అన్వేషించండి

PG Admissions: పీజీ మెడికల్ ప్రవేశాలకు గడువు ముగుస్తున్నా, పూర్తికాని కౌన్సెలింగ్

ఏపీలో పీజీ మెడికల్ ప్రవేశాల ప్రక్రియ ఎన్నడూలేని విధంగా గందరగోళంగా తయారైంది. నిర్ణీతవ్యవధిలో పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలు పూర్తిచేయలేక వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీ చేతులెత్తేసింది.

ఏపీలో పీజీ మెడికల్ ప్రవేశాల ప్రక్రియ ఎన్నడూలేని విధంగా గందరగోళంగా తయారైంది. నిర్ణీతవ్యవధిలో పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలు పూర్తిచేయలేక వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీ చేతులెత్తేసింది. ఓ రిజర్వేషన్‌ అభ్యర్థికి ప్రైవేటు వైద్య కళాశాలలో కేటాయించిన సీటును రద్దుచేసి, ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థితో భర్తీచేయడం, మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు నకిలీ ఎల్‌ఓపీల ద్వారా సీట్ల మంజూరు, వీటి రద్దువల్ల రెండుసార్లు కౌన్సెలింగ్‌ రద్దుచేయడం.. ఇలా అన్ని విషయాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీటిని పరిష్కరించి, రెండోవిడత కౌన్సెలింగ్‌ చేసే సమయానికి ఇన్‌-సర్వీస్‌ అభ్యర్థుల ప్రవేశాల విషయంలో మరో సవాలు ఎదురైంది. 

మరోవైపు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సర్వీసు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలను అర్థం చేసుకుని, చర్యలు తీసుకోవడంలో విశ్వవిద్యాలయం విఫలమైంది. దీనివల్ల నాన్‌-సర్వీస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకున్నా, ఇప్పటివరకు సీట్లు కేటాయించలేదు. కన్వీనర్‌ కోటాలో 616 సీట్లు భర్తీచేయాలి. ఇది సజావుగా జరిగితే, తర్వాత యాజమాన్య కోటాలో సీట్లు భర్తీచేస్తారు.

కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లను మాప్‌ అప్‌, స్ట్రే వెకెన్సీ విధానంలో భర్తీచేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుంది. నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం... అక్టోబ‌రు 20 నాటికి పీజీ మెడికల్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్నా.. రాష్ట్రంలో మాత్రం కన్వీనర్‌ కోటాలో రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రాథమిక దశను దాటలేకపోయింది. 

దేశంలోని దాదాపు మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాల ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. ప్రణాళిక ప్రకారం కౌన్సెలింగ్‌ జరగకుంటే విద్యార్థులు నష్టపోతారు. రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో తుదివిడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి వారంరోజులు గడిచినప్పటికీ.. ఇప్పటివరకు సీట్లు కేటాయించలేకపోయింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రవేశాల గడువును మరో రెండు వారాలు పొడిగించాలని ఎన్‌ఎంసీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ కోరింది. ఈ అభ్యర్థనకు ఎన్‌ఎంసీ నుంచి సమాధానం రావాల్సి ఉంది.

ALSO READ:

డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో యూజీ ఆయుష్ ప్రవేశాలు, ముఖ్యమైన తేదీలు ఇలా
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో కాంపీటేటివ్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ (బీఏఎంస్, బీహెచ్‌ఎంస్, బీయూఎంస్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతోపాటు నీట్ యూజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ యూజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్‌ సాయం పెంపు - ఎప్పటినుంచి వర్తిస్తుందంటే?
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget