Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఛైర్మన్ పదవి కోసం సరయు పోరాటం, లక్ష్మీతో ఛాలెంజ్.. అత్తాకోడళ్ల మధ్య ఇరుక్కుపోయిన వివేక్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ వల్లే కంపెనీ దివాలా స్థితికి వచ్చిందని కంపెనీలో పార్టనర్స్ అందరూ లక్ష్మీని మిత్ర ముందు నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ వల్లే దరిద్రం చుట్టుకుందని దేవయాని రెచ్చిపోతే జాను అత్త మీద తరిగబడుతుంది. తన అక్క దరిద్ర లక్ష్మీ కాదని అదృష్ట లక్ష్మీ అని మిత్రను గండాల నుంచి కాపాడుతుందని అంటుంది. ఇక మనీషా వివేక్ సైలెంట్గా ఉన్నాడు జాను ఎందుకు అంత మాట్లాడుతుందని అంటే ఎవరు మాట్లాడాలి అనుకుంటే వాళ్లు మాట్లాడుతారు మనీషా అని జాను అంటుంది. దాంతో లక్ష్మీ ఇక చాలు జాను అని ఆపేస్తుంది. ఇక మిత్ర అంతా తాను చూసుకుంటానని ఎవరు ఏం ఆలోచించొద్దని అంటాడు. నా స్థానం కోసం నేను చూసుకుంటానని అంటాడు. ఇక అందరూ వెళ్లిపోతారు. లక్ష్మీ గదిలోకి వెళ్లే సరయు లక్ష్మీకి ఫోన్ చేస్తుంది.
లక్ష్మీ: హలో ఎవరు.
సరయు: మిత్ర భార్య లక్ష్మీ కదా.
లక్ష్మీ: నా గురించి అడగలేదు నువ్వు ఎవరో చెప్పు.
సరయు: స.. ర.. యు.. నేనే నీ భర్త కానీ భర్త మిత్రకి కొత్త శత్రువుని.
లక్ష్మీ: నీకు శత్రువు అయ్యేంత అర్హత ఉందా. శత్రువు అంటే ఫేస్ టూ ఫేస్ ఎదుర్కొవాలి కానీ నువ్వేమో వెనకుండి అటాక్ చేస్తున్నావ్.
సరయు: అదా నీ ప్రాబ్లమ్ త్వరలోనే నేను నీకు మిత్రకు నా దర్శన భాగ్యం ఇస్తా. నేను మీ కంపెనీకి కాబోయే కొత్త ఛైర్మన్ని.
లక్ష్మీ: కలలు కంటున్నావా.
సరయు: ఇప్పటికే మీ హోల్డర్స్ అందరూ నా వైపు ఉన్నారు ఓటింగ్తో వెళ్లి ఛైర్మన్ అవుతా. నువ్వు నన్ను ఎలా గెలుస్తావ్ నీ భర్త కూడా నీ వైపు లేడు.
లక్ష్మీ: నాకు ఎదురు పడతావు కదా అప్పుడు చూద్దాం.
దేవయాని వివేక్ దగ్గరకు వెళ్లి ఏంట్రా ఆ జాను నోరేసుకొని పడిపోతుంది. పెళ్లి అయిన రెండు రోజులు బాగానే ఉంది ఇప్పుడు ఏంటి ఈ దేవయానికే ఎదురుతిరుగుతుంది. ఆ లక్ష్మీ ఎలా ఉంది ఇది ఎలా ఉంది అంటే పెద్దమ్మ మంచిది కదా అందుకే లక్ష్మీ వదిన మంచిగా ఉంటుంది. నువ్వు అలా కాదా అంటాడు. ఇక దేవయాని తిడిగే వివేక్ ఉండు దాని సంగతి చెప్తా నిన్నే అంట మాట అంటుందా అని దాని పని అయిపోతుందని వెళ్లి తలుపు వేసేస్తాడు. వీడి ఆవేశం చూస్తుంటే కొట్టేలా ఉన్నాడని అనుకొని తలుపు దగ్గర నిల్చొంటుంది వివేక్. ఇక జాను బట్టలు మడత పెడుతుంటే వివేక్ లోపల జానుని బతిమాలుతూ పైకి వినిపించేలా తిడతాడు. అది విని దేవయాని నా కొడుకు పులి అనుకుంటుంది. ఇక దేవయాని వెళ్లిపోగానే జానుని హగ్ చేసుకుంటాడు. జాను కూడా ఫైర్ అవుతుంది. అత్త అనే పెత్తనం ఆవిడ చూపిస్తే నేను కోడలు అనే పొగరు చూపిస్తాను అంటుంది. జాను మాటలకు వివేక్ షాక్ అయిపోయి,. వామ్మో జాను షడెన్గా మారింది నేను కాదు నువ్వు ఈ కొత్త వెర్షన్ ఏంటి అంటాడు. ఓరి దేవుడా ఈ అత్తాకోడళ్ల మధ్య నేను నలిగి పోయేలా ఉన్నానని అనుకుంటాడు.
ఇక సరయు షేర్ హోల్డర్స్ని కలుస్తుంది. ఇంతలో మిత్ర, లక్ష్మీ వివేక్ మనీషా అందరూ అక్కడికి వస్తారు. మిత్రకు సరయు షేక్ హ్యాండ్ ఇస్తే శత్రువులతో చేయి కలపడం మాకు ఇష్టం లేదు ఏదైనా ఉంటే కాన్ఫరెన్స్ హాల్లో చూసుకుందామని మనీషా అని అక్కడి నుంచి మిత్రని తీసుకెళ్లిపోతుంది. అందరూ మీటింగ్లో పాల్గొంటారు. ఇక అందరూ కొన్ని రోజులుగా కంపెనీ లాస్లో ఉంది మీరు పట్టించుకోవడం లేదని మీ వల్ల మేం కూడా నష్టపోతున్నామని మీరు ఆఫీస్కే రావడం లేదని హెల్డర్స్ చెప్తారు. దానికి సరయు వీళ్లంతా కలిసి నన్ను ఛైర్మన్ని చేయాలని అనుకుంటున్నారని అంటుంది. అందరూ లక్ష్మీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె మిత్రని డిస్ట్రబ్ చేయడం వల్లే ఆఫీస్కి మిత్ర రాకుండా అయిపోయిందని అంటారు. కంపెనీ ఛైర్మన్ ఎవరో అనే దాని మీద ఓటింగ్ పెడదామని సరయు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మీద ఎటాక్.. బిజినెస్లో ఓడించడానికి రంగంలోకి దిగిన సరయు!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















