అన్వేషించండి

TS DSC: ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ, 2 లక్షలు కూడా దాటలేదు!

తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబరు 28 అర్ధరాత్రితో ముగిసింది. చివరిరోజైన శనివారం ఉదయం కొంత సేపు సర్వర్‌ డౌన్‌ కావడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.

తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు శనివారం(అక్టోబరు 28) అర్ధరాత్రితో ముగిసింది. చివరిరోజైన శనివారం ఉదయం కొంత సేపు సర్వర్‌ డౌన్‌ కావడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. చివరికి గడువు ముగిసే సమయానికి మొత్తం 1,76,527 దరఖాస్తులు అందినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి డీఎస్సీ దరఖాస్తు గడువు అక్టోబరు 21తో ముగియగా.. అభ్యర్థుల డిమాండ్‌ మేరకు అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సి డీఎస్సీ పరీక్షలను ఎన్నికల కారణంగా ప్రభుత్వం వాయిదావేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు వాయిదాపడటంతో.. దరఖాస్తు గడువును కూడా అధికారులు తాజాగా పొడిగించారు. 

దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తంగా 1,79, 297 మంది ఫీజు చెల్లించగా, సాయంత్రం వరకు 1,76,527 లక్షల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్  టీచర్స్(ఎస్‌జీటీ), పీఈటీ, భాషా పండితులు, తదితర పోస్టులు మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. అత్యధికంగా ఎస్‌జీటీ తెలుగు మీడియం కోసం 60,190 మంది దరఖాస్తులు సమర్పించారు. అత్యల్పంగా లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ) పోస్టులకు 328 దరఖాస్తులు మాత్రమే అందాయి. పరీక్షలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. 

2 లక్షలు దాటని దరఖాస్తులు..
డీఎస్సీ దరఖాస్తులు ఈసారి కనీసం రెండు లక్షలు కూడా దాటకపోవడం గమనార్హం. అదే గతంలోనైతే డీఎస్సీ అంటే భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చేవి. కానీ ఈసారి 5,089 పోస్టులు మాత్రమే ఉండడంతోపాటు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులకు అర్హత లేకపోవడం లాంటి కారణాలతో ఈసారి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య చాలా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

పోస్టులవారీగా అందిన దరఖాస్తుల వివరాలు..

➥ ఎస్‌జీటీ తెలుగు మీడియం - 60,190

➥ ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం - 2,735

➥ ఎస్‌జీటీ ఉర్దూ - 3,004

➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ తెలుగు మీడియం) - 27,872

➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ ఇంగ్లిష్ మీడియం) - 1,401

➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ తెలుగు మీడియం) - 22,531

➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,769

➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం) - 12,610

➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,927

➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్సెస్ తెలుగు మీడియం) - 3,141

➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం) - 1,619

➥ స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) - 11,144

➥ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) - 3,282

➥ స్కూల్ అసిస్టెంట్ (హిందీ) - 1,868

➥ లాంగ్వే్జ్ పండిట్ (తెలుగు)  -9,620

➥ లాంగ్వే్జ్ పండిట్ (హిందీ)  - 2,300

➥ లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ)  - 328

➥ పీఈటీ (తెలుగు మీడియం) - 6,253

➥ ఇతర పోస్టులకు అందిన దరఖాస్తులు - 2933.

పరీక్ష స్వరూపం ఇలా..

➥ పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ వెల్లడించింది.  ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్‌ ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.

➥ ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు. 

➥ పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది. 

Notification

TS DSC 2023 Details

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget