అన్వేషించండి

Bihar Election 2025: బిహార్‌ ఎన్నికల ప్రక్రియలో భారీ సంస్కరణలు- 10 రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు!

Bihar Election 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలకు సంబంధించి విలేకరుల సమావేశంలో, ఎన్నికల ప్రక్రియలో చేసిన ముఖ్యమైన మార్పుల గురించి ఎన్నికల సంఘం ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుందని, నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. బిహార్ ఎన్నికలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, "బిహార్ ఓటర్లకు ఎన్నికలు ఆదర్శప్రాయంగా, సజావుగా జరగడమే కాకుండా, శాంతియుతంగా కూడా ఉంటాయని, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం" అని అన్నారు. ఓటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరచడానికి ఎన్నికల సంఘం అనేక మార్పులు చేసింది.

1,200 మంది ఓటర్లు పోలింగ్ బూత్‌లో ఓటు వేయగలరు.

గతంలో 1,500 మందికి బదులుగా ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 1,200 మంది ఓటర్లు ఓటు వేయగలరు. బిహార్‌లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచుతున్నారు. ఎన్నికల సంఘం మొత్తం 90,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల భద్రత, సజావుగా నిర్వహణ కోసం కేంద్ర సాయుధ పోలీసు దళాల అదనంగా మోహరిస్తోంది.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద ఓటర్ల జాబితా స్క్రూట్నీ చేసిన తర్వాత జరిగే మొదటి ఎన్నికలు 2025 అసెంబ్లీ ఎన్నికలు. దీని ఫలితంగా 1.4 మిలియన్ల మంది మొదటిసారి ఓటర్లతో సహా 7.43 కోట్ల మంది ఓటర్లతో తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. 22 ఏళ్ల విరామం తర్వాత నిర్వహించిన SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను జ్ఞానేష్ కుమార్ పంచుకున్నారు. తుది ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి 10 రోజుల ముందు వరకు ఓటరు జాబితాలో దిద్దుబాట్లు అభ్యర్థించే గడువు ఉంటుందని అన్నారు. ఫేక్‌ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, నకిలీ వార్తలు నిరోధించడానికి ఎన్నికల కమిషన్ ప్రణాళికలను ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరించారు. 243 నియోజకవర్గాల్లో ప్రతిదానికీ ప్రత్యేక పరిశీలకుడు ఉంటారని ఆయన ప్రకటించారు.

అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఎన్నికల తేదీలు ప్రకటించినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో ఎన్నికల సన్నాహాలను సమీక్షించి, అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, ఏర్పాట్లను అంచనా వేసిన ఒక రోజు తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన వెలువడింది. నివేదికల ప్రకారం, అక్టోబర్ 18, 28 మధ్య వచ్చే దీపావళి, ఛత్ వంటి పండుగలపై ప్రభావం పడకుండా షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఈ ఆలోచన సజావుగా ఓటింగ్ జరగడం, ఎక్కువ మంది ఓట్లు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది.  

దేశానికి ఉదాహరణగా నిలిచే బిహార్ ఎన్నికలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు భవిష్యత్తులో అన్ని ఎన్నికలకు ఒక ఉదాహరణగా నిలుస్తాయని ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. వృద్ధులు, వికలాంగులైన ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాయని పేర్కొన్నారు. హింస పట్ల జీరో టాలరెన్స్ విధానం ఉంటుంది. ఈవీఎం లెక్కింపు చివరి రెండు రౌండ్లకు ముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తప్పనిసరి అని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం, బిహార్ ఎన్నికల్లో 1.4 మిలియన్ల మంది మొదటిసారి ఓటర్లు అవుతారు.

తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సన్నాహాలు 

ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి ఏదైనా నకిలీ వార్తలు వెలువడితే, తిప్పికొట్టనున్నారు. మాదకద్రవ్యాలు, నగదు లేదా ఇతర నిషేధిత వస్తువులపై కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది. దేశవ్యాప్తంగా భవిష్యత్ ఎన్నికలలో అమలు చేయబడే 17 కొత్త కార్యక్రమాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మొదటిసారిగా బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ ఇచ్చామని అన్నారు. గతంలో వారి శిక్షణ జిల్లా లేదా అసెంబ్లీ స్థాయిలో నిర్వహించేవాళ్లు. ఈసారి, ఈ వ్యక్తులను ఎన్నికల కమిషన్ శిక్షణా సంస్థకు పిలిపించి శిక్షణ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

ఓటరు జాబితాపై చర్చ

బిహార్‌లో ఓటరు జాబితా దాదాపు 22 సంవత్సరాల తర్వాత సవరించామని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో దీని గురించి అతిగా ప్రచారం జరుగుతోందని కానీ నిజం ఏమిటంటే ఇది సురక్షితంగా, అందరి సహకారంతో ఇది జరిగిందన్నారు. జాబితాలోని తప్పులను రాజకీయ పార్టీలు, అధికారుల సహకారంతో పారదర్శకంగా సరిదిద్దామని వివరించారు. కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను ఎలా జారీ చేయాలో అన్ని ఏజెన్సీలతో ఒక SOPని రూపొందించారు.

ఫోన్‌లను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లొచ్చా?

దేశ పురోగతిని దృష్టిలో ఉంచుకుని, వారు తమ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్ గది వెలుపల డిపాజిట్ చేయవచ్చని ఆయన అన్నారు. ఓటు వేసిన తర్వాత వారు తమ ఫోన్‌లను తిరిగి తీసుకెళ్లవచ్చు. బిహార్ ఎన్నికల సమయంలో "మదర్ ఆఫ్ ఆల్ యాప్స్" కూడా ప్రారంభిస్తామన్నారు. ఇది 40 ఎన్నికల కమిషన్ యాప్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానిస్తుంది.  

ఓటర్ల సంఖ్య సుమారు 74.2 మిలియన్లు.

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో 38 షెడ్యూల్డ్ కులాలకు 2షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారని ప్రధాన ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 74.2 మిలియన్లు, ఇందులో 39.2 మిలియన్ పురుషులు 35 మిలియన్ల మహిళలు ఉన్నారు. దాదాపు 400,000 మంది సీనియర్ సిటిజన్లు, దాదాపు 14,000 మంది ఓటర్లు 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Hero Scooty Models: హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Sai Durgha Tej New Movie : 'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
Embed widget