Reba Monica John: అనూ ఇమ్మాన్యుయేల్కు, రెబా జాన్ ఏమవుతుంది? ‘సామాజవరగమన‘ బ్యూటీ క్లారిటీ
‘సామజవరగమన‘ చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది తమిళ బ్యూటీ రెబా మోనికా జాన్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, ఇమ్మాన్యుయేల్ తో ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చింది.

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘బిగిల్‘ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది మలయాళీ బ్యూటీ రెబా మోనికా జాన్. తాజాగా మంచి హిట్ మూవీతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘సామజవరగమన‘తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రెబా లుక్స్, పెర్ఫార్మెన్స్ పట్ల అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె చేసిన తొలి తెలుగు సినిమా మంచి హిట్ సాధించడంతో టాలీవుడ్లో మరింత బిజీ అయ్యేలా కనిపిస్తోంది.
అనుతో నాకు ఎలాంటి సంబంధం లేదు- రెబా
ఇక తాజాగా ‘సామజవరగమన’ సినిమా ప్రమోషన్ లో భాగంగా రెబా, ఎంతో కాలంగా వినిపిస్తున్న ఓ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది. మలయాళ నటి అను ఇమ్మాన్యుయేల్ తనకు కజిన్ సిస్టర్ అవుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, అను ఇమ్మాన్యుయేల్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది రెబా. వికీపీడియా కూడా తమను చాలా కాలంగా కజిన్స్ గా చూపుతోందని స్పష్టం చేసింది. “నేను, అను ఇమ్మాన్యుయేల్ 2016 సంవత్సరంలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఒకే సమయంలో నటించాం. అప్పుడే మేమిద్దరం కజిన్ సిస్టర్స్ అని ఒక వ్యక్తి రూమర్ క్రియేట్ చేశాడు. అయితే, నాకు, అనుకు ఎక్కడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని రెబా తెలిపింది. రెబా జాన్కు సంబంధించిన వీకీపీడియాలో అనూ ఆమె కజిన్ అని ఉండటం వల్లే ఈ రూమర్ క్రియేట్ అయ్యింది.
2016లో మలయాళీ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ
ఇక 2016లో వచ్చిన ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది రెబా మోనికా. తమిళ్, మళయాల సినిమాల్లో ఎక్కువగా నటించింది. తాజాగా ‘సామజవరగమన’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు నటించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు.
‘సామజవరగమన’ ఓటీటీ పార్ట్ నర్ గా ‘ఆహా’
ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు వేయడం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ సినిమాకు కూడా విడుదలకు మూడు రోజుల ముందే ప్రీమియర్ షో లను వేశారు. తెలుగు మీడియా కోసం హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్ లో మూవీను స్క్రీనింగ్ చేశారు. అయితే, ఈ మూవీకు ఓటీటీ పార్ట్ నర్ గా ఆహా ను అఫీషియల్ గా ప్రకటించారట. దీంతో ఈ మూవీ ఆహా లోనే స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. ఆయన గతంలో నటించిన ‘అల్లూరి’ సినిమా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయ్యింది.
View this post on Instagram
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















