అన్వేషించండి

Kollu Ravindra Comments: కమీషన్ల కోసం వైసీపీ నేతల కక్కుర్తి, బందరు పోర్టు నాశనం చేశారు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Comments: వైసీపీ నేతల కక్కుర్తి రోజురోజుకీ పెరిగిపోతుందని.. కమీషన్ల కోసం బందరు పోర్టును కూడా నాశనం చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 

Kollu Ravindra Comments: అధికార పార్టీ వైసీపీ నాయకులు రోజురోజుకీ కమీషన్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. చివరకు బందరు పోర్టు విషయంలో కమీషన్ల కోసం విపరీతమైన దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయని ప్రభుత్వం రూ.వేల కోట్లతో పోర్టు నిర్మాణం చేపడతామంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు కొల్లు రవీంద్ర. మరో పక్క పర్యావరణ అనుమతులు రాని క్రమంలో ఇటీవల పెడన వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోర్టు విషయంలో ఇప్పుడే శుభవార్త అందిందని ప్రకటించడం, తాజాగా ఎంపీ బాలశౌరి డిసెంబరులో పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పడం వినడానికే వింతగా ఉందన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు.. కానీ ! 
టీడీపీ ప్రభుత్వ హయాంలో 12 జెట్టీలతో ప్రతి బెర్తు వరకు ఓడలు వచ్చేలా ప్రతిపాదనలు ఇస్తే వాటిని చేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా 6 జెట్టీలతో పరిమిత లోతుతో పోర్టు అంటున్నారని, అటువంటి పోర్టు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. పోర్టు పేరుతో తీసుకునే రుణాల్లో కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఓ పెద్ద రెడ్డి చేతిలో పెట్టారని, పోర్టును కూడా ఆయనకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు కం రైల్వే కనెక్టివిటీ కోసం ముడకు రూ.100 కోట్లు ఇచ్చే పరిస్థితిలో లేని ప్రభుత్వం రూ.5,000 కోట్లతో పోర్టు ఎలా నిర్మిస్తుందని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందులు, బెడ్‌లు, మృతదేహాలను తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా లేవని, ఇన్ని సమస్యలు వదిలేసి కమీషన్ల కోసం పోర్టు అంటూ నాటనం ఆడుతున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్‌లో విద్యార్థి చనిపోతే ఆచూకీ కనిపెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులే గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బండిపై తరలించే దయనీయ స్థితి ఏర్పడటం చాలా బాధాకరం అన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బందరు మంగినపూడి బీచ్ లో విద్యార్థి గల్లంతు అయితే ప్రభుత్వం గాలింపు చర్యలు కూడా చేపట్టలేదని.. కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. మృతదేహం లభ్యమైన తర్వాత అధికారులు స్పందించలేదన్నారు. కుటుంబ సభ్యులే బైక్ పై మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న కొల్లు రవీంద్ర మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

వైసీపీ నాయకులు ఇకనైనా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం మానాలని సూచించారు. నాయకులు గోపు సత్యనారాయణ, ఇలియాస్‌పాషా, లంకె నారాయణప్రసాద్‌, బొడ్డు నాగరాజు, కాంతారావు, కార్పొరేటర్లు తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
Embed widget