాలా మంది పురుషులు స్వయంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టారట. మరికొందరు వాళ్ల తండ్రి ద్వారా పెట్టుబడుల గురించి తెలుసుకున్నారట.
ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే... పెట్టుబడి విషయంలో దాదాపు 70% మంది తమ కొడుక్కి, కుమార్తెకు ఒకే రకమైన సలహాలు ఇవ్వరట. ఇద్దరికీ వేర్వేరు సలహాలు ఇస్తారట.
కొవిడ్ తర్వాతి కాలంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టామని దాదాపు 45% మంది పురుషులు, మహిళలు చెప్పారు. మహమ్మారి వల్ల ఆర్థిక ఆలోచనల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడులు పెంచుకోవాల్సిన అవసరం, గతంలో కంటే ఎక్కువ రాబడిని కోరుకోవడం, యాప్ల ద్వారా పెట్టుబడి పెట్టే సౌలభ్యం కూడా దోహదపడింది.
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై ఉత్కంఠ, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
Parliament Winter Session: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి, మీ ఆక్రోశాన్ని చూపించకండి - ప్రతిపక్షాలకు ప్రధాని ఉపదేశం
Share Market Opening Today 04 December 2023: మార్కెట్లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్లో సెన్సెక్స్, నిఫ్టీ
Telangana New CM: సాయంత్రం తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం- చాలా సింపుల్గా కార్యక్రమం!
Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
/body>