అన్వేషించండి

Bobbatlu Recipe : ఉగాది స్పెషల్ ఆంధ్రా స్టైల్ బొబ్బట్లు.. ఈ రెసిపీతో టేస్టీగా చేసుకోవచ్చు

Ugadi 2024 : తెలుగు నూతన సంవత్సరానికి దాదాపు అందరి ఇళ్లల్లో పలు రకాల వంటలు చేస్తారు. దానిలో ప్రధానంగా బొబ్బట్లు ఉంటాయి. వీటిని టేస్టీగా చేసుకోవాలంటే ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

Ugadi 2024 Special Bobbatlu Recipe : పండుగల సమయంలో ముఖ్యంగా.. ఉగాది సమయంలో ఎక్కువగా చేసుకునే రెసిపీలలో బొబ్బట్లు ఒకటి. అయితే దీనిని తయారు చేసుకోవడం కాస్త కష్టంతో కూడిన పనే. కానీ మీరు కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే దీనిని హాయిగా ఇంట్లో చేసుకోవచ్చు. పైగా ఇలా చేసుకుంటే ఎక్కువ మొత్తంలో బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - 1 కప్పు

మైదా  - 1 కప్పు

ఉప్పు - తగినంత

పసుపు - చిటికెడు

నీరు - ముప్పావు కప్పు

నెయ్యి - వంటకు సరిపడా

పూర్ణం కోసం..

శనగపప్పు - 1 కప్పు

నీరు - 2.5 కప్పులు

బెల్లం - 1 కప్పు

యాలకుల పొడి - అర టీస్పూన్

తయారీ విధానం

ముందుగా గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, మైదా పండి, పసుపు, చిటికెడు ఉప్పు వేసి మిక్స్ చేయాలి. బొబ్బట్లు బాగా రావాలంటే.. ఈ పిండి మిశ్రమాన్ని జల్లెడ పట్టాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా నీరు వేసుకుంటూ.. ముద్దగా కలుపుకోవాలి. పిండిని కలుపుతూ.. ముద్దలు లేకుండా మెత్తని పిండిగా బాగా పిసికి కలుపుకోవాలి. పిండి తేలికగా.. మెత్తగా ఉండేలా కలపుకోవడం కోసం దానిలో నూనె లేదా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. పిండిలో నెయ్యి కలిపోయేలా పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడే పిండి మృదువుగా, తేలికగా మారుతుంది. ఇలా కలుపుకున్న పిండిని.. కవర్ చేసి.. అరగంట పక్కన పెట్టుకోవాలి. కవర్ చేసేముందు ఓ చెంచా నెయ్యి కూడా వేసుకోవచ్చు. 

బొబ్బట్లు పూర్ణం కోసం..

కుక్కర్​ను తీసుకుని దానిలో శనగపప్పు వేసి కడగాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై కుక్కర్ పెట్టి.. శనగపప్పు ఉడికేలా నీరు వేయాలి. కావాలంటే మీరు ఓ గంట ముందు శనగపప్పును నానబెట్టుకోవచ్చు కూడా. దీనిని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. కుక్కర్ మూత తెరిచి.. శనగపప్పు బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికితే పర్లేదు. కానీ.. ఉడకకుంటే మరోసారి కుక్కర్ వెలిగించి.. అవసరాన్ని బట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన శనగపప్పులో నీరు ఎక్కువ ఉంటే కాస్త పారేసి.. కుక్కర్​లో పప్పు గుత్తితో శనగపప్పు కచ్చాపచ్చాగా మెత్తగా చేసుకోవాలి. కొందరు చేతివేళ్లతో ఈ ప్రాసెస్ చేస్తారు. అలాంటివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

ఇలా చేసుకున్న పప్పును కాస్త చల్లారిన తర్వాత మిక్సర్​లో లేదా గ్రైండర్​ జార్​లో వేయాలి. దానిలో తరిగిన బెల్లం, యాలకుల పొడి వేసుకోవాలి. ఇవి మంచి పేస్ట్.. కాస్త కచ్చాపచ్చాగా అయినా మిక్స్​ అయ్యేలా గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బొబ్బట్లు తింటున్నప్పుడు అక్కడక్కడ శనగపప్పు కూడా తగులుతూ ఉంటుంది. అలా అని ఎక్కువగా పప్పులు ఉండేలా చేయకూడదు. గోధుమ రవ్వ మాదిరిగా ఉంటే చాలు. లేదంటే బొబ్బట్లు విరిగిపోతాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి.. శనగపప్పు, బెల్లం మిశ్రమంలో వేయాలి. మంటను తగ్గించి.. పిండిని మిక్స్ చేస్తూ.. పిండిని బాగా కలపాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్​గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి ఎండిపోకుండా కవర్ చేయండి. 

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని.. శనగపప్పుతో చేసిన బాల్స్​ చుట్టూ లేయర్​గా చుట్టి.. వాటిని మెత్తగా కావాల్సినంత సైజ్​లో.. బొబ్బట్టు చితికిపోకుండా చేతితో ఒత్తుకోండి. అంచులు పోకుండా.. జాగ్రత్తగా దానిని చదును చేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి తవా పెట్టండి. దానిపై కాస్త గోధుమపిండిని చల్లి.. అది గోధుమరంగులోకి మార్చి తర్వాత పిండిని తుడిచేసి.. బొబ్బట్టును ప్లేస్ చేయాలి. కాస్త నెయ్యి వేసుకుని ఇరువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బొబ్బట్లు రెడీ. హాయిగా వీటిని ఉగాది రోజు చేసుకుని ఆస్వాదించేయండి. 

Also Read : క్యారెట్లను ఇలా వండుకుంటే బరువు సులభంగా తగ్గుతారట.. సింపుల్, టేస్టీ రెసిపీలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget