అన్వేషించండి

TS SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు (జూన్ 30) ఉదయం 11.30 గంటలకు పది పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం telugu.abplive.com లేదా bse.telangana.gov.in  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

ఈ ఏడాది 5,03,579 విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 4,53,201 మంది పాసైనట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఇందులో అబ్బాయిలు 2,55,433 మంది హాజరు కాగా.. 2,23,779 పాసయ్యారని వివరించారు. అమ్మాయిల్లో 2,48,146 మంది పరీక్షలు రాయగా, 2,29,422 మంది పాసైనట్లుగా వెల్లడించారు. 

పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో అబ్బాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. మొత్తం కలిపి  90శాతం మంది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు. 

జూన్‌ మొదటి వారంలో ముగిసిన పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూశారు. మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో 2021-22 సంవత్సరానికి చెందిన పరీక్షలు ముగిశాయి. మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్‌ 1 న చివరి పరీక్ష జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్‌ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభించారు. 

కరోనా కారణంగా చాలా మార్పులు 
గతేడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అందుకే రెండేళ్లు నేరుగా విద్యార్థులను తర్వాత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు.

ముందు చెప్పినట్టుగానే 
ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసి నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నట్టు మొదట్లోనే అధికారులు ప్రకటించారు. దాని ప్రకారమే ఇవాళ ఫలితాలు విడుదల చేశారు. 

తెలంగాణ SSC రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ఫలితాలు ఎలా చూడాలి
ఏబీపీ దేశం వెబ్‌సైట్‌ telugu.abplive.comలోకి లేదా bse.telangana.gov.inవెళ్లాలి.
టాప్‌లో TS SSC Results 2022 కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి. లేదా ప్రభుత్వం సూచించిన ఏదైనా వెబ్‌సైట్‌నైనా క్లిక్ చేయాలి. 
అలా క్లిక్‌ చేసిన వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ రిజిస్టర్ నెంబర్ అడుగుతుంది. అందులో మీ పరీక్ష రిజిస్టర్ నెంబర్ టైప్ చేయాలి. 
తర్వాత రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి. 
వెంటనే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
అందులో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫలితాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. 
తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని మీ వద్దే ఉంచండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Telangana New CS:తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!
Alekhya Chitti Pickles: మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs DC Match Highlights IPL 2025 | చెన్నైపై 25 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamMS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Telangana New CS:తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!
Alekhya Chitti Pickles: మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Pak Vs Nz Flood Lights Failure: మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ప‌వ‌ర్ క‌ట్.. చిమ్మ చీక‌ట్లో స్టేడియం.. బిత్త‌ర పోయిన ఆట‌గాళ్లు, ప్రేక్ష‌కులు
మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ప‌వ‌ర్ క‌ట్.. చిమ్మ చీక‌ట్లో స్టేడియం.. బిత్త‌ర పోయిన ఆట‌గాళ్లు, ప్రేక్ష‌కులు
Adilabad Sri Rama Navami 2025: సీతారాముల కళ్యాణోత్సవానికి 151 ఎడ్లబండ్ల పాలపొరకతో పందిరి ఎక్కడంటే.!
సీతారాముల కళ్యాణోత్సవానికి 151 ఎడ్లబండ్ల పాలపొరకతో పందిరి ఎక్కడంటే.!
Viral News: ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు  - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
ఉద్యోగుల్ని కుక్కలుగా చూశారు - టార్గెట్లు సాధించలేదని ఇలా చేస్తారా? కేరళ కంపెనీ ఘోరాల వీడియో
Embed widget