![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TG TET 2024 Results: నేడే తెలంగాణ టెట్-2024 పరీక్ష ఫలితాల వెల్లడి, మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్స్
TET Results: తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాల కోసం 2.36 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
![TG TET 2024 Results: నేడే తెలంగాణ టెట్-2024 పరీక్ష ఫలితాల వెల్లడి, మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్స్ telangana teachers eligibility test TG TET 2024 Results will be announced today ie June 12th, 2024 TG TET 2024 Results: నేడే తెలంగాణ టెట్-2024 పరీక్ష ఫలితాల వెల్లడి, మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/c237a365b7f03fe12b092a13783ce1e01718138362474522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TGTET 2024 Results Link: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET Result) ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు టెట్ ఫలితాలను వెల్లడించనున్నారు. టెట్ రాసిన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి సారిసగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని జూన్ 3న అధికారులు విడుదల చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్ కీని రూపొందించింది. జూన్ 12న ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఈసారి టెట్ పరీక్షలకు మొత్తం 2,86,381 దరఖాస్తు చేసుకోగా.. వారిలో పరీక్షలకు 2,36,487 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో పేపర్-1 పరీక్షకు మొత్తం 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా పేపర్-2 పరీక్షకు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు టెట్ పరీక్షకు ప్రాధాన్యమిస్తారు. అలాగే ప్రభుత్వ టీచర్ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) రాసేందుకు టెట్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. కాబట్టి బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు టెట్ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు పోటీపడుతుంటారు. టెట్ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు పోటీపడుతుంటారు.
అర్హత మార్కులు..
టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా... జూన్ 20తో గడువు ముగియనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 31 వరకు టీఎస్ డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా 37,700 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.14 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడితే.. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేవారిక సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)