అన్వేషించండి

Chiranjeevi: అభిమానుల వల్లే ఈ అవార్డు దక్కింది, పద్మవిభూషణ్ ప్రకటనపై మెగాస్టార్ ఎమోషనల్

Chiranjeevi: అభిమానుల సహకారంతో తనకు పద్మవిభూషణ్ అవార్డు దక్కిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Chiranjeevi About Fans: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం దక్కింది. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించగా.. అందులో తెలుగు వారైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. కళారంగం విభాగంలో చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. తనుకు అరుదైన పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కారణం తన అభిమానులేనని ఆయన అభిప్రాయపడ్డారు.

అభిమానుల వల్లే పద్మవిభూషణ్ అవార్డు- చిరంజీవి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించారంటే, దానికి కారణం తన అభిమానులేనని చెప్పారు. వారే లేకుంటే తనకు ఈ  పురస్కారం వచ్చి ఉండేది కాదన్నారు. “ఈ గణతంత్ర దినోత్సం నాకు ఎంతో ప్రత్యేకం. 45 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో కళామతల్లికి సేవ చేసుకోవడం సంతోషంగా ఉంది. అలాగే, నా బాధ్యతగా భావించి, ఎలాంటి విపత్తు జరిగినా, బాధితులకు అండగా నిలుస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. పాతిక సంవత్సరాల కిందట రక్తం కొరతతో ఎంతో మంది చనిపోయారు. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందులో మన బ్లడ్ బ్యాంక్ కూడా భాగం అయ్యింది. నా సేవలు గుర్తించి 2006లో పద్మభూషన్ అవార్డు ఇచ్చారు. అది ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. ఈ ఏడాది నా సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉంది. నా అభిమానుల వల్లే ఇది సాధ్యం అయ్యింది. వాళ్లందరికీ నేను రుణపడి ఉంటాను. మీ సమాజ సేవ అలాగే కొనసాగాలని కోరుకుంటాను. నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి నా ధన్యవాదాలు. పద్మ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అన్నారు.

గణతంత్ర వేడుకల్లో మెగా ఫ్యామిలీ

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లు కూడా బ్లడ్ బ్యాంక్‌లో సందడి చేశారు. చిరంజీవి వస్తున్నారని తెలిసి అక్కడికి అభిమానులు చాలా మంది వచ్చారు. అంతకు ముందు తనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం పట్ల ఎమోషనల్ అయ్యారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Also Read: మెగాస్టార్.. ఇకపై పద్మవిభూషణ్‌ చిరంజీవి - చిరుకు ప్రతిష్టాత్మక అవార్డు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget