అన్వేషించండి

Mercedes-Benz EQS 580: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 850 కి.మీ వెళ్లొచ్చు, మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ బెంజ్ కారు!

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బెంజ్ కారు లాంచ్ అయ్యింది. ఒక్కఛార్జ్ తో ఈ కారు ఏకంగా 850 కిలో మీటర్లు ప్రయాణించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కారును విడుదల చేశారు.

గ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్ లో తొలి ఎలక్రిక్ కారును లాంచ్ చేసింది. ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ పేరుతో మేడిన్ ఇండియా కారుగా దీనిని రూపొందించారు. ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్‌ లో 15 నిముషాలు ఛార్జ్ చేస్తే  300 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఫుల్ ఛార్జ్ చేస్తే 850 కిలో మీటర్లకు పైగా జర్నీ చేయవచ్చని తెలిపింది. ఈ కారు ధర(ఎక్స్‌ షోరూంలో) రూ.1.55 కోట్లుగా కంపెనీ ఫిక్స్ చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెన్నైలో ఈ కారును  ఆవిష్కరించారు. పుణె సమీపంలోని చకాన్ ప్లాంట్‌ లో ఈ కారు తయారు చేయబడింది. సూపర్ లగ్జరీ విభాగంలో ఈ కారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ఇప్పటికే  భారత్‌లో ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ తయారీని మొదలు పెట్టింది. జర్మనీ బయట కేవలం భారత్‌లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నది. అంతేకాదు..  కంపెనీ నుంచి భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్ కూడా ఇదే. 14వ మేడిన్‌ ఇండియా మోడల్‌ గా ఈక్యూఎస్‌ 580 4 మేటిక్‌ గుర్తింపు పొందింది. ఈ కారు మెర్సిడెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడింది. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ లుక్స్ పరంగా AMG ట్విన్‌ ని పోలి ఉంది.  స్పోర్టీ లుక్ కోసం ఈ వెహికల్ లో అద్భుతమైన LED హెడ్‌ ల్యాంప్‌ లు ఏర్పాటు చేయబడ్డాయి. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్‌ని కలిగి ఉంది.  ఫ్రేమ్‌ లెస్ డోర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్‌ చేస్తే  857 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.  ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే కారుగా గుర్తింపు దక్కించుకుంది. ప్రతి యాక్సిల్‌ పై ఒక మోటార్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ భారీ స్థాయిలో  శక్తిని ఇస్తుంది. 107.8 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.  ఇది 523 bhp శక్తిని, 856 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. వాస్తవానికి బెంజ్ కంపెనీ ఈ కారును 2021లో తొలిసారిగా పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఈకారో మళ్లబోతున్నట్లు వెల్లడించింది.   మెర్సిడెస్, ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై ఫోకస్ పెట్టింది. భారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నది.   

Also Read: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget