అన్వేషించండి

Telangana Elections 2023: తెలంగాణలో గత ఎన్నికల ముఖచిత్రం-2014-18లో గెలిచిన స్థానాలు-పార్టీల ఓటు శాతం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇది మూడో ఎన్నిక. మరి గత రెండు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది. ఏ పార్టీ ఓటు శాతం ఎంత?

తెలంగాణ మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 119 సీట్లకుగాను 63 స్థానాలు గెలుచుకొని కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... సీఎం కేసీఆర్‌ ముందస్తు  ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018లో ఎన్నికలు జరిగాయి. 2018 ఎన్నికల్లో మొదటిసారి కంటే 25 సీట్లు ఎక్కువగా గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది టీఆర్‌ఎస్‌. 88 సీట్లు  సాధించి గులాబీ జెండా ఎగురవేసింది. రాష్ట్రంలో విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిగా బీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేకపోయాయి. ఆ తర్వాత.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)  కాతా... భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారింది. పేరు మార్పు తర్వాత 2019లో ఎన్నికలు ఎదుర్కోబోతోంది.

2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 119 సీట్లకుగాను 63 సీట్ల గెలుచుకున్న టీఆర్‌ఎస్‌... 34.04 శాతం ఓట్లు సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ 21 స్థానాలకే పరిమితం కాగా... టీడీపీ  15, ఎంఐఎం 7, బీజేపీ 5, వైఎస్‌ఆర్‌సీపీ 3, బీఎస్పీ 2, సీపీఐ, సీపీఎం చొరక స్థానం, ఇండిపెండెంట్ల ఒకటి గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 25.02 శాతం ఓట్లు  రాగా... టీడీపీ 14.55శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. అలాగే బీజేపీకి 7.03 శాతం, ఎంఐఎంకు 3.74 శాతం, వైఎస్‌ఆర్‌సీపీ 3.36శాతం , బీఎస్పీ 1.35శాతం, సీపీఐ 0.89, సీపీఎం  1.55, ఇండిపెండెంట్లకు 5శాతం ఓట్లు వచ్చాయి.

ఇక, 2018 ఎన్నికల్లో 88 సీట్ల గెలిచి విజయదుంధుబి మోగించింది టీఆర్‌ఎస్‌. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 సీట్లు, ఎంఐఎం ఏడు, టీడీపీ రెండు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఒక  స్థానాన్ని గెలుచుకున్నాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఇక, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సీట్లే కాదు.. ఓట్ల శాతం మరింత పెరిగింది.  2014 కంటే 12శాతం ఎక్కువగా... 46.87 ఓటు శాతం దక్కించుకుంది టీఆర్‌ఎస్‌. ఇక, కాంగ్రెస్‌ 28.44, బీజేపీ ఏడు శాతం ఓట్లను సొంతం చేసుకున్నాయి. ఎంఐఎంకు 2.71  శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ 3.51, ఇండిపెండెంట్లు 3.26 ఓట్లు దక్కించుకోగా... సీపీ 0.4, సీపీఎం 0.44, బీఎస్పీకి 2.07 శాతం ఓట్లు వచ్చాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు గాను 11 గెలుచుకుని 34.67 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. అయితే.. 2019లో ఎంపీ స్థానాలు తగ్గాయి.. కానీ ఓట్ల శాతం పెరిగింది.  2019లో 9 ఎంపీ స్థానాలను గెలుచుకుని 41.30 శాతం ఓట్లు దక్కించుకుంది టీఆర్‌ఎస్‌. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే 2019లో 2 సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతం మాత్రం 8శాతం  వరకు పెరిగింది. 

గత రెండు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 2014లో నాలుగో స్థానంలో ఉన్న ఎంఐఎం... 2018లో మూడో స్థానానికి చేరింది. టీడీపీ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక బీజేపీ.. 2014లో ఐదో స్థానంలో ఉంది.. కానీ 2018లో ఆరో స్థానానికి పడింది. ఈమధ్య తెలంగాణలో బీజేపీ రెండో స్థానంలోకి వచ్చేసింది అనుకునేలోపే... కమలం పార్టీ గ్రాఫ్‌ పడిపోయిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పార్టీ ఉన్నా... 2023 ఎన్నికల్లో తెలంగాణ ముఖచిత్రం ఎలా మారబోతుందో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget