search
×

Stock Market Opening: మంట పెట్టిన యూఎస్‌ ఫెడ్‌! స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల హోరు!

Stock Market Opening Bell 02 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening Bell 02 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్స్‌ పాజిటివ్‌గా ట్రేడవుతున్నా యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌ పర్సన్‌ చేసిన వ్యాఖ్యలతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 53 పాయింట్ల నష్టంతో 17,488 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 163 పాయింట్ల నష్టంతో 58,602 వద్ద ఉన్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 58,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,969 వద్ద నష్టాల్లో మొదలైంది. 58,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 163 పాయింట్ల నష్టంతో 58,602 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

గురువారం 17,542 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,598 వద్ద ఓపెనైంది. 17,485 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 53 పాయింట్ల నష్టంతో 17,488 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 39,422 వద్ద మొదలైంది. 39,200 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,595 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 56 పాయింట్ల నష్టంతో 39,244 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్‌, మారుతీ, ఐచర్‌ మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. శ్రీసెమ్‌, హిందాల్కో, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్కువగా ఎరుపెక్కాయి. ఆటో, మీడియా షేర్లకు గిరాకీ ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSEIndia (@bseindia)

Published at : 02 Sep 2022 10:18 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

టాప్ స్టోరీస్

Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా

Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా

Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!

Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!

Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క

Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క

Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!

Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!