అన్వేషించండి

Suriya: అభిమానులకు హీరో సూర్య ప్రత్యేక విందు - ఎందుకో తెలుసా?

Hero Suriya: హీరో సూర్య తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడన్నది తెలిసిన విషయమే. అయితే తాజాగా తను కొందరు అభిమానులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశాడు.

Hero Suriya Arranges Lunch To Fans: కొందరు హీరోలు మాత్రమే కాదు.. వారి అభిమానులు కూడా ఎప్పుడూ సాయం చేసే విషయంలో ముందుంటారు. అలాంటి వారిలో సూర్య అభిమానులు కూడా ఉంటారు. తన అభిమానులకు, ప్రజలకు ఏ కష్టం వచ్చిన ముందుండే హీరోలలో సూర్య, కార్తీ కూడా ఒకరు. వీరు అభిమానులకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ.. ఎప్పటికీ వారికి అందుబాటులోనే ఉంటారు. అదే విధంగా తాజాగా సూర్య.. తన అభిమానులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశాడు. దానికి వారంతా కలిసి చేసిన సాయమే కారణం. ఈ విందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముందుకొచ్చిన సూర్య అభిమానులు..

గతేడాది డిసెంబర్‌లో మిగ్‌జాం తుఫాను.. తమిళనాడును ముంచేసింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయిన చెన్నైలో మిగ్‌జాం తీవ్రత ఎక్కువగా కనిపించింది. అందుకే వరదల్లో చిక్కుకున్న వారికి  సాయం చేయడం కోసం సూర్య.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. అంతే కాకుండా తన ఫ్యాన్స్‌ను వెళ్లి.. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయమని కోరాడు. దీంతో ఎంతోమంది సూర్య అభిమానులు.. తమవంతు ఆర్థిక సాయం చేయడంతో పాటు వరదల్లో చిక్కుకున్న వారికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. వారికి కార్తీ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. ఇది చూసి సూర్య చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అందుకే ఇతరులకు సాయం చేసిన తన అభిమానులను విందుకు పిలిచాడు.

ఎప్పుడూ ముందుండే హీరో..

మిగ్‌జాం తుఫాను సమయంలో బాధిత కుటుంబాలకు సాయం చేసిన అభిమానులను సూర్య విందుకు పిలవడంతో పాటు వారికి స్వయంగా వడ్డించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి సూర్య మంచి మనసును మరోసారి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. తన ఫ్యాన్స్ ఎవరు కష్టాల్లో ఉన్నారని తనకు తెలిసినా తనవంతు సాయం చేయడానికి సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అలా ఎంతోమంది అమ్మాయిలను చదివించడం, వారికి ఆర్థికంగా సాయంగా నిలబడడం.. ఇవన్నీ సూర్య చేస్తూనే ఉంటాడు. తను సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తాడు.

‘కంగువా’తో బిజీ..

ఇక సూర్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తను శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంగువా’లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దిశా పటానీ తొలిసారి జోడీ కట్టింది. ముందుగా ఏప్రిల్‌లో ‘కంగువా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయ్యి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కంగువా’లో సూర్య డిఫరెంట్ లుక్‌తో కనిపించడంతో అసలు సినిమాలో ఇంకెన్ని షేడ్స్ ఉంటాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: సింగర్‌గా మారిన శ్రద్ధా దాస్ - మ్యూజిక్ డైరెక్టర్ వద్దన్నా వినలేదుగా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget