అన్వేషించండి

UPI PayNow: ఇకపై సింగపూర్‌కు డబ్బులు పంపడం &స్వీకరించడం చిటికెలో పని, UPI-PayNow వచ్చేసింది

సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

UPI PayNow integration: భారతదేశ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ మరో మైలురాయిని దాటింది. ఇప్పటికే దేశ సరిహద్దులు దాటిన UPI (Unified Payments Interface), ఇప్పుడు సింగపూర్‌ని కూడా చేరింది. భారత్‌-సింగపూర్ మధ్య డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు మరింత సులభంగా మారాయి. సింగపూర్‌లో పని చేస్తున్న భారతీయులు, ఇకపై నేరుగా భారత్‌లోని బంధుమిత్రులకు డబ్బులు పంపవచ్చు.

ఇరు ప్రధానుల సమక్షంలో UPI-PayNow ఒప్పందం
డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి, భారత్‌- సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశ UPIని, సింగపూర్‌ 'పేనౌ'ని ‍(PayNow) ఈ ఒప్పందం ద్వారా కనెక్ట్ చేశారు. ఇవాళ (మంగళవారం, 21 ఫిబ్రవరి 2023) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒప్పందంతో, రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ పేమెంట్‌ కనెక్టివిటీ ప్రారంభమైంది. 

భారతదేశం తరపున ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), సింగపూర్ తరపున 'మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్' మేనేజింగ్ డైరెక్టర్ రవి మేనన్ కలిసి, భారత్‌ - సింగపూర్ మధ్య రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ ‍‌(real-time retail payment system) లింకేజ్‌ ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజలకు ఏంటి ప్రయోజనం?
ఈ ఒప్పందం ఫలితంగా, నేటి నుంచి, UPI PayNowను ఉపయోగించి భారత్‌లో ఉన్నవాళ్లు సింగపూర్‌లో ఉన్నవాళ్లకు, సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు పంపడానికి దీని ద్వారా అవకాశం వచ్చింది. 

ముఖ్యంగా, భారత్‌ నుంచి సింగపూర్‌ వెళ్లి వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేస్తున్న వాళ్లకు, విద్యార్థులకు ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. డబ్బులు పంపాలన్నా, స్వీకరించాలన్నా ఇకపై ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. భారత్‌లో UPI ద్వారా ఎలా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపడం & స్వీకరించడం చేస్తున్నామో, అదే విధంగా UPI PayNowని ఉపయోగించుకోవచ్చు. అంటే... సింగపూర్‌కు డబ్బులు పంపడం, అక్కడి నుంచి స్వీకరించడం ఇకపై చిటికెలో పని.

ఈ సందర్భం ఇరు దేశాలకు ఎంతో అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని అన్నారు. యూపీఐ-పే నౌ లింక్‌ను ప్రారంభించడం ఇరు దేశాల పౌరులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బహుమతిగా ప్రధాని అభివర్ణించారు. భారత్‌, సింగపూర్‌లోని ప్రజలు తమ తమ దేశాల్లో మొబైల్‌ ఫోన్ల నుంచి నగదును బదిలీ చేసుకున్నట్లుగానే, నేటి నుంచి ఈ రెండు దేశాల మధ్య కూడా పంపుకోవచ్చని చెప్పారు. 

RBI రెమిటెన్స్ సర్వే - 2021 ప్రకారం... 2020-21లో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మొత్తం నగదులో సింగపూర్‌ది వాటా 5.7 శాతం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget