అన్వేషించండి

NEET UGC 2024: నీట్‌ ఎగ్జామ్‌పై అంతా నమ్మకం కోల్పోయారు, వెంటనే రద్దు చేయండి - తమిళ నటుడు విజయ్ డిమాండ్

NEET Exam Row: నీట్‌ ఎగ్జామ్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని తమిళ నటుడు విజయ్ విమర్శించారు. వెంటనే నీట్‌ని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Actor Vijay on NEET Row: నీట్‌ ఎగ్జామ్‌పై తమిళ నడుటు, తమిళగ వెట్రి కరగం చీఫ్‌ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ ఎగ్జామ్‌పై విశ్వాసం కోల్పోయారని తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. వెనకబడిన వర్గాలకు ఈ పరీక్ష కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వెల్లడించారు. స్టేట్‌ సిలబస్‌ చదువుకున్న వాళ్లకి NCERT సిలబస్‌లో ఎగ్జామ్ పెట్టడమేంటని ప్రశ్నించారు. తమిళనాడు ప్రజల అభిప్రాయాలను గౌరవించి వెంటనే ఈ పరీక్షని రద్దు చేయాలని కేంద్రానికి సూచించారు. 

"నీట్‌ ఎగ్జామ్‌పై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారు. ఈ దేశానికి ఈ పరీక్ష అవసరమే లేదు. దీని నుంచి మినహాయింపు ఇవ్వడం తప్ప మరో పరిష్కారం లేదు. రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌ని వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. తమిళనాడు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే దీన్ని రద్దు చేయాలి"

- విజయ్, నటుడు, రాజకీయ నాయకుడు 


మొదటి నుంచి నీట్ ఎగ్జామ్‌ని వ్యతిరేకిస్తూనే ఉంది తమిళనాడు ప్రభుత్వం. ఇది కేవలం ధనవంతుల కోసమే పెడుతున్న ఎగ్జామ్ అని మండి పడుతోంది. ఇప్పుడు పేపర్ లీక్ వ్యవహారంతో మరింత దూకుడు పెంచింది. అసలు నీట్‌ ఎగ్జామ్‌ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. గతంలోలా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్‌లు ఇవ్వాలని తేల్చిచెబుతోంది. ఈ మేరకు ఇటీవలే అసెంబ్లీలో ఓ తీర్మానాన్నీ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ తీర్మానాన్ని తీసుకురాగా దానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నీట్‌ని వ్యతిరేకిస్తున్నారు. వెంటనే రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వివాదం దుమారం రేపుతూనే ఉంది. 

ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఈ వివాదంపై సభలో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇంత సున్నితమైన అంశాన్ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మండి పడ్డారు. యువత భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్‌లో ఈ వివాదంపై చర్చించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థుల ప్రశ్నలకు మోదీ సమాధానం చేప్పాలని అన్నారు. ట్విటర్‌లో ఆయన ఈ మేరకు లెటర్‌ని పోస్ట్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget