అన్వేషించండి

Jagadhatri Serial Today August 14th: ‘జగధాత్రి’ సీరియల్‌: షష్టిపూర్తికి వస్తానన్న కౌషికి – ప్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని భయపడ్డ వైజయంతి

Jagadhatri Today Episode: తన అత్తింట్లో జరిగే షష్టిపూర్తికి కౌషికి వెళ్తానని చెప్పడంతో వైజయంతి తట్టుకోలేకపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: వైజయంతి కోపంగా ఆదిలక్ష్మీ, భాగ్యలక్ష్మీలను తిడుతుంది. అయితే రెండు రోజుల్లో అమ్మా నాన్నా షష్టి పూర్తి వదిన అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము. అనగానే కౌషికి ఏంటిది కొత్తగా బయటకు వెళ్లండి. మీరు ఇంట్లోంచి వెళ్లగొట్టినా నేను నా కూతురు బాగానే ఉన్నాము అంటూ తిడుతుంది కౌషికి. వైజయంతి కూడా మా కౌషికికి మీ అవసరం లేదని చెప్తుంది.

భాగ్యలక్ష్మీ: ఏంటి అన్నయ్యా అలా నిల్చున్నావు. ఒకసారి వదినతో మాట్లాడు. నాన్నను క్షమించమని చెప్పు.

సురేష్‌: ఆరోజు నాన్న నన్ను మాట్లాడనివ్వకుండా ఆపి. జీవితాంతం మూగవాణ్ని చేసేశాడు అమ్మా… మన వల్ల తప్పు జరిగింది భాగ్య. జీవితాంతం శిక్ష అనుభవించక తప్పదు.

నిషిక: అన్నయ్య, వదిన వద్దని వెళ్లిపోమ్మని చెప్పారు కదా? ఇంకా ఇక్కడే ఉన్నారేం వెళ్లండి.

ధాత్రి: నిషి పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పద్దతి తప్పి మాట్లాడకూడదు.

యువరాజ్‌: పద్దతా? వాళ్లు పద్దతిగా మా అక్కతో మాట్లాడారా? పద్దతితోనే మా అక్కతో ప్రవర్తించారా?

కేదార్‌: గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ఆ గతంలోనే ఉండిపోతాము యువరాజ్‌.

అని కేదార్‌ చెప్పగానే భాగ్య, కౌషికి దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుని అన్ని మర్చిపోయి కలిసుందామని బతిమాలుతుంది. దీంతో వైజయంతి భాగ్యను తిడుతుంది. ఇంతలో ధాత్రి అసలు ఏం జరిగింది వదిన అని అడుగుతుంది. అప్పుడు కౌషికి తన అత్తగారింట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది.

కేదార్‌: జరిగింది ఇదే అయితే బావ నువ్వు ఎందుకు విడిపోయారు అక్క. బావ చేయని తప్పుకు బావను ఎందుకు దూరం చేసుకున్నావు.

సురేష్‌: కౌషికి చేయి పట్టుకునే అర్హత నేను కోల్పోయాను కేదార్. కౌషికికి అవసరం ఉన్నప్పుడు నేను తన చేయి పట్టుకోలేకపోయాను. తనని మా నాన్న నుంచి కాపాడలేకపోయినందుకు.

  అని ఆరోజు తమ ఇంట్లో జరిగిన సంఘటన గురించి వివరిస్తాడు సురేష్‌. వాళ్ల నాన్న కౌషికిని ఇంట్లోంచి గెంటివేసిన రోజు నేను ఏం చేయలేకపోయానని చెప్తాడు.

యువరాజ్: కోపం వచ్చినప్పుడు రమ్మని.. ప్రేమ రాగానే రమ్మంటే రావడానికి మా అక్క ఏమైనా ఆటబొమ్మా? వాళ్లు చెప్పినట్లు చేయాలా?

కమలాకర్‌: ఆరోజు మీ ఆయన చేసిన పని ఇవాళ మేము చేయలేము. అందుకే మాటలతో చెప్తున్నాము వెళ్లిపోండి.

ధాత్రి: అందరూ చెప్తుంది కరెక్టే వదిన. న్యాయంగా అయితే మీరు వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ

బూచి: అమ్మో కానీ అంది అంటే ప్లేట్‌ పిరాయించింది.

ధాత్రి: పంతాలు వదిలితేనే కదా వదిన బంధుత్వాలు నిలిచేది.

కేదార్‌: ఒకరు చేసిన చిన్న తప్పు వల్ల ఇన్ని రోజులు మీరందరూ బాధపడింది చాలు. ఆ తప్పును దాటి వాళ్ల ప్రేమను చూడక్కా?

ధాత్రి: మీరు ఒప్పుకోరని తెలిసినా.. ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండదు. అవమానం ఎదురవుతుందని తెలిసినా.. షష్టి పూర్తికి పిలవడానికి వచ్చారు వదిన. మీరేం నిర్ణయం తీసుకున్నా మేమంతా మీ వెనకే ఉన్నాము.

సుధాకర్‌: అవునమ్మా.. ఆ మనిషి ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు కానీ సురేష్‌ తండ్రి. ప్రేమగా వెళ్లకపోయినా పర్వాలేదు. బాధ్యతగా వెళ్లు.

ఆదిలక్ష్మీ: తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి పడింది. తలరాత అని ఊరుకున్నాను. ఏనాడు కూడా నాకు ఒక్కతే కూతురు అనుకోలేదు. ఇద్దరు కూతుళ్లు అనుకున్నాను అమ్మా.. ఇదే నా ఆఖరి కోరిక అనుకునైనా మా షష్టి పూర్తికి రామ్మా?

 అని పిలవగానే వైజయంతి కోపంగా మా అమ్మీ రానని ఎన్నిసార్లు చెప్పాలి. అంటుంది. కౌషికి మాత్రం వస్తానని చెప్తుంది. దీంతో ఆదిలక్ష్మీ, భాగ్యలక్ష్మీ, సురేష్‌, ధాత్రి, కేదార్‌, సుధాకర్‌ హ్యాపీగా ఫీలవుతారు. మిగతావారందరూ షాక్‌ అవుతారు. ఆనందంలో ఆదిలక్ష్మీ అందరికి చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత వైజయంతి రూంలోకి వెళ్లి భయపడుతుంది.  ఆరోజు పాపను తానే బెడ్‌ మీద నుంచి కింద పడేలా చేసింది గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మాకు ఆడవాళ్లంటే గౌరవం ఉంది, నేను చెప్పిందే కరెక్ట్ అయ్యింది - నిహారిక కొణిదెల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Embed widget