Konidela Niharika: పరస్పర అంగీకారంతోనే విడిపోయాం, ప్రైవసీ కావాలి - విడాకులపై నిహారిక ఫస్ట్ రియాక్షన్
తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకుల తర్వాత నిహారిక తొలిసారి రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని చెప్పుకొచ్చింది.

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్నారు. 2020 డిసెంబర్ లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట, ఎక్కువ కాలం సంసార జీవితంలో కొనసాగలేదు. పెళ్లైన కొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు.
పరస్పర అంగీకారంతో విడాకులు- నిహారిక
విడాకులపై నిహారిక ఎలా స్పందిస్తుంది? విడాకులకు గల కారణాల గురించి చెపుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె సోషల్ మీడియాలో తొలి పోస్ట్ చేసింది. చైతన్య, తాను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. “చైతన్య నేను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, మిత్రులకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయం నుంచి బయట పడేందుకు నాకు ప్రస్తుతం కాస్త ప్రైవసీ కావాలి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. అటు చైతన్య కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వాస్తవానికి నిహారిక కొణిదెల ఎందుకు విడాకులు తీసుకున్నారు? సంసార జీవితంలో చిక్కులు ఎందుకు వచ్చాయి? కారణాలు ఏమిటి? అనేది బయటకు రాలేదు.
View this post on Instagram
View this post on Instagram
వాస్తవానికి నిహారిక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ తో ఆగస్టు 13, 2020లో ఆమె నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది డిసెంబర్ 9న ఏడు అడుగులు వేశారు. రాజస్థాన్, ఉదయ్పూర్ కోటలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి జె. ప్రభాకర్ రావు సన్నిహితులు. చాలా ఏళ్లుగా ఇరువురి కుటుంబాల మధ్య పరిచయం ఉంది. పిల్లలకు పెళ్లి చేస్తే స్నేహబంధం బంధుత్వంగా మారుతుందని ఆశించారు. పెళ్లి చేశారు. అయితే... పిల్లల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి విడాకులకు దారి తీశాయి. పరస్పర అంగీకారంతో నిహారిక, చైతన్య వేరు పడ్డారు.
నెల క్రితమే విడాకులు!
కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక, చైతన్య చేసిన దరఖాస్తు బయటకు రావడంతో మంగళవారం (జూలై 4) సాయంత్రం హడావిడి జరిగింది. అసలు విషయం ఏమిటంటే... నెల క్రితమే ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే... ఆలస్యంగా డివోర్స్ పిటిషన్ వెలుగులోకి రావడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. పెళ్లికి ముందు నిహారిక వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. చేసినవి తక్కువే అయినా గానీ నటిగా కెరీర్ కంటిన్యూ అవుతూ ఉండేది. చైతన్య నుంచి వేరు పడటంతో ఇప్పుడు ఆమె మళ్ళీ నటన, నిర్మాణం మీద దృష్టి పెట్టారు. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'లో ప్రధాన పాత్ర పోషించారు. నిర్మాతగా రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారని తెలిసింది.
Read Also: మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులు? ఆవిడ రష్యాకు తిరిగి వెళ్లిపోయారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















