అన్వేషించండి

Paritala Sunitha About Jagan: పిన్నమ్మను, షర్మిలను పట్టించుకోని జగన్, మహిళలకు ఏం న్యాయం చేస్తారు?: పరిటాల సునీత

Paritala Sunitha Fires on YS Jagan: పిన్నమ్మకు, చెల్లెలికి న్యాయం చేయలేని ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళల్ని ఉద్ధరించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత.  

YSR Aasara Scheme Money Released: అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉరవకొండలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో నగదు జమ చేశారు. అయితే సీఎం జగన్ (AP CM YS Jagan) ఇచ్చింది ఆసరా కాదని టోకరా అని, ఇచ్చేది గోరంత అయితే, దోచేది కొండంత అంటూ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత సెటైర్లు వేశారు. మహిళల తాళిబొట్లు తెంచిన ఘనుడు జగన్ రెడ్డి అంటూ Paritala Sunitha మండిపడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన దాని కన్నా తక్కువ లబ్ధి చేకూర్చినా ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. పిన్నమ్మకు, చెల్లెలికి న్యాయం చేయలేని జగన్ మహిళల్ని ఉద్ధరించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.       
డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు హయాంలో కోటిమంది మహిళలు రూ. 20 వేల మేర లబ్ధిపొందారని పరిటాల సునీత అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఒక్కొక్క మహిళ పొందిన లబ్ధి రూ. 15 వేలకు తగ్గిపోయింది. ఈ రకంగా 50 లక్షలమంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా వేసినట్లే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కోటీ 14 లక్షలమంది డ్వాక్రా మహిళలుంటే 79 లక్షలకే కుదించి.. 35 లక్షలమందికి మొండిచేయి చూపారని పేర్కొన్నారు.

మద్యం రేట్లు మూడు రెట్లు పెంచడంతో పాటు రూ. 2 లక్షల విలువ గల నాసిరకం మద్యం అమ్మారని చెప్పారు. నాసిరకం మద్యంతో 35 లక్షలమంది ఆరోగ్యాలు నాశనం చేశాడని.. అందులో 30 వేల మంది అకాలమృత్యువాత పడ్డారని ఆరోపించారు. నాసిరకం మద్యం ద్వారా మహిళల మాంగల్యాలు మంటగలుపుతున్న సీఎంగా జగన్ ఘనత సాధించాడన్నారు. బాబాయ్ వివేకా హత్యతో పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న సీఎం జగన్ మహిళా ద్రోహి కాదా? చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వని జగన్ మహిళాద్రోహి కాదా అని ప్రశ్నించారు.

ఒక్కో కుటుంబంపై 57 నెలల పాలనలో రూ. 3 లక్షల భారం మోపారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీ రూ.5 లక్షలకు వర్తింపజేస్తే, దాన్ని జగన్ రూ. 3 లక్షలకు కోత కోసి మోసం చేశారన్నారు. ఆ రూ. 3 లక్షలకు కూడా సున్నా వడ్డీ కేంద్రమే భరిస్తోందన్నారు. ఉచిత ఇళ్లు అంటూ ఒక్కో మహిళ నుంచి రూ. 10 వేల నుంచి రూ. 30 వేలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి ఏడాది నుంచే 3 వేల ఇళ్లు ఇచ్చి ఉండేవారని.. వాయిదాల వల్ల ఒక్కో అవ్వాతాత రూ. 30 వేలు నష్టపోయారని పేర్కొన్నారు. 

జగన్ పెంచింది కేవలం రూ. 1000.. 
అంగన్వాడీల జీతాలు చంద్రబాబు రూ. 6,300 పెంచితే.. జగన్ పెంచింది కేవలం రూ. 1000 మాత్రమేనని పరిటాల సునీత తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నాటికి డ్వాక్రా సంఘాల ఎన్.పి.ఏలు 10.33 శాతం (SLBC -182) ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి 1.56 శాతానికి తగ్గించామన్నారు. కానీ జగన్ 18 శాతం అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
జగన్ హయాంలో మహిళలపై 2 లక్షల నేరాలు
‘NCRB ప్రకారం ఒక్క 2022లోనే మహిళలపై 25,503 నేరాలు జరిగాయి. 601 అత్యాచారాలు,180 అత్యాచార యత్నం ఘటనలు వెలుగుచూశాయి. జాతీయ స్థాయిలో మహిళలపై నేరాల రేటు 66.4% కాగా, ఏపీలో మాత్రం 96.2% గా ఉంది. వైసీపీ పాలనలో 30,196 మంది మహిళలు, చిన్నారులు మిస్సయ్యారు. 2019తో పోలిస్తే 2021 మహిళల అదృశ్యం ఘటనలు 43.45 %, చిన్నారుల మిస్సింగ్ ఘటనలు 53.61% పెరిగాయి. జగన్ హయాంలో మహిళలపై 2 లక్షలకు పైగా నేరాలు నమోదయ్యాయి. దిశా చట్టం ప్రచారార్భాటానికే పరిమితమైంది. 

జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న 12.6% బాలికలు గర్భం దాల్చుతున్నారు. ఈ దారుణాల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీలో 1,33,447మంది వ్యభిచారకూపంలో చిక్కుకున్నారు. ఇందులోనూ ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నా.. మహిళలను బాగు చేశాను, మహిళలను ఉద్దరించాను అని జగన్ చెప్పుకోవడం మోసకారితనమే’ అని ఏపీ సీఎంపై పరిటాల సునీత మండిపడ్డారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget