అన్వేషించండి

దేశంలో పెరిగిన కరవు ప్రభావిత ప్రాంతాలు- 124 ఏళ్ల నాటి పరిస్థితులు

Drought conditions in India: దేశంలో 124 ఏళ్ల నాటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా పలు జిల్లాలో ఈ వానాకాలంలో సరైన వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఈసారి జూన్‌లో ఆశించినంత వర్షాలు పడలేదు. కానీ జులైలో వానలు బాగా పడడంతో ఆ లోటు తీరింది. కానీ మళ్లీ ఆగస్టు ప్రారంభమైనప్పటి నుంచి వర్షాల జాడ లేదు. ఆగస్టు నెలలో ఇంత ఎక్కువగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం గత 124 ఏళ్లలో తొలి సారిగా జరుగుతోంది. ఈ నెలలో పలు రాష్ట్రాల్లో సగటు వర్షపాతంతో పోలిస్తే 35 శాతానికి మించి లోటు ఏర్పడింది. రుతుపవనాల రాకను ఈ సారి ఎల్‌నిన్‌ దెబ్బ తీసిందని, దీంతో వర్షాభావ పరిస్థితులు వచ్చాయని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. సరైన వర్షాలు లేక దేశ వ్యాప్తంగా దాదాపు 289 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. 

1899 ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా అత్యధిక వర్షపాత లోటు 40 శాతం ఏర్పడింది. ఆ తర్వాత 1931 లో ఆగస్టు నెలలో 31 శాతం నమోదైంది. కాగా ఈ ఏడాది మరోసారి అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ నెలాఖరుకి వచ్చేశాం. రానున్న అయిదు రోజుల్లో పెద్దగా భారీ వర్షాలు, తుపాన్లు కురిసే అవకాశాలు కూడా లేవని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. కాబట్టి ఈ నెలలో ఇలాగే వర్షాభావం కొనసాగితే ఈ నెల లోటు 40 శాతం దాటి పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 124 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలకు వర్షాభావం ఏర్పడనుంది.

తెలంగాణలోనూ ఆగస్టులో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. ఈ నెల 1 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షపాతం 166.6 మిల్లీమీటర్లు. అంటే రాష్ట్ర సగటు వర్షపాతం కంటే 66 శాతం లోటు ఏర్పడింది. జిల్లాల విషయానికొస్తే.. వికారాబాద్‌ జిల్లాలో ఆగస్టులో అధికంగా 93 శాతం లోటు ఏర్పడింది. జనగామలో 90 శాతం, సిద్ధిపేటలో 83 శాతం,  రంగారెడ్డి, సంగారెడ్డిలలో 82 శాతాల చొప్పున వర్షపాత లోటు ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 42 మండలాలు వర్షపాత లోటులోనే ఉన్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. అవి కొన్ని జిల్లాలకే పరిమతవుతున్నాయి. నెలాఖరు వరకు వర్షాలు కురవకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సగటున వర్షపాత లోటు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో ఈ నెలలో ఏ ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. 

జూన్‌ 1 నుంచి ఆగస్టు 22 వరకు వర్షపాత లోటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగానే ఉంది. మణిపూర్‌లో వర్షపాత లోటు 47, కేరళలో 46, ఝార్ఖండ్‌లో 37, బిహార్‌లో 31, ఉత్తరప్రదేశ్‌లో 23, అస్సాంలో 18, కర్ణాటకలో 17, ఆంధ్రప్రదేశ్‌లో 16 శాతంగా నమోదైంది.  ఈ ఏడాది వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించాయని, పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వానాకాలంలో రెండు సార్లు కురిసే వర్షాల మధ్య కొంత సమయం ఉంటుంది. ఆ సమయం పెరిగితే పంటల పెరుగుదలకు ఇబ్బంది ఏర్పడుతుంది. దేశ వ్యాప్తంగా వందల జిల్లాల్లో ఈ సమయం 20 రోజుల కంటే ఎక్కువ పెరిగింది. మామూలుగా అయితే ఇది పది రోజులే ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Embed widget