అన్వేషించండి

Buddha Venkanna: ఎమ్మెల్యే పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి: బుద్దా వెంకన్న డిమాండ్

TDP activist Murder: జల్లయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు పల్నాడు బయలుదేరిన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. చివరగా ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుంది, హత్య లు చేయమని సీఎం ప్రోత్సహిస్తున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో జరిగిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పల్నాడు బయలుదేరిన బుద్దా వెంకన్నను అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. చివరగా బుద్దా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

సీఎం ప్రోత్సహించడంతోనే హత్యలు
సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైఎస్సార్ సీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, అందుకే ఆ పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ పల్నాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ గూండాలు చంపేశారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి అని ఆరోపించారు. పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. 

వైఎస్సార్‌సీపీ అల్లరి మూక దాడిలో చనిపోయిన జల్లయ్య మృతదేహానికి‌ నివాళి అర్పించడానికి మేము‌ ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులను , ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారు. డీజీపీ ఆఫీసు నుంచి వస్తున్న ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు తప్ప.. శాంతిభద్రతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

అప్పుడు సవాంగ్‌ను ఇప్పుడు రాజేంద్రనాథ్‌ను..
గతంలో మూడేళ్లు గౌతమ్ సవాంగ్ ను వాడుకుని పంపేశారని, రేపు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనని తెలుసుకోవాలని సూచించారు.  ఎవరినైనా సీఎం జగన్.. యూజ్ అండ్ త్రో గానే చూస్తారని బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక.. సీఎం జగన్ ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు, నేతల హత్యలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు త్వరలోనే తరిమికొట్టి బుద్ధి చెబుతారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 

ప్రధాన కుట్ర దారుడు ఎమ్మెల్యే పిన్నెల్లి
‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది. హత్యా రాజకీయాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. పల్నాడులో ముగ్గురు బీసి టీడీపీ కార్యకర్తలను హతమార్చారు. ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్షలు లేవు. జల్లయ్య మృతదేహానికి నివాళులు అర్పించకూడదా?  కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లింది. బీసీ నాయకుల హత్యల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన కుట్ర దారుడు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు బుద్ధా వెంకన్న. 

Also Read: TDP Activist Murder: పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాల వద్ద ఉద్రిక్తత, బలవంతంగా మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget