అన్వేషించండి

TDP leaders press meet : సెమీఫైనల్స్‌లో విజయం సాధించాం - ఇక దూసుకెళ్తామన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు !

సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించామని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

 

TDP leaders press meet : సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించామని ఇక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని  ఆ పార్టీ  నేతలు విశాఖలో మీడియా సమావేశం పెట్టి ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో అభివృద్ధి మెథడ్ లో పాలన సాగలేదు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.  డిస్ట్రక్షన్ మోడ్ లో వైసీపీ పరిపాలన సాగించిందన్నారు.  జగన్ కూల్చివేతలతో పాలన మొదలుపెట్టారని... అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికల్లో అక్రమాలతో గెలిచారన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అగ్రనేతలు మోహరించి అనేక  రకాల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  అయినా పట్టభద్రులు వైసీపీని నమ్మలేదని గుర్తు చేశారు.                       

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ గెలుపుతో వైసీపీ పతనం ప్రారంభం    : గంటా                              

మొదటి ప్రాధాన్యత లోనే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని భావించామన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు.  టీడీపీ అద్భుతమైన విజయం సాధిస్తే అధికార పార్టీ పేపర్ కి కనిపించలేదన్నారు.  ఈ ఎన్నికల్ని సెమి ఫైనల్ గా బావించామని..  అద్భుత విజయం సాధించామని గంటా శ్రీనివాసరావు సంతోషం ్యక్తం చేసారు.  కేపిటల్ ముసుగులో విశాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు వైసీపీ నేతలపై మండిపడ్డారు. గంగవరం పోర్టుని ఆదానికి అప్పనంగా అప్పగించారని..  స్టీల్ ప్లాంట్ ని  కాపాడుకునే ప్రయత్నం వైసీపీ చేయలేదన్నారు.  వైసీపీ చేసిన దుర్మార్గాలను పట్టభద్రులు గుర్తుంచుకున్నారని ... తగిన రీతిలో జగన్ కి పట్టభద్రులు బుద్ధిచెప్పారన్నారు. 

రాజధాని పేరుతో మోసగించాలని చూశారు : బండారు                                    
  
రాజధాని పేరుతో మోసాగించాలని జగన్ కలలు కన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వివరించారు.  గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని..  ఆరు లక్షలమందికి ఉద్యోగాలు అని చెప్పినా వైసీపీని నమ్మలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో పట్టభద్రులు జెల్లకొట్టారని ఇప్పటికైనా వైసీపీ నేతలు నిజాయితీగా ఉండాలన్నారు. 

టీడీపీ ప్రభుత్వం కోసం ప్రజలు కోరుకుంటున్నారు : వేపాడ                          

ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లుగా రుజువైందని..  ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీవి రావు ప్రకటించారు. ఈ గెలుపులో 98 శాతం తెలుగుదేశంపార్టీ రెండు శాతం తన గుర్తింపు సహకరించాయన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్ల తాను గెలిచానని భావిస్తున్నారు.  ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP DesamJr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Embed widget