అన్వేషించండి

UPI PayNow: ఇకపై సింగపూర్‌కు డబ్బులు పంపడం &స్వీకరించడం చిటికెలో పని, UPI-PayNow వచ్చేసింది

సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

UPI PayNow integration: భారతదేశ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ మరో మైలురాయిని దాటింది. ఇప్పటికే దేశ సరిహద్దులు దాటిన UPI (Unified Payments Interface), ఇప్పుడు సింగపూర్‌ని కూడా చేరింది. భారత్‌-సింగపూర్ మధ్య డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు మరింత సులభంగా మారాయి. సింగపూర్‌లో పని చేస్తున్న భారతీయులు, ఇకపై నేరుగా భారత్‌లోని బంధుమిత్రులకు డబ్బులు పంపవచ్చు.

ఇరు ప్రధానుల సమక్షంలో UPI-PayNow ఒప్పందం
డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి, భారత్‌- సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశ UPIని, సింగపూర్‌ 'పేనౌ'ని ‍(PayNow) ఈ ఒప్పందం ద్వారా కనెక్ట్ చేశారు. ఇవాళ (మంగళవారం, 21 ఫిబ్రవరి 2023) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒప్పందంతో, రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ పేమెంట్‌ కనెక్టివిటీ ప్రారంభమైంది. 

భారతదేశం తరపున ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), సింగపూర్ తరపున 'మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్' మేనేజింగ్ డైరెక్టర్ రవి మేనన్ కలిసి, భారత్‌ - సింగపూర్ మధ్య రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ ‍‌(real-time retail payment system) లింకేజ్‌ ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజలకు ఏంటి ప్రయోజనం?
ఈ ఒప్పందం ఫలితంగా, నేటి నుంచి, UPI PayNowను ఉపయోగించి భారత్‌లో ఉన్నవాళ్లు సింగపూర్‌లో ఉన్నవాళ్లకు, సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు పంపడానికి దీని ద్వారా అవకాశం వచ్చింది. 

ముఖ్యంగా, భారత్‌ నుంచి సింగపూర్‌ వెళ్లి వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేస్తున్న వాళ్లకు, విద్యార్థులకు ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. డబ్బులు పంపాలన్నా, స్వీకరించాలన్నా ఇకపై ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. భారత్‌లో UPI ద్వారా ఎలా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపడం & స్వీకరించడం చేస్తున్నామో, అదే విధంగా UPI PayNowని ఉపయోగించుకోవచ్చు. అంటే... సింగపూర్‌కు డబ్బులు పంపడం, అక్కడి నుంచి స్వీకరించడం ఇకపై చిటికెలో పని.

ఈ సందర్భం ఇరు దేశాలకు ఎంతో అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని అన్నారు. యూపీఐ-పే నౌ లింక్‌ను ప్రారంభించడం ఇరు దేశాల పౌరులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బహుమతిగా ప్రధాని అభివర్ణించారు. భారత్‌, సింగపూర్‌లోని ప్రజలు తమ తమ దేశాల్లో మొబైల్‌ ఫోన్ల నుంచి నగదును బదిలీ చేసుకున్నట్లుగానే, నేటి నుంచి ఈ రెండు దేశాల మధ్య కూడా పంపుకోవచ్చని చెప్పారు. 

RBI రెమిటెన్స్ సర్వే - 2021 ప్రకారం... 2020-21లో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మొత్తం నగదులో సింగపూర్‌ది వాటా 5.7 శాతం.

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget