అన్వేషించండి

Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhra Pradesh Rains | నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాలు తెలంగాణ ప్రవేశం.
  • తెలంగాణలో వర్షాలు, ఈ ఏడాది వర్షపాతం లోటు అంచనా.

అమరావతి: కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దని ప్రజలకు సూచించారు.

కొన్ని చోట్ల వడగాల్పులు
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పిడుగులు, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇంకా తగ్గని భానుడి ప్రతాపం.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నేడు 42 నుంచి 44 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదు కానుంది. కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అత్యవసరంగా బయటకు వెళ్తే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా కండువా లేదా టోపీ ధరించాలని ప్రజలకు సూచించారు. ​

Also Read: School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురవడంతో వాతావరణం కూల్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం వనపర్తి జిల్లా ఏదుల మండలంలో గరిష్టంగా 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
తెలంగాణలో నేడు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, కందుకూర్, యాచారం బెల్ట్ మీదుగా కడ్తాల్, కేశంపేట, ఆమనగల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. 

50% సాధారణ వర్షాలు - 50% లోటు వర్షాలు
ఈ ఏడాది వర్షపాతం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందని, సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది (2025) కురిసిన భారీ వర్షాలను ఈసారి అస్సలు ఆశించలేమని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నెలల వారీగా వర్షాల గమనాన్ని పరిశీలిస్తే.. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 

అయినప్పటికీ, ఈ ఏడాది వర్షాలు 2014-15 నాటి కరువు పరిస్థితుల వలె మరీ దారుణంగా ఉండకపోవచ్చని, కానీ గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాల వర్షపాతం  తగ్గుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది లోటు వర్షాల ప్రభావం తెలంగాణలోని దక్షిణాది, ఉత్తరాది జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది సాధారణం నుండి స్వల్పంగా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఎప్పుడు కురుస్తాయి?

కర్ణాటక ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉంటాయి.

ఏపీలో పిడుగుల వర్షాల ముప్పు ఉన్న జిల్లాలు ఏవి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దు.

ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత ఎలా ఉంది?

రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అత్యవసరంగా బయటకు వెళ్తే కండువా లేదా టోపీ ధరించాలి.

తెలంగాణలో రుతుపవనాల పరిస్థితి ఎలా ఉంటుంది?

నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయి. జూన్, జూలైలలో సాధారణ వర్షపాతం, ఆగస్టు, సెప్టెంబర్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు అంచనా.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget