అన్వేషించండి

మూల్పూరి కళ్యాణి అరెస్టుపై టీడీపీ ఆగ్రహం- జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్ వ్యవహరం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేస్తోంది.

మూల్పూరి కళ్యాణి కేసులో పోరు తీవ్రం చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. న్యాయపోరాటంతోపాటు కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఆమెను పోలీసులు ఇష్టానుసారంగా లాక్కెళ్లి అరెస్ట్ చేయటాన్ని టీడీపీ తప్పు పడుతోంది. బెడ్ రూంలోకి వెళ్ళి మరి ఆమెను ఇబ్బందులకు గురి చేయటంపై సీరియస్‌ అవుతోంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, డీజీపీకి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖలు చేశారు.

మహిళా నేత బెడ్ రూంలోకి పోలీసులు..
తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్ వ్యవహరం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేస్తోంది. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (NCW), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌(AP DGP)కి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. బెడ్‌రూంలోకి వెళ్ళి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించటం దారుణమయిన చర్యగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై జోక్యం చేసుకొని మహిళగా కళ్యాణికి న్యాయం చేయాలని తెలుగు మహిళలు ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

డ్రగ్స్‌కు అడ్డగా మారింది: అనిత
గత మూడున్నరేళ్లలో డ్రగ్స్‌ను ఆధారంగా చేసుకొని జరిగే నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని ఈ సందర్బంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంతోపాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష  కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని వ్యాఖ్యానించారు. గన్నవరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దాడి చేస్తే తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణిని నిందితురాలిగా చేర్చారని, ఏప్రిల్ 10న గన్నవరం, హనుమాన్ జంక్షన్ పోలీసులు కళ్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా తీసుకెళ్ళటం దారుణమైన చర్యని ఆవేదన వెలిబుచ్చారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని, తమ సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని బలవంతం చేయటం హేయమయిన చర్యని అన్నారు. తన వ్యక్తి గత స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడం కాకుండా, మహిళ అనే కనీస మర్యాదలను కూడా పాటించకపోవటం వెనుక రాజకీయ కుట్రకోణం ఉందన్నారు. 

మహిళలపై నేరాలు కట్టడి చేయాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోసుకుంటున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. కళ్యాణి అక్రమంగా అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరుతున్నట్లు చెప్పారు.

చట్టపరంగా పోరాటం....
తెలుగు దేశం పార్టీకి చెందిన గన్నవరం మహిళా నాయకులు మూల్పూరి కళ్యాణిని అక్రమంగా అరెస్ట్ చేయటంతోపాటు, మహిళను అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల కనీస మర్యాదలు పాటించకపోవటం, బెడ్ రూంలోకి వెళ్ళి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించటంపై తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు భగ్గుమంటున్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంతోనే ఇలా దారుణంగా ప్రవర్తించారని తెలుగు దేశం ఆరోపిస్తుంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నల్లోనే అంతా జరిగిందని ఈ ఘటనపై అవసరం అయితే న్యాయ స్దానంలో ప్రైవేట్ కేసు దాఖలు చేసేందుకు చట్టపరమైన అంశాలను కూడా తెలుగు దేశం పరిశీలిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget