News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు - వివిధ ప్రాంతాల్లో 10 మందికి పైగా మృతి

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నేడు (ఫిబ్రవరి 10) పది మందికి పైగా చనిపోయారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. తొమ్మిది మందిని బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌ శివారులో జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోతే, విశాఖలో మరో నలుగురు యువకుల ప్రాణాలను ఓ ట్రాలీ బలి తీసుకుంది.  

హైదరాబాద్‌లో శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారి కారును ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. వాళ్లు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో ఆ ఫ్యామీల్లో విషాదం అలుముకుంది. 

విశాఖలో వెంకోజీ పాలెం వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యువకులు వెళ్తున్న వాహనాన్ని ట్రాలీ డీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు.

నెల్లూరు జిల్లాలో ఆసుపత్రికి వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. ఆటోను ఓల్వో బస్సు ఢీ కొట్టడంతో పలువురు గాయపడగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వాళ్లిద్దరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు. డయాలసిస్‌ కోసం ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దిగువన శివాలయం ఘాట్‌ వద్ద స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం నల్గొండకు చెందిన నాగరాజు, హర్షిత్ సాగర్ కి చెందిన చంద్రకాంత్ పైలాన్ కాలనీలో ఉపనయనం కార్యక్రమానికి హాజరై శివాలయం ఘాట్ వద్ద ఈత కోసం నదిలో దిగారు. అదే టైంలో అధికారులు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహానికి ముగ్గురు యువకులు కొట్టుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో 3 గంటల పాటు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి స్థానిక హాస్పిటల్ కి తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

నిజామాబాద్ జిల్లాలో ఒకరు
ఆర్మూర్ పట్టణ శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారులో గల రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొని మిర్జాపల్లి వాసి గడ్కొల్ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నారాయణ 20 రోజుల క్రితమే బెహరాన్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఆర్మూర్‌కు వచ్చి తిరిగి ఇంటికి బైక్ పై వెళుతుండగా అతివేగంతో వెళ్లి డివైడర్ మధ్యలో గల చెట్టును ఢీకొని అక్కడికక్కడే నారాయణ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఎస్సై రాము సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకుల గల్లంతు

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దిగువన శివాలయం ఘాట్‌ వద్ద స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకి చెందిన నాగరాజు, హర్షిత్ సాగర్ కి చెందిన చంద్రకాంత్ లు పైలాన్ కాలనీ లో ఉపనయనం కార్యక్రమానికి హాజరై శివాలయం ఘాట్ వద్ద ఈత కోసం నదిలోకి దిగారు. మరో వైపు అధికారులు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20.000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహానికి ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో 3 గంటల పాటు గాలింపు చేపట్టి ముగ్గురి యువకుల మృత దేహాలను బయటకి తీసి స్థానిక కమల నెహ్రూ హాస్పిటల్ కి మృత దేహాలను పొలీసులు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ పి.వెంకటగిరి సందర్శించారు.

Published at : 10 Feb 2023 10:30 AM (IST) Tags: Visakhapatnam Nalgonda Road Accidents Road accidents in Hyderabad Hyderabad accidents

ఇవి కూడా చూడండి

Tamilnadu Bus Accident : ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 9 మంది దుర్మరణం

Tamilnadu Bus Accident : ఘోర ప్రమాదం, లోయలో పడిన బస్సు, 9 మంది దుర్మరణం

Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్

Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్

Nalgonda News: మర్రిగూడ ఎమ్మార్వో అక్రమాస్తులు రూ.4.75 కోట్లు, అవినీతి అధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Nalgonda News: మర్రిగూడ ఎమ్మార్వో అక్రమాస్తులు రూ.4.75 కోట్లు, అవినీతి అధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు

భార్యపై అనుమానంతో దారుణం, చేతి వేళ్లు జుట్టు కత్తిరించి తల నరికేసి హత్య

భార్యపై అనుమానంతో దారుణం, చేతి వేళ్లు జుట్టు కత్తిరించి తల నరికేసి హత్య

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్