అన్వేషించండి

Salman Khan Firing Case : పాక్ నుంచి ఆయుధాలు, 70 మందితో నిఘా - సల్మాన్ హత్యకు మాస్టర్ ప్లాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సల్మాన్ ను హత్య చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తేలింది.

Salman Khan Firing Case: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  సల్మాన్ చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసు విచారణలో తేలింది. సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి బయటకు రాగానే కారుపై AK 47 తుపాకులతో దాడి చేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు ఏకంగా పాకిస్థాన్‌లోని ఓ ఆయుధ ముఠా నుంచి AK 47 తుపాకులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక AK 92 ఆయుధాలను సైతం సమకూర్చినట్లు వెల్లడించారు. సల్మాన్ కారులో వెళ్తుండగానే రౌండప్ చేసి కాల్పులు జరపాలని ప్లాన్ చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. ఒక వేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే, సల్మాన్ ఫామ్ హౌస్ లోకి దూరి కాల్పులు జరపాలని ప్లాన్ చేశారట. సల్మాన్ పై మైనర్లతో దాడి చేయించి, వారిని తమిళ నాడులోని కన్యాకుమారి నుంచి బోటులో శ్రీలంకకు పంపించాలనేది మరో ప్లాన్.

70 మందితో సల్మాన్ కదలికలపై నిఘా

తాజాగా ఈ కేసుకు సంబంధించి నేవీ ముంబైలోని పల్వెల్ పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీళ్లంతా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారేనని వెల్లడైంది. ఈ నలుగురిని విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరే సల్మాన్ ఖాన్ పై దాడికి ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ నలుగురిని ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌ గా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ కు చెందిన సుమారు  60 నుంచి 70 మంది వ్యక్తులు ముంబై, రాయగఢ్, నవీ ముంబై, థానే, పుణె, గుజరాత్ నుంచి వచ్చి సల్మాన్ ఖాన్‌పై నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 20 మంది సల్మాన్ ఫామ్‌ హౌస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లుగా ఆధారాలు  లభించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో పాటు ఆయన సోదరుడు అన్మోల్‌, గోల్డీబ్రార్‌ సహా 17 మందిపై కేసు ఫైల్ చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిపు చర్యలు చేపట్టారు.   

సల్మాన్ ను హత్య చేస్తామని గతంలోనే హెచ్చరించిన బిష్ణోయ్ గ్యాంగ్

నిజానికి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరిగే సమయం నుంచి సల్మాన్ కు వార్నింగ్స్ ఇస్తున్నాడు. బిష్ణోయ్ వర్గానికి చెందిన వాళ్లు కృష్ణ జింకలను దైవంగా భావిస్తారు. వాటిని చంపి తమ మనోభావాలను దెబ్బ తీసిన సల్మాన్ ను చంపేస్తామని బిష్ణోయ్ ఎప్పుడో చెప్పాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ నిర్దోషిగా బయటపడినా, బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం అతడిని వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తోంది. ఆయన హత్యకు ప్లాన్లు వేస్తూనే ఉంది.  

Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget