అన్వేషించండి

BSNL 5G Services: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ఇప్పట్లో లేనట్లే, మరో ఏడాది ఆగమంటున్న కేంద్ర మంత్రి

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు వంద 4G టవర్లను సైతం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

BSNL 5G Services: భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్న మూడు ప్రైవేట్‌ కంపెనీల్లో రెండు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌) ఇప్పటికే దేశంలోని ముఖ్య నగరాల్లో 5G సేవలను (5G services) ప్రారంభించాయి. 4G రేట్లకే 5G సేవలు అందిస్తూ, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో, అతి పెద్ద ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రం 4G సేవలను పూర్తి స్థాయిలో అందించడానికే ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. 

ఈ నేపథ్యంలో, BSNLను కూడా 5G రేసులోకి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లో ఈ టెలికాం కంపెనీ 5G సేవలను ప్రారంభించేలా సిద్ధం చేస్తోంది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఈ విషయాన్ని వెల్లడించారు. ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5G సేవలను ఆయన ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా రాజధాని నగరమైన భువనేశ్వర్‌తో పాటు కటక్‌లోనూ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Bharati Airtel) 5G సర్వీసులు ప్రారంభమయ్యాయని, మరో రెండేళ్లలో ఒడిశా అంతటా ఈ వేగమంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. కొత్త ఏడాదిలో గణతంత్ర దినోత్సవం నాటికి (2023 జనవరి 26వ తేదీ లోపు) ఒడిశాలో 5G సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని, అనుకున్న సమయానికి ఆ పని పూర్తయిందని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు వంద 4G టవర్లను సైతం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా, BSNL 5G సర్వీసుల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4G నెట్‌వర్క్‌ను 5Gలోకి మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. 4G నెట్‌వర్క్‌ను 5Gలోకి అప్‌గ్రేడ్‌ చేయడానికి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) & సి డాట్‌ (C-DOT) నేతృత్వంలోని కన్సార్టియంను BSNL షార్ట్‌ లిస్ట్ చేసిందని వెల్లడించారు. ఈ కన్సార్టియంతో BSNL కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం... ఆర్డర్ చేసిన తేదీ నుంచి దాదాపు ఒక సంవత్సరంలో, ఆ  4G నెట్‌వర్క్‌ మొత్తాన్ని 5Gలోకి అవి అప్‌గ్రేడ్‌ చేస్తాయని కేంద్ర మంత్రి వివరించారు. ఈ లెక్కన, BSNL వినియోగదారులకు 5G సేవలు ఇప్పట్లో లేనట్లే. మరో ఏడాది పాటు ఎదురు చూస్తే తప్ప BSNL 5G సర్వీసులను ఉపయోగించుకోలేరు.

5000 మొబైల్ టవర్లను ఏర్పాటుకు రంగం సిద్ధం
ఒడిశా రాష్ట్రంలో టెలికాం కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 5,600 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఒడిశాలోని 100 గ్రామాలను కవర్ చేస్తూ, 4G సేవల కోసం 100 టవర్లను ప్రారంభించామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కమ్యూనికేషన్ సౌకర్యాలతో 5,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Hyderabad Latest News: హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.