By: ABP Desam | Updated at : 04 Apr 2023 10:33 PM (IST)
Edited By: omeprakash
ఎస్జేవీఎన్ నోటిఫికేషన్
సత్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎన్జేవీఎన్) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రింట్అవుట్ను మే 19 వరకు పంపించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 50
* ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 6-14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35-45 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
1. కనీసం 06 ఏళ్లు పని అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.80000 చెల్లిస్తారు.
2. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.97000 చెల్లిస్తారు.
3. కనీసం 14 ఏళ్లు పని అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.118000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.590.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రింట్ అవుట్ను సంబంధిత చిరునామాకి పంపాలి.
ముఖ్యమైన తేదీలు...
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2023.
* దరఖాస్తు చివరితేది: 28.04.2023.
* దరఖాస్తు ప్రింట్అవుట్ను పంపడానికి చివరితేది: 19.05.2023
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Advt. No. 110/2023
O/o DGM (Recruitment)
SJVN Limited
Shakti Sadan, Corporate Head Quarters, Shanan Shimla, HP-171006
Also Read:
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఖరారు చేసింది. పరీక్షను జూన్ 5న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 25న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుం మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును పరీక్షకు కొన్నివారాలకు ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్పూర్లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
NERIST: అరుణాచల్ప్రదేశ్ ఎన్ఈఆర్ఐఎస్టీలో 32 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
SCTIMST: తిరువనంతపురం ఎస్సీటీఐఎంఎస్టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్షాతో రేపు ప్రధానితో సమావేశం!
Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ
Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు