అన్వేషించండి

IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన

రూ.504 కోట్ల ప్రభుత్వ ధనం కొల్లగొట్టిన కేసులో నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను తుడిచిపెట్టడం, అవినీతి నిరోధక చట్టం 1988 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు సీబీఐ (CBI) తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హర్యానా ప్రభుత్వ రూ. 504 కోట్ల నిధుల దుర్వినియోగంపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు.
  • బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, నకిలీ కంపెనీల భాగస్వాములు నిందితులుగా ఉన్నారు.
  • నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి.
  • ప్రభుత్వ శాఖల నిధులను నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించినట్లు సీబీఐ పేర్కొంది.

CBI Submit Chargesheet IDFC Fraud Case: చండీగఢ్: హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 504 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల కేసులో సీబీఐ (CBI) పంచకులలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిధుల దుర్వినియోగంలో బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యలు భాగస్వాములుగా ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో హర్యానా ప్రభుత్వ ఉద్యోగులు, షెల్ కంపెనీలు, సామాన్యులు ఉన్నారని సీబీఐ తమ ఛార్జిషీటులో పేర్కొంది. నిందితులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మకద్రోహం, చీటింగ్, సంతకాలు ఫోర్జరీ, సాక్ష్యాలను తారుమారు చేయడం, అవినీతి నిరోధక చట్టం 1988 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సీబీఐ తెలిపింది. 

 ఛార్జ్‌షీట్ ఎవరిపై దాఖలైంది?
ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు అయిన వారిలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) లకు చెందిన ఆరుగురు బ్యాంక్ అధికారులు, హర్యానా పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వికాస్ అండ్ పంచాయతీ డిపార్ట్‌మెంట్, హర్యానా స్కూల్ శిక్షా పరియోజన పరిషత్‌లకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ ఛార్జ్‌షీట్‌లో రెండు నకిలీ కంపెనీలు, వాటికి చెందిన ముగ్గురు భాగస్వాములు లేక డైరెక్టర్లు, ఒక సామాన్యుడి పేరును కూడా చేర్చింది.

Also Read: RBI Loan Recovery Guidelines 2026: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో

జుడీషియల్ కస్టడీలో నిందితులు
మరోవైపు, నిందితులందరూ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సిబిఐ ఆ ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు చేస్తున్న అధికారుల ప్రకారం, ఈ కేసు హర్యానా ప్రభుత్వానికి చెందిన పలు శాఖల బ్యాంక్ ఖాతాల నుండి రూ. 504 కోట్ల నిధులను కొల్లగొట్టారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో బ్యాంక్ అధికారులు నేరపూరిత కుట్ర ద్వారా ఈ నిధులను వేరే చోట్లకు మళ్లించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. హర్యానా రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేయడంతో ఈ కేసు మొదలైంది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న విచారణ పూర్తయిందని సిబిఐ తెలిపింది. అలాగే ఇతర నిందితులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. 

నేరం ఎలా జరిగింది? 
హర్యాణ ప్రభుత్వ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులతో చేతులు కలిపారు. ప్రభుత్వ విభాగాల అధికారిక బ్యాంక్ ఖాతాల్లో ఉండాల్సిన రూ. 504 కోట్ల నిధులను, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారుల సహాయంతో నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ నిధులను విత్‌డ్రా చేయడానికి లేదా వైట్ మనీగా మార్చడానికి కొన్ని షెల్ (నకిలీ) కంపెనీలను ఉపయోగించారు.

Also Read: Post Office FD:రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?

Frequently Asked Questions

హర్యానా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సీబీఐ ఏం చేసింది?

హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 504 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే కేసులో సీబీఐ పంచకులలోని ప్రత్యేక కోర్టులో తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో 15 మంది నిందితులు ఉన్నారు.

ఈ నిధుల దుర్వినియోగంలో ఎవరు భాగస్వాములుగా ఉన్నారు?

ఈ కేసులో బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, రెండు నకిలీ కంపెనీలు, వాటి భాగస్వాములు, ఒక సామాన్యుడు భాగస్వాములుగా ఉన్నారు. వీరందరినీ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

నిందితులపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి?

నిందితులపై నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, చీటింగ్, సంతకాలు ఫోర్జరీ, సాక్ష్యాలను తారుమారు చేయడం, అవినీతి నిరోధక చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నేరం ఎలా జరిగింది?

ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులు చేతులు కలిపి, ప్రభుత్వ ఖాతాల్లో ఉండాల్సిన నిధులను నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ నిధులను వైట్ మనీగా మార్చడానికి నకిలీ కంపెనీలను ఉపయోగించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget