అన్వేషించండి

Chittoor News: చిత్తూరు వైఎస్సార్ సీపీలో వారికే కీలక పదవులు! మొదటి నుంచి జగన్‌ను ఆకట్టుకున్న లీడర్లు వీరే!

Chittoor YSRCP News: చరిత్ర చూడని విజయం... కనివీని ఎరుగని మెజారిటీ... ఐదేళ్ల కాలం పూర్తి అవగానే పాతాళానికి పడిపోయారు... అయితే ఏం మరో ఐదేళ్లలో పుంజుకోవడానికి రెడీ అయింది వైఎస్సార్ సీపీ.

Chittoor Political News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో అనుభవం కలిగిన నాయకుడు కావాలని ప్రజలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. 2019 ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ ని పక్కన పెట్టి వైఎస్సార్ సీపీ కి దేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా 151 స్థానాలతో అధికారం ఇచ్చారు. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని వై నాట్ 175 అన్న పరిస్థితి నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం చేసారు. వైసీపీ అధికారం లో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీల పై మాటలు తూటాలు, వ్యక్తిగత జీవితాలు, బూతులు తో రాజకీయం చేసారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ సాధించిన సీట్లు అధికం అంటే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓటమి తరువాత వైసీపీ కొన్ని రోజు పాటు నిరాసకు గురైంది. అయితే ఏమ్ కూటమి ప్రభుత్వానికి సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా లేని పార్టీ గా మారినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కూటమి ప్రభుత్వం చేసే వాటిలో తప్పులను వెతుకుతూ నెల రోజుల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇక పై వచ్చే ఐదేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఓటమి సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వారికి కీలక పదవులు

వైసీపీ అధికారంలోకి రావడానికి.. వచ్చిన తరువాత.. తిరిగి ఓటమి పాలైన తరువాత జగన్ కు అండగా నిలిచింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ మంత్రి గానే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు ఎమ్మెల్యే గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే గా పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, రాజంపేట ఎంపీ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC MEMBER)గా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మరియు తిరుపతి జిల్లా లోని తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల అధ్యక్షుడిగా ప్రకటించారు.

ఇక పార్టీ గెలుపు, ఓటమిలో భాగస్వామ్యం అయిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, వైసీపీ పార్టీ కి అనుకూలంగా మాట్లాడి... పవన్ కళ్యాణ్ పై దూషణలు చేసి ట్రోలింగ్ అయిన యాంకర్ శ్యామల కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధుల హోదా కల్పించారు. చివరి నిమిషంలో శ్యామల, అప్పుడు అప్పుడు జూపూడి ప్రభాకరరావు వైసీపీ నుంచి పొగిడే వారు. రోజా ప్రతిపక్ష పార్టీలపై మాటలు యుద్దం చేసేవారు. ఇక కరుణాకరరెడ్డి ఎవరిపై కూడా దూషణలు లేకుండా పార్టీ నిర్ణయం మేరకు పని చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. వీరికి పార్టీ ఇచ్చిన హోదాల్లో ఏ మేరకు పని చేస్తారో వేచి చూడాలి.

నగరి నియోజకవర్గం లో సస్పెండ్

నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో రోజా అనుకూల వర్గం... వ్యతిరేక వర్గం ఉండేది. వ్యతిరేక వర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులుగా చలామణి అయ్యారు. రోజాకు గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఫిర్యాదు చేసారని... మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి చెప్పింది చేయలేదని పలుమార్లు ఫిర్యాదులు సైతం చేసారని ఆరోపణలు స్వయాన వైసీపీ పార్టీలోని రోజా అనుకూల వర్గం చెప్పింది. పార్టీ ఓటమి తరువాత ఇటీవల నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీకి, తనకు వ్యతిరేకంగా పని చేసిన ఇద్దరి గురించి రోజా జగన్ దృష్టికి తీసుకెళ్లింది. తన ఓటమిలో భాగస్వామ్యం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దానిపై స్పందించిన జగన్ నగరి నియోజకవర్గం నుంచి ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని సస్పెండ్ చేశారు. అయితే ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా వ్యతిరేకతకు కారణమని, ఆయన మాట కూడా పక్కన పెట్టి రోజా చెప్పిన వారినే సస్పెండ్ చేసారని కొందరు అంటున్నారు. ఇక వైసీపీ పార్చీ వచ్చే ఐదేళ్ల కాలంలో ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget