అన్వేషించండి

Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 896 మందికి పాజిటివ్, 6 మరణాలు

ఏపీలో కొత్తగా 896 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 6 మంది మరణించారు. రాష్ట్రంలో 24,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,066 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 896 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 6 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,694కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,849 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,72,881 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 24,454 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల(Covid positive Cases) సంఖ్య 23,12,029కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,09,000 నిర్థారణ పరీక్షలు చేశారు. 

తెలంగాణలో కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,714 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 683 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,019కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరణాలు సంభవించలేదు. కోవిడ్ నుంచి నిన్న 2,645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 13,674 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 168 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకు కరోనా(Corona) కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో 50,407 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ పాజిటివటీ రేటు కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 804 కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 97.37 శాతం రికవరీ రేటుతో 1,36,962 మంది కోవిడ్‌-19(Covid-19) వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,443గా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు మొత్తం కేసులలో 1.43 శాతం. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, దేశంలో దాదాపు 172.29 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తయ్యాయి

కేరళ(Kerala)లో ఇప్పటికి కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 16,012 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో రాష్ట్రంలో 27 మంది మృతి చెందారు. మహారాష్ట్ర(Maharashtra)లో గత 24 గంటల్లో 5,455 మందికి వైరస్ సోకింది. వైరస్‌ బారిన పడి 63 మంది చనిపోయారు. ముంబైలో రెండు మరణాలతో 429 కేసులు నమోదయ్యాయి. దిల్లీ(Delhi)లో గడచిన 24 గంటల్లో 977 కోవిడ్ కేసులు గుర్తించారు. 12 మంది మరణించారు. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది. కర్ణాటక(Karnataka)లో గత 24 గంటల్లో 3,976 కోవిడ్ కేసులు నమోదవ్వగా  41 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో గత 24 గంటల్లో 27 మరణాలతో 767 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కేసుల తగ్గుదల కారణంగా, అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలిస్తున్నారు. విద్యాసంస్థలు తెరుస్తున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Embed widget