అన్వేషించండి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

బిందు మాధవి.. నటరాజ్ మాస్టార్‌‌కు చేసిన శపథం నెరవేర్చుకుంది. ప్రేక్షకుల మద్దతుతోనే పంతం నెగ్గించుకుని తాను ఆడపులి అని నిరూపించుకుంది.

బిందు మాధవి.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ఇప్పటివరకు ‘బిగ్ బాస్’లో పాల్గొన్న ఎంతోమంది లేడి కంటెస్టెంట్లు పాల్గొన్నా.. టైటిల్‌ను గెలుచుకోలేకపోయారు. ఇప్పటివరకు వచ్చిన ‘బిగ్ బాస్’ ఐదు సీజన్లలో హరితేజ, శ్రీముఖి, గీతామాధురీ టైటిల్ వరకు వచ్చి.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. అయితే, కొత్తగా మొదలైన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సీజన్‌లో మాత్రం అంచనాలన్నీ తారుమారు చేసింది బిందు మాధవి. ఈ కొత్త సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అఖిల్ సార్ధక్‌ను దాటుకుని బిందు విజేతగా నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం నటరాజ్ మాస్టరే. 

నటరాజ్ మాస్టర్‌ తనకు తాను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా భావిస్తారు. ఆయన మీద ఎవరైనా ఆరోపణలు చేసినా, ఆయన్ని వేలెత్తి చూపినా తట్టుకోలేరు. దీంతో చాలామంది కంటెస్టులు అతడితో పెట్టుకోవడం ఎందుకులే అని వెనకడుగు వేసేవారు. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో నటరాజ్ మాస్టర్‌ను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆయన ఏ క్షణంలో ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. దీంతో అతడిని నామినేట్ చేసే సహసం చేయలేకపోయేవారు. కానీ, బిందు మాధవి  మాత్రం అలా కాదు. తాను అనుకున్నది ముఖంపైనే చెప్పేది. మాటకుమాట సమాధానం ఇస్తూ.. నటరాజ్ ఇగోను రెచ్చగొట్టేది. దీంతో నటరాజ్ మాస్టర్ కూడా రెచ్చిపోయేవారు. ఆమెను ఎమోషనల్‌గా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ, బిందు ఆయన మాటలను సీరియస్‌గా తీసుకొనేది కాదు. ఆమె స్థానంలో మరొకరు ఉంటే తప్పకుండా ఏడ్చేస్తారు. 

Also Read: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి - విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్

కానీ, బిందు మాత్రం అలా చేయలేదు. ధైర్యాన్ని ప్రదర్శించింది. ఒకానోక క్షణంలో ఆయనతో శపథం కూడా చేసింది. తాను విన్నరై చూపిస్తానని చెప్పింది. బిందును శూర్పణక అని, ‘‘ప్రేక్షకులు నీ ముక్కు కోస్తారు’’ అంటూ.. నటరాజ్ కెమేరా వైపు తిరిగి బిందు ఇమేజ్‌ను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు బిందు మాటలతో సమాధానం ఇవ్వలేదు. తాను శూర్పణక కాదని, కాళీమాతనంటూ  మహిషాసుర మర్దినిలా నిలుచుని.. నటరాజ్‌కు తగిన జవాబు ఇచ్చింది. ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొంది. చివరికి, బిందు మాధవి నమ్మకం, ధైర్యమే గెలిచింది. ఈ నేపథ్యంలో అఖిల్ ఓడిపోయాడని చెప్పలేం. నటరాజ్ మాస్టార్‌కు తగిన సమాధానం చెప్పాలనే లక్ష్యంతో బిందు మాధవికి ఎక్కువ మంది ఓటేశారు. ఫలితంగా అఖిల్ విజయానికి గండిపడింది. బిందు విజయం తర్వాత.. ఆమె అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నటరాజ్ మాస్టార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి. 

Also Read: క్యాష్‌‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.