అన్వేషించండి

Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhra Pradesh Rains | నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాలు తెలంగాణ ప్రవేశం.
  • తెలంగాణలో వర్షాలు, ఈ ఏడాది వర్షపాతం లోటు అంచనా.

అమరావతి: కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దని ప్రజలకు సూచించారు.

కొన్ని చోట్ల వడగాల్పులు
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పిడుగులు, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇంకా తగ్గని భానుడి ప్రతాపం.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నేడు 42 నుంచి 44 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదు కానుంది. కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అత్యవసరంగా బయటకు వెళ్తే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా కండువా లేదా టోపీ ధరించాలని ప్రజలకు సూచించారు. ​

Also Read: School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురవడంతో వాతావరణం కూల్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం వనపర్తి జిల్లా ఏదుల మండలంలో గరిష్టంగా 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
తెలంగాణలో నేడు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, కందుకూర్, యాచారం బెల్ట్ మీదుగా కడ్తాల్, కేశంపేట, ఆమనగల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. 

50% సాధారణ వర్షాలు - 50% లోటు వర్షాలు
ఈ ఏడాది వర్షపాతం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందని, సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది (2025) కురిసిన భారీ వర్షాలను ఈసారి అస్సలు ఆశించలేమని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నెలల వారీగా వర్షాల గమనాన్ని పరిశీలిస్తే.. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 

అయినప్పటికీ, ఈ ఏడాది వర్షాలు 2014-15 నాటి కరువు పరిస్థితుల వలె మరీ దారుణంగా ఉండకపోవచ్చని, కానీ గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాల వర్షపాతం  తగ్గుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది లోటు వర్షాల ప్రభావం తెలంగాణలోని దక్షిణాది, ఉత్తరాది జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది సాధారణం నుండి స్వల్పంగా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఎప్పుడు కురుస్తాయి?

కర్ణాటక ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉంటాయి.

ఏపీలో పిడుగుల వర్షాల ముప్పు ఉన్న జిల్లాలు ఏవి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దు.

ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత ఎలా ఉంది?

రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అత్యవసరంగా బయటకు వెళ్తే కండువా లేదా టోపీ ధరించాలి.

తెలంగాణలో రుతుపవనాల పరిస్థితి ఎలా ఉంటుంది?

నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయి. జూన్, జూలైలలో సాధారణ వర్షపాతం, ఆగస్టు, సెప్టెంబర్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు అంచనా.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Mudragada Padmanabham Funeral Chaos: ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Chandra Babu Comments:
"సముద్రంలోకి వెళ్లే జలాలు వాడుకుంటే సంపద సృష్టి జరిగినట్టే! నదుల అనుసంధానంతో కరవు పరార్‌" ముఖ్యమంత్రి చంద్రబాబు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Embed widget