అన్వేషించండి

Trinayani Serial Today December 20th Episode : 'త్రినయని' సీరియల్: గాయత్రీపాప పాలలో విషం కలిపిన తిలోత్తమ, నయని కనిపెడుతుందా?

Trinayani Today Episode: గాయత్రీ పాపకు ఇచ్చిన పాలలో తిలోత్తమ విషం కలపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Telugu Serial Today Episode :

హాసిని: ఉలూచి చేయి అత్తయ్య చేతి కట్టుకు తగిలినప్పుడే నొప్పి తగ్గింది. విశాల్ కట్టు విప్పాక అందులో నుంచి నాగులాపురం గవ్వ ఒకటి ఊడి వచ్చింది. 
సుమన: అందుకు సంతోషించాలి కానీ నా బిడ్డకు ఆ గవ్వకు ఏదో సంబంధం ఉందని అందరికీ అనుమానం వచ్చేలా ఎందుకు అనాలి. 
విక్రాంత్: నేను అన్నానే అనుకో నువ్వు నన్ను అడగకుండా వదిన వాళ్లను అడుగుతున్నావేంటి. పాపం.
సుమన: పాపం అని జాలి చూపించకండి. దత్తత తీసుకున్న పిల్లమీద మాత్రం మచ్చ పడకుండా ఉండాలి అని మా అక్క బిడ్డను పక్కకు తీసుకొచ్చి వాళ్ల వీళ్ల గొడవలు వద్దని సర్దిచెప్తుంది. నా బిడ్డను అంటే మాత్రం వీళ్లకి పట్టింపు ఉండదు. 
నయని: ఉలూచి పాప వల్ల మంచే జరిగింది అని సంతోషించకుండా సమస్య తెచ్చుకుంటున్నావు ఎందుకు. 
సుమన: తెచ్చింది మీరు.  
విక్రాంత్: ఆ రోజు కూడా ఉలూచి పాప వల్లే పెట్టె బయటపడింది. అందుకే అలా అన్నాను. 

ఇక హాసిని ఒక పాప చేసిన దానికి మరో పాపని అంటున్నారా అని అంటుంది. ఏమన్నావ్ అక్కా అని నయని అడగడంతో దాన్ని కవర్ చేస్తుంది. ఇక సుమన తన బిడ్డ కోసం పబ్లిసిటీ ఇవ్వొద్దని వాళ్లతో గట్టిగా చెప్తుంది. మరోవైపు అఖండ స్వామి దగ్గరకు తిలోత్తమ, వల్లభ వస్తారు. వల్లభ అఖండ స్వామి మీద విరుచుకుపడతాడు. తలోత్తమకు గండం వచ్చిందని ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు.

అఖండ: గవ్వ పెట్టింది వల్లభ కాదు తిలోత్తమ. నీ శత్రువు. ఇంట్లో వాళ్లంతా నీ చావుకి సహకరించేవాళ్లే. నేరుగా దాడి చేసేది మాత్రం గాయత్రీ దేవినే. 
తిలోత్తమ: అంతే ఏంటి స్వామి గాయత్రీ అక్కయ్య ఇంటికి వచ్చిందా.. సూటిగా సమాధానం చెప్పండి స్వామి.
అఖండ: గాయత్రీ పేరు మార్చాలి అని చూసినా మారలేదు అంటే. ఆ పిల్లే మీ శత్రువు అయిండొచ్చు కదా.. బాగా ఆలోచించండి.. సమస్య తేల్చేయొచ్చు.
తిలోత్తమ: కొద్ది కొద్దిగా అర్థమవుతుంది స్వామి. ఈ రాత్రికి ఆ పిల్ల గాయత్రీ అక్కయ్య కాదా అని డిసైడ్ చేసేస్తా. విషం ప్రయోగం జరిపితే తనకు హాని తలపెట్టామని నయని గ్రహిస్తే మాత్రం ఆ బిడ్డ నయని సొంత బిడ్డ కాదని అర్థం..
వల్లభ: ఒక వేళ గ్రహించకపోతే.
అఖండ: మీ అమ్మని చంపడానికి వచ్చిన మృత్యు దేవత గాయత్రీ తనే అని అర్థం.

ఇక హాసిని కిచెన్‌లో నుంచి గాయత్రీ పాప కోసం పాలు తీసుకెళ్తుంటే ఆ పాలు తీసుకొన్న తిలోత్తమ అందులో విషం కలిపేస్తుంది. ఇక వల్లభ చాటుగా నయనిని పసిగడతుంటాడు. తిలోత్తమ, వల్లభ ఫోన్‌లో మాట్లాడుకుంటారు. ఇంకా నయని సమస్య గుర్తించలేదని అనుకుంటారు. ఇక ఇంతలో వాళ్ల బిహేవియర్ హాసినికి అనుమానం వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసుకొని కిచెన్‌లో జరిగిన విషయం నయనికి మెసేజ్ చేస్తుంది. అది చూసిన నయని కంగారుగా బయటకు వస్తుంది. ఇంతలో వల్లభ అక్కడ ఉండడంతో చూసి షాక్ అవుతుంది. వల్లభ కవర్ చేసి మెల్లగా అక్కడ నుంచి జారుకుంటాడు. నయనికి అనుమానం పెరుగుతుంది. మరోవైపు హాల్ లోకి అందరూ వస్తారు. ఇక సుమన పాలు తీసుకొని వచ్చి తన బిడ్డ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. 

నయని: నువ్వు పాలు తీసుకొని వస్తే తాగుదామని ఎదురు చూస్తుంది సుమన గాయత్రీ పాప. 
సుమన: నేను ఈ పిల్లకోసం ఎందుకు తీసుకొస్తాను.
పావనా: ఆల్రెడీ హాసిని అమ్మ గాయత్రీ పాప కోసం తీసుకొచ్చిందిలేమ్మా.
నయని: ఏంటి బాబాయ్ హాసిని అక్కే తీసుకురావాలా.. పిన్ని అయిన సుమన గాయత్రీ కోసం తీసుకురాకూడదా.. 
విశాల్: నయని ఎవరికి తీసుకొచ్చిన పాలు వారికి తాగించండి.
నయని: ఈ పూటకి మార్చుదాం బాబుగారు. ఉలూచిని నేను నా బిడ్డగా చూస్తున్నప్పుడు గాయత్రీ పాపను నా చెల్లి పరాయి బిడ్డగా చూడకూడదు కదా.. 
తిలోత్తమ: రేయ్ తనకి పాలలో ఏదో కలిపామని అనుమానం వచ్చిందిరా. 
సుమన: అక్కా నేను గాయత్రీకి పాలు తాగించను నాకు ఇష్టం ఉండదు. 
హాసిని: చిట్టీకి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు బలవంతం చేయాలి చెల్లి.
నయని: అలా అని కాదు అక్క. అప్పుడప్పుడు ఇలా మార్పులు చేర్పులు చేస్తే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు కదా.

ఇక సుమన ఉలూచిని పిలిస్తే.. నయని రాదు అని చెప్తుంది. ఎందుకు రాదు అని సుమన అడిగితే.. నేను పిలిస్తే వస్తుందేమో అంటుంది. దాంతో విక్రాంత్ అలా అనకండి వదిన.. ఊలూచిని మీరు కన్నారా అని మీ చెల్లి అడుగుతుంది అంటాడు. దీంతో సుమన అదే మాట అడుగుతున్నాను అని అంటుంది. దీంతో నయని ఒక పని చేద్దామని చెప్పి.. సుమన, తిలోత్తమ ఇద్దరూ తెచ్చిన పాల్లను అక్కడ పెడదామని ఉలూచి ఏ పాలు తాగుతుందో అంటుంది. దీంతో తిలోత్తమ నయని తమ ప్లాన్ తెలుసుకున్నట్లు ఉందని అనుకుంటుంది. ఇక హాసిని కూడా పిల్లలకు పోటీ పెడదామని అంటుంది. దీంతో విశాల్ నవ్వేంటి వదినా నయనికి సపోర్ట్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. దీంతో హాసిని తన సపోర్ట్ ఎప్పటికీ నయనికే ఉంటుంది అని చెప్తుంది. ఇక సుమన పాల గిన్నె పెట్టి పోటీకి రెడీ అవుతుంది. ఇక ఉలూచిని పిలుస్తుంది. ఇక విక్రాంత్ నయని పిలిస్తేనే పాప వస్తుంది అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Embed widget